ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సైప్రస్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ

Posted On: 16 JUN 2025 3:15PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షులు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్‌తో అధికారిక చర్చలు నిర్వహించారుఅధ్యక్ష భవనం వద్దకు చేరుకున్న ప్రధానమంత్రికి సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ సంప్రదాబద్ధంగా స్వాగతం పలికారునిన్న ప్రధానమంత్రి సైప్రస్ చేరుకున్నపుడు కూడా అధ్యక్షుడు శ్రీ క్రిస్టోడౌలిడెస్ విమానాశ్రయంలో ప్రధానమంత్రిని సాదరంగా స్వాగతించారుఇది ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసంశాశ్వత స్నేహాన్నీ ప్రతిబింబిస్తుంది.

భారత్-సైప్రస్ సంబంధాలకు ఆధారమైన ఉమ్మడి విలువలను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారుఇరు దేశాలు వారి సార్వభౌమత్వాన్నీప్రాదేశిక సమగ్రతనూ పరస్పరం గౌరవిస్తున్నట్లు తెలిపారు2025ఏప్రిల్‌ నెలలో పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు.. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించిన సైప్రస్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారుఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాల బలమైన నిబద్ధతను ఇది స్పష్టం చేస్తుందిసైప్రస్ ఐక్యతకు.. యూఎన్ భద్రతా మండలి తీర్మానాలుఅంతర్జాతీయ చట్టాలుఈయూ అక్విస్ విషయంలో సైప్రస్ ఇబ్బందులను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

వాణిజ్యంపెట్టుబడిశాస్త్రీయ పరిశోధనసాంస్కృతిక సహకారంఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు సహా ద్వైపాక్షిక సంబంధాల పరంగా వివిధ అంశాల్లో కొనసాగుతున్న సహకారాన్ని ఇరువురు నాయకులు సమీక్షించారుఫిన్‌టెక్అంకురసంస్థలురక్షణ రంగంకనెక్టివిటీఆవిష్కరణడిజిటలైజేషన్ఏఐరవాణా వంటి రంగాలకూ సహకారాన్ని విస్తరించే మార్గాలను అన్వేషించారువ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి అయిదేళ్ల ప్రణాళిక రూపకల్పనకు ఇరు దేశాలు అంగీకరించాయిఉగ్రవాదంమాదకద్రవ్యాలుఆయుధాల అక్రమ రవాణా వంటి సమస్యలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకునే యంత్రాంగం ఏర్పాటుతో పాటుసైబర్.. సముద్ర భద్రతా వ్యవస్థల ఏర్పాటుకు కూడా అంగీకరించారుఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యానికి కచ్చితమైన రూపాన్ని ఇచ్చేందుకు గానూ 2025, జనవరి నెలలో సంతకాలు చేసిన ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యక్రమాన్ని ఇరువురు నేతలు ప్రశంసించారుఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడం కోసం భారత్-గ్రీస్-సైప్రస్ (ఐసీజీవాణిజ్య-పెట్టుబడి మండలి ఏర్పాటును వారు స్వాగతించారువాణిజ్యంపర్యాటకంవిజ్ఞానంఆవిష్కరణల్లో సంబంధాలను బలోపేతం చేయడం కోసం విమాన కనెక్టివిటీని పెంచడం గురించి కూడా ఇరువురు నేతలు చర్చించారుఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ [ఐఎమ్ఈసీఈ ప్రాంతంలో శాంతిశ్రేయస్సులకు దోహదం చేస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణతో సహా ప్రపంచ పాలనా సంస్థల బహుపాక్షికతసంస్కరణల పట్ల ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారుసంస్కరించిన యూఎన్ఎస్‌సీలో భారత శాశ్వత సభ్యత్వానికి సైప్రస్ తరపున మద్దతును పునరుద్ఘాటించిన అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారుపశ్చిమాసియాఐరోపాలో కొనసాగుతున్న ఘర్షణలు సహా పలు ప్రపంచ సమస్యలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు.

భారత్ ను సందర్శించాల్సిందిగా అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌ను ప్రధానమంత్రి ఆహ్వానించారుఈ పర్యటన సందర్భంగా నికోసియా విశ్వవిద్యాలయంలో ఇండియా స్టడీస్ ఐసీసీఆర్ చెయిర్ ఏర్పాటు కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారుసమావేశం అనంతరం భారత్-సైప్రస్ భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన జారీ చేశారు. [Link]

 

***


(Release ID: 2136748)