ప్రధాన మంత్రి కార్యాలయం
జీ-7 సమావేశాల నేపథ్యంలో జపాన్ ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
18 JUN 2025 3:00PM by PIB Hyderabad
జూన్ 17న కెనడా కననాస్కిస్ వేదికగా జరిగిన 51వ జీ-7 సమావేశాల నేపథ్యంలో, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని శ్రీ షిగేరు యిషిబాతో సమావేశమై లోతైన చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరిన్ని రంగాలకు విస్తరించాలన్న నిబద్ధతకు ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయని నేతలిద్దరూ పునరుద్ఘాటించారు.
ఇందుకు సంబంధించి శ్రీ మోదీ ఎక్స్ వేదికపై పోస్ట్ చేశారు:
“కెనడాలో జరిగిన 51వ జీ-7 సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి షిగేరు యిషిబాతో లోతైన చర్చలు జరిపాం. వివిధ రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భారత్, జపాన్ భావిస్తున్నాయి @shigeruishiba”
(Release ID: 2137516)
Visitor Counter : 8
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam