ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సెప్టెంబర్ 2న బీహార్ రాజ్య జీవిక నిధి రుణ సహకార సంఘం లిమిటెడ్ ను ప్రారంభించనున్న పీఎం


గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు నిధులను అందించేందుకు జీవిక నిధి

జీవిక నిధి పూర్తిగా డిజిటల్‌... ప్రత్యక్ష, పారదర్శక నిధుల బదిలీలకు భరోసా

Posted On: 01 SEP 2025 3:28PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో మాధ్యమం ద్వారా బీహార్ రాజ్య జీవిక నిధి రుణ సహకార సంఘం లిమిటెడ్ ను ప్రారంభించనున్నారుఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆ సంస్థ బ్యాంకు ఖాతాకు రూ.105 కోట్లను కూడా బదిలీ చేస్తారు.

జీవికతో అనుబంధం ఉన్న సంఘ సభ్యులకు సులభంగా, తక్కువ వడ్డీ రేటుకు నిధులను అందించడం జీవిక నిధి స్థాపన ముఖ్య ఉద్దేశ్యంజీవికలో నమోదు చేసుకున్న అన్ని క్లస్టర్-స్థాయి సమాఖ్యలు ఈ సొసైటీలో సభ్యులుగా ఉంటాయిఈ సంస్థ కార్యకలాపాల కోసం బీహార్ ప్రభుత్వంకేంద్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తాయి.

గత కొన్నేళ్లుగా జీవిక స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళల్లో పరిశ్రమల ఏర్పాటులో వృద్ధి కనిపిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక చిన్న సంస్థలుఉత్పత్తిదారుల కంపెనీలు నెలకొన్నాయి.

అయినప్పటికీ, మహిళా పారిశ్రామికవేత్తలు తరచుగా 18%–24% అధిక వడ్డీ రేట్లను వసూలు చేసే సూక్ష్మ రుణ సంస్థలపై ఆధారపడవలసి వస్తోందిఎంఎఫ్ఐలపై ఆధారపడటాన్ని తగ్గించితక్కువ వడ్డీ రేట్లకు ఎక్కువ రుణాన్ని సకాలంలో అందించేందుకు జీవికా నిధిని ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థగా రూపొందించారు.

 

ఇది పూర్తిగా డిజిటల్ ఆధారిత వ్యవస్థ. దీనివల్ల జీవిక సభ్యులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మరింత వేగంగాపారదర్శకంగా బదిలీ అవుతాయిఈ విధానాన్ని సులభతరం చేసేందుకు 12,000 మంది కమ్యూనిటీ కార్యకర్తలకు మినీ కంప్యూటర్ల (ట్యాబ్ లు)ను ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమం గ్రామీణ మహిళల్లో వ్యాపార నైపుణ్యాలను పెంపొందించి, సంఘ ఆధారిత వ్యాపారాల వృద్ధిని వేగవంతం చేసే అవకాశం ఉందిబీహార్ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది మహిళలు ఈ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.

 

 

***

 

(Release ID: 2162826) Visitor Counter : 4