ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ నారాయణ గురు-మహాత్మాగాంధీల సంభాషణ శతాబ్ది ఉత్సవాలను రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి
Posted On:
23 JUN 2025 5:24PM by PIB Hyderabad
ఆధ్యాత్మికత, నైతిక విలువలను బోధించిన గొప్ప నాయకులు శ్రీ నారాయణ గురు - మహాత్మాగాంధీల మధ్య జరిగిన చారిత్రాత్మక సంభాషణ శతాబ్ది ఉత్సవాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
ఈ చరిత్రాత్మక సంభాషణ 1925 మార్చి12న మహాత్మాగాంధీ పర్యటన సందర్భంగా శివగిరి మఠంలో జరిగింది. ఈ సంభాషణల్లో ఇరువురు మహనీయులు వైకోమ్ సత్యాగ్రహం, మత మార్పిడులు, అహింస, అంటరానితనం నిర్మూలన, మోక్ష సాధన, అణగారిన వర్గాల అభ్యున్నతి వంటి అంశాల గురించి చర్చించారు.
శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టు నిర్వహించే ఈ వేడుకలు.. భారత సామాజిక, నైతిక నిర్మాణాన్ని రూపొందించుటలో మార్గదర్శనం చేస్తున్న ఈ దార్శనిక సంభాషణలను గురించి చర్చించి, వాటిని స్మరించుకోవడానికి ఆధ్యాత్మిక నాయకులు, ఇతర సభ్యులను ఒకే వేదికకు చేర్చనున్నాయి. శ్రీ నారాయణ గురు-మహాత్మాగాంధీలు ఇరువురూ ప్రచారం చేసిన సామాజిక న్యాయం, ఐక్యత, ఆధ్యాత్మిక సామరస్యాల సమష్టి దృక్పథానికి ఈ కార్యక్రమం శక్తిమంతమైన నివాళి అవుతుంది.
***
(Release ID: 2139072)