రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

గణేశ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

Posted On: 26 AUG 2025 4:50PM by PIB Hyderabad

గణేశ చతుర్థి సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఒక సందేశంలో రాష్ట్రపతి ఇలా పేర్కొన్నారు: -

‘‘గణేశ చతుర్థి శుభ సందర్భంగాదేశ విదేశాల్లోని భారతీయులందరికీ మనస్ఫూర్తిగా నేను నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొంటాం. భగవాన్ శ్రీ గణేశుని జ్ఞానాధిపతిగాశ్రేయోనిధిగా ఆరాధిస్తాంఏదైనా కొత్త పనిని మొదలుపెట్టేటప్పుడు ఆయన ఆశీర్వాదాలు కావాలని మనం కోరుకుంటాంవిఘ్నాలను తొలగించమంటూ ప్రార్థిస్తాంఈ పర్వదినం కొత్త లక్ష్యాలను సాధించడానికిసానుకూల భావనతో ముందుకు పోయేందుకు మనకందరికీ ప్రేరణనిస్తుంది.

మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ, స్వచ్ఛ హరితసమృద్ధితో కళకళలాడే దేశాన్ని నిర్మించే మార్గంలో కలిసికట్టుగా ముందుకు సాగే ఉద్దేశంతో ఈ పండుగను జరుపుకొందాం రండి.’’

రాష్ట్రపతి సందేశాన్ని చూడడానికి ఈ కింది వాక్యాన్ని క్లిక్ చేయగలరు..

Click here to see the President's message 

 

***


(Release ID: 2160910)