ప్రధాన మంత్రి కార్యాలయం
సమగ్ర వృద్ధితో పాటు జాతీయ సాధికారతతో 11 ఏళ్లు ...
ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
11 JUN 2025 1:21PM by PIB Hyderabad
సమగ్ర వృద్ధితో పాటు దేశ ప్రజలకు సాధికారత కల్పనతో కూడిన 11 సంవత్సరాల కాలం గణనీయ ప్రభావాన్ని ప్రసరించిందని వివరించిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు షేర్ చేశారు. ఇది చెప్పుకోదగ్గ పద్ధతుల్లో మన దేశానికి సాధికారతను సంతరించి, దేశం స్థాయిని పెంచడంతో పాటు దేశాన్ని పురోగమించేటట్లు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘11 ఏళ్లలో చోటుచేసుకున్న సమగ్ర వృద్ధిని కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ (@AshwiniVaishnaw) ఓ వ్యాసంలో వివరించారు. ఈ వృద్ధి ప్రస్థానం పౌరులకు అనేక విధాల ప్రయోజనాలను కలగజేయడంతో పాటు మరీ ముఖ్యంగా ఒక నమ్మకాన్ని కలిగించింది. ఆ నమ్మకం సాధికారతను కల్పించేదీ, అభ్యున్నతికి దోహదపడేదీ, దేశాన్ని పురోగమన పథంలో దూసుకుపోయేటట్లు చేసేదీనూ.
చాలా విషయాలను కూలంకషంగా చర్చించిన ఆ వ్యాసాన్ని ఓసారి చదవండి.’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2135741)
Read this release in:
Odia
,
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati