ప్రధాన మంత్రి కార్యాలయం
నమీబియా అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధానమంత్రి
Posted On:
09 JUL 2025 7:45PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమీబియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నమీబియా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏనిషంట్ వెల్విచియా మిరాబిలిస్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి నమీబియా అధ్యక్షురాలు గౌరవ నెటుంబో నాండి-ఎన్డైత్వా ప్రదానం చేశారు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నేత ఆయనే.
ఈ పురస్కారాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి.. ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకూ, భారత్-నమీబియా చారిత్రాత్మక, శాశ్వత సంబంధాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు ఈ అత్యున్నత పురస్కారం అందించిన ఆ దేశ అధ్యక్షురాలు నాండి-ఎన్డైత్వాకు, నమీబియా ప్రజలకూ ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధానమంత్రికి ఈ పురస్కారం ప్రదానం చేయడం భారత్-నమీబియా ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రత్యేక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇరు దేశాల యువతకూ ఇది ప్రేరణనిస్తుంది.
***
(Release ID: 2143586)
Read this release in:
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam