ప్రధాన మంత్రి కార్యాలయం
రియో డి జనీరోలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా బొలీవియా అధ్యక్షునితో భేటీ అయిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
07 JUL 2025 9:19PM by PIB Hyderabad
బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్లూరినేషనల్ స్టేట్ ఆఫ్ బొలీవియా అధ్యక్షులు గౌరవ లూయిస్ ఆర్స్ కాటకోరాతో సమావేశమయ్యారు.
ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించిన ఇరువురు నేతలు.. సాధించిన పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కీలక ఖనిజాలు, వర్తకం, వాణిజ్యం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూపీఐ, ఆరోగ్యం, ఔషధాలు, సంప్రదాయిక వైద్యం, చిన్న-మధ్య తరహా పరిశ్రమలు, శిక్షణ, సామర్థ్యాలను మెరుగుపరచడం వంటి రంగాల్లో పరస్పర సహకారం గురించి వారు చర్చించారు. కీలక ఖనిజాల రంగంలో మెరుగైన సహకారం.. సుస్థిరమైన, పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాల అభివృద్ధికి గల అవకాశాలను ఇరువురు నేతలు ప్రస్తావించారు. త్వరిత ప్రభావ ప్రాజెక్టులు.. ఐటీఈసీ స్కాలర్షిప్ కార్యక్రమాల కింద చేపట్టిన సామర్థ్యాలను మెరుగుపరిచే కార్యక్రమాల ద్వారా ఇరు దేశాల అభివృద్ధి కోసం కొనసాగుతున్న పరస్పర సహకారం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
2025 మార్చి-ఏప్రిల్ కాలంలో బొలీవియాలోని లాజ్ పాజ్ సహా పలు ప్రాంతాల్లో సంభవించిన వరదల నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు ప్రధానమంత్రి సంఘీభావం ప్రకటించారు. అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన బొలీవియాకు అభినందనలు తెలిపారు.
2025 ఆగస్టు 6న 200వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బొలీవియా నిర్వహిస్తున్న ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ఆ దేశ ప్రజలకూ, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2143082)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam