ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో రూ.5,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


* ప్రస్తుతం ప్రపంచమంతా వికసిత్ భారత్ సంకల్పం గురించే చర్చ మౌలిక వసతుల్లో మార్పునకు ప్రతిబింబం ఈ పునాదులపైనే అభివృద్ధి చెందిన భారత్: పీఎం

* ఒకటే దేశం, ఒకటే గ్యాస్ గ్రిడ్ లక్ష్యం ఆధారంగా పనిచేశాం... ప్రధానమంత్రి ఊర్జా గంగా పరియోజనను రూపొందించాం: పీఎం

* 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చేయాలి... మన మార్గం అభివృద్ధి ద్వారా సాధికారత, స్పందన ద్వారా సుపరిపాలన: పీఎం

Posted On: 18 JUL 2025 5:10PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్‌లో రూ.5,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనప్రారంభోత్సవం చేయగాపూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారుఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన దుర్గాపూర్భారతీయ శ్రామిక శక్తికి కూడా ఒక ప్రధాన కేంద్రమని ప్రధాని అన్నారుదేశాభివృద్ధికి ఈ నగరం అందిస్తున్న గణనీయమైన సహకారాన్ని గుర్తిస్తూ.. దాని సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఈ రోజు లభించిందన్నారుఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తాయనిగ్యాస్ ఆధారిత రవాణానుఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తాయనిఉక్కు నగరంగా దుర్గాపూర్ గుర్తింపును పెంపొందిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారుఈ ప్రాజెక్టులన్నీ ‘‘మేక్ ఇన్ ఇండియామేక్ ఫర్ ది వరల్డ్’’ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయనిపశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు తోడ్పడతాయని ప్రధానమంత్రి చెప్పారుఈ ప్రాంతంలో యువతకు లెక్కలేనన్ని నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని హామీ ఇచ్చారుఈ అభివృద్ధి ప్రాజెక్టులకు గాను ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారత్ సంకల్పం గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ప్రధానమంత్రి అన్నారుదేశంలో కొనసాగుతున్న విప్లవాత్మకమైన మార్పులే దీనికి కారణమనిఇవి అభివృద్ధి చెందిన భారత్‌కు పునాది వేస్తున్నాయని తెలిపారుఈ మార్పుల్లో కీలకమైన అంశం సామాజికభౌతికడిజిటల్‌ సహా మౌలిక సదుపాయాలే అని స్పష్టం చేశారుఅలాగే ప్రధానమైన విజయాలను శ్రీ మోదీ ప్రస్తావించారుఅవి పేదలకు కోట్ల పక్కా ఇళ్లుకోట్లాది టాయిలెట్లు, 12 కోట్లకు పైగా కుళాయి కనెక్షన్లువేల కిలోమీటర్ల కొత్త రోడ్లుజాతీయ రహదారులునూతన రైల్వే లైన్లుచిన్న పట్టణాల్లో విమానాశ్రయాలుప్రతి గ్రామానికిప్రతి ఇంటికి విస్తృత ఇంటర్నెట్ సౌకర్యంఈ ఆధునిక మౌలిక సదుపాయాలు పశ్చిమ బెంగాల్‌తో సహా ప్రతి రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తున్నాయని స్పష్టం చేశారుఅలాగే పశ్చిమ బెంగాల్లో రైల్వే అనుసంధానంలో సాధిస్తున్న గణనీయమైన పురోగతిని గురించి చర్చిస్తూ.. ఎక్కువ సంఖ్యలో వందే భారత్ రైళ్లు నడుస్తున్న రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటని అన్నారువేగంగా కొనసాగుతున్న కోల్‌కతా మెట్రో విస్తరణకొత్త రైలు మార్గాలుట్రాక్ డబ్లింగ్విద్యుద్దీకరణ పనులను ఆయన ప్రస్తావించారుఅనేక రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామనిపెద్ద సంఖ్యలో రైలు ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని శ్రీ మోదీ పేర్కొన్నారుఈ రోజు పశ్చిమ బెంగాల్‌లో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలను ప్రారంభించినట్లు తెలిపారుఈ ప్రయత్నాలన్నీ బెంగాల్ ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని తెలిపారు.

ఈ ప్రాంతంలోని విమానాశ్రయం ఉడాన్ పథకంతో అనుసంధామై ఉందనిగతేడాది లక్షలకు పైగా ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఆయన వెల్లడించారుఈ తరహా మౌలిక వసతులు సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా.. వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయనీఈ తరహా ప్రాజెక్టుల్లో ఉపయోగించే ముడి పదార్థాల ఉత్పత్తి సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు.

గడచిన 10-11 ఏళ్లలో గ్యాస్ అనుసంధానంలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందనిఈ దశాబ్దంలో దేశవ్యాప్తంగా ఉన్న గృహాలకు ఎల్పీజీ చేరుకుందని ప్రధానమంత్రి పేర్కొన్నారుఇది ప్రపంచ గుర్తింపు సాధించిందని అన్నారు. ‘ఒకే దేశంఒకే గ్యాస్ గ్రిడ్’ లక్ష్యం దిశగా ప్రభుత్వం చేస్తున్న పనినిప్రధానమంత్రి ఊర్జా గంగా యోజన ప్రారంభం గురించి వివరించారుఈ కార్యక్రమం ద్వారా పశ్చిమ బెంగాల్‌తో సహా ఆరు తూర్పు రాష్ట్రాల్లో గ్యాస్ పైప్ లైన్లు వేస్తున్నారుఈ రాష్ట్రాల్లోని పరిశ్రమలుపాకశాలలకు అందుబాటు ధరలకే పైపు ద్వారా గ్యాస్ సరఫరా చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారుఅలాగే గ్యాస్ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వాహనాలు సీఎన్‌జీతో నడపడానికిపరిశ్రమలు గ్యాస్ ఆధారిత సాంకేతికతలను స్వీకరించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలియజేశారుదుర్గాపూర్ పారిశ్రామిక ప్రాంతం జాతీయ గ్యాస్ గ్రిడ్‌లో భాగం కావడం పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారుఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోని పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తుందనిపశ్చిమ బెంగాల్లో దాదాపుగా 30 లక్షల గృహాలకు చౌకగా పైపు ద్వారా గ్యాస్ సరఫరా అవుతుందని శ్రీ మోదీ వెల్లడించారుఇది లక్షలాది మంది కుటుంబాలను ముఖ్యంగా మాతృమూర్తులుసోదరీమణుల జీవితాలను సులభతరం చేస్తుందనివేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలియజేశారు.

దుర్గాపూర్రఘునాథపూర్‌లో ప్రధాన స్టీలు ప్లాంట్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగుపరిచినట్లు ప్రధానమంత్రి ప్రకటించారుఈ సౌకర్యాల్లో సుమారుగా రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారుఈ ప్లాంట్లు ఇప్పుడు మరింత బలోపేతమైఅంతర్జాతీయంగా పోటీ పడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారుఈ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో బెంగాల్ ప్రజలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

భారత్‌లోని కర్మాగారాలు లేదా సంబంధిత రంగాల్లో చేపట్టే ప్రతి ప్రయత్నం 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకెళుతుందని ప్రధానమంత్రి అన్నారుఅభివృద్ధి ద్వారా సాధికారతఉపాధి ద్వారా స్వావలంబనస్పందన ద్వారా సుపరిపాలన ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేశారుఈ విలువలను నిలబెట్టుకోవడం ద్వారా భారత అభివృద్ధి ప్రయాణానికి బలమైన ఇంజిన్‌గా పశ్చిమ బెంగాల్ మారుతుందని శ్రీ మోదీ తెలియజేశారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్కేంద్ర మంత్రులు శ్రీ హర్దీప్ సింగ్ పూరీశ్రీ శంతను ఠాకూర్డాక్టర్ సుకాంత మజుందార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

చమురుసహజవాయువిద్యుత్రోడ్లురైలు రంగాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనప్రారంభోత్సవం చేయడంతోపాటు పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

ఈ ప్రాంతంలో చమురుగ్యాస్ మౌలిక సదుపాయాలను మెరుగు పరిచే దిశగా పశ్చిమ బెంగాల్లోని బంకురాపురూలియా జిల్లాలో రూ.1,950 కోట్ల విలువైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీీసీఎల్)‌ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారుఇది గృహాలువాణిజ్య సంస్థలుపారిశ్రామిక వినియోగదారులకు పీఎన్‌జీ కనెక్షన్లనురిటైల్ అవుట్‌లెట్లలో సీఎన్‌జీని అందిస్తుందిఈ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది.

దుర్గాపూర్-హల్దియా సహజవాయు పైప్‌లైన్లో భాగమైన దుర్గాపూర్ నుంచి కోలకతా సెక్షన్ (132 కి.మీ.)ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారుఇది ప్రధానమంత్రి ఊర్జా గంగా (పీఎంయూజీప్రాజెక్టుగా పిలిచే ప్రతిష్ఠాత్మక జగదీష్‌పూర్-హల్దియాబొకారో-ధామ్రా పైప్‌లైన్లో భాగందుర్గాపూర్ నుంచి కోల్ కతా వరకు ఉన్న ఈ సెక్షన్ విలువ రూ.1,190 కోట్లకు పైమాటేఇది పశ్చిమ బెంగాల్లోని పూర్వ వర్థమాన్హుగ్లీనదియా జిల్లాల గుండా వెళుతుందిఈ పైప్‌లైన్ నిర్మాణ దశంలో ప్రత్యక్షంగాపరోక్షంగా ఉపాధి కల్పించిందిఇప్పుడు ఈ ప్రాంతంలోని లక్షలాది గృహాలకు సహజవాయువు సరఫరాను సులభతరం చేస్తుంది.

అందరికీ స్వచ్ఛమైన గాలిఆరోగ్య భద్రత అందించాలనే తన నిబద్ధతకు అనుగుణంగా,రూ. 1,457 కోట్లకు పైగా వ్యయంతో దుర్గాపూర్ స్టీల్ థర్మల్ పవర్ స్టేషన్దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో భాగమైన రఘునాథ్ పూర్ థర్మల్ పవర్‌ స్టేషన్‌కు చెందిన రెట్రోఫిట్టింగ్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ ఫ్లూ గ్యాస్ డీ సల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ)ను జాతికి అంకితం చేశారుఇది స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడటంఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుంది.

ఈ ప్రాంతంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేలా రూ. 390 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పురూలియా-కోట్శిలా డబ్లింగ్ రైల్ లైన్ (36 కి.మీ.)ను పురూలియాలో జాతికి అంకితం చేశారుఇది జంషెడ్ పూర్బొకారోధన్‌బాద్ నుంచి రాంచీకోల్‌కతా వరకు పరిశ్రమల మధ్య రైలు అనుసంధానాన్ని పెంపొందిస్తుందిగూడ్స్ రైళ్ల ప్రయాణాన్ని సులభతరం చేస్తుందిప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందిపరిశ్రమలువ్యాపారాలకు సరకు రవాణాను మెరుగుపరుస్తుంది.

సేతు భారతం కార్యక్రమం కింద రూ. 380 కోట్లకు పైగా నిధులతో పశ్చిమ్ బర్దమాన్ లోని తోప్సిపందబేశ్వర్‌ లో నిర్మించిన రెండు రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లను ప్రధాన మంత్రి ప్రారంభించారుఇది రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు.. రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదాలను నివారిస్తుంది.

 

***


(Release ID: 2146101)