ప్రధాన మంత్రి కార్యాలయం
జీవన, వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించే తర్వాతి తరం సంస్కరణలపై ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని
प्रविष्टि तिथि:
18 AUG 2025 8:40PM by PIB Hyderabad
తర్వాతి తరం సంస్కరణలకు సంబంధించిన ప్రణాళికపై చర్చించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అధ్యక్షత వహించారు. జీవన, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే, సమ్మిళిత సంక్షేమాన్ని పెంపొందించే వేగవంతమైన, సమగ్రమైన సంస్కరణలను అందించడమే ఈ సమావేశ లక్ష్యం.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘తర్వాతి తరం సంస్కరణలను సిద్ధం చేసే ప్రణాళికను చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించారు. అన్ని రంగాల్లోనూ జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యాన్ని, సంక్షేమాన్ని పెంపొందించే వేగవంతమైన సంస్కరణలకు మేం కట్టుబడి ఉన్నాం.’’
(रिलीज़ आईडी: 2157734)
आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam