ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతరిక్ష రంగంలో భారత్ ప్రయాణం అద్భుతం....


సరికొత్త అవకాశాల దిశగా యువతనీ, అంకుర సంస్థల్నీ ప్రోత్సహిస్తున్న సంస్కరణలు: ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 AUG 2025 1:03PM by PIB Hyderabad

భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల నైపుణ్యాలుప్రతిభతో అంతరిక్ష ప్రపంచంలో భారత్ విశేషమైన పురోగతిని సాధిస్తోందని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

తమ ప్రభుత్వం అంతరిక్ష రంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని ప్రధానమంత్రి తెలిపారుఇవి యువతప్రైవేటు రంగంఅంకుర సంస్థలు కొత్త అవకాశాలను అన్వేషించటానికి ఉపయోగపడ్డాయన్నారుఇవన్నీ భారతదేశ అంతరిక్ష ప్రయాణానికి అర్థవంతంగా దోహదపడతాయని చెప్పారు.

రాబోయే రోజుల్లో అంతరిక్ష రంగంలో దేశం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనిజాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారుదేశ అంతరిక్ష ప్రయాణాన్ని మరింత శక్తివంతం చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

'ఎక్స్వేదికగా చేసిన పోస్టుల్లో మైగవ్ ఇండియా చేసిన భారత అంతరిక్ష ప్రయాణంభారతదేశ అంతరిక్ష అంకురల సంస్థల విజయాలపై శ్రీ మోదీ స్పందిస్తూ ఇలా అన్నారు;

"140 కోట్ల భారతీయుల నైపుణ్యంతోమన దేశం అంతరిక్ష ప్రపంచంలో విశేషమైన పురోగతిని సాధిస్తోందిమనం మరింత అభివృద్ధిని సాధించబోతున్నాం!

#NationalSpaceDay"

"మన ప్రభుత్వం అంతరిక్ష రంగంలో అనేక సంస్కరణలు చేపట్టిందిఇవి యువతప్రైవేట్ రంగంఅంకుర సంస్థలు సరికొత్త అవకాశాలను అన్వేషించటానికిభారతదేశ అంతరిక్ష ప్రయాణానికి అర్థవంతంగా తోడ్పడతాయి.

#NationalSpaceDay”


(రిలీజ్ ఐడి: 2160356) సందర్శకుల సూచీ సంఖ్య : : 25