ప్రధాన మంత్రి కార్యాలయం
జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ
Posted On:
18 JUN 2025 2:55PM by PIB Hyderabad
కెనడాలోని కననాస్కిస్లో ఈ నెల 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి శ్రీ కైర్ స్టార్మర్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్, బ్రిటన్ల సంబంధాలు దృఢతరంగా మారుతున్నాయనీ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో మన రెండు దేశాలూ ఎంతగా పురోగమించిందీ ఈ పరిణామం చాటిచెబుతోందనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఎక్స్లో ఆయన రాసిన ఒక సందేశంలో:
‘‘ప్రధానమంత్రి శ్రీ కైర్ స్టార్మర్తో ఒక విశేష సంభాషణ... భారత్, బ్రిటన్ల సంబంధాలు దృఢతరం అవుతున్నాయి. మరి వ్యాపార, వాణిజ్య రంగాల్లో మన ఉభయ దేశాలూ ఎంతగా పురోగమించిందీ ఈ పరిణామం చాటిచెబుతోంది. ఈ అపురూప మైత్రికి మరింత గాఢతను జోడించడానికి మనం కలిసికట్టుగా మన కృషిని కొనసాగిద్దాం. @Keir_Starmer’’
***
(Release ID: 2137278)
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Tamil
,
Kannada
,
Malayalam