ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో 11 ఏళ్లుగా గొప్ప మార్పు: ప్రధానమంత్రి

Posted On: 11 JUN 2025 10:17AM by PIB Hyderabad

భారత్ వృద్ధి ప్రస్థానంలో ఒక ముఖ్య ఘట్టాన్ని గురించి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తెలియజేశారు...11 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాల కల్పనలో ఓ క్రాంతి చోటుచేసుకుందని ఆయన అన్నారు. దశాబ్ది కాలానికి పైగా గణనీయ మార్పును ఆవిష్కరించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిందని శ్రీ మోదీ అభివర్ణించారు. మౌలిక సదుపాయాల కల్పనలో... అంటే రైల్వేలు, హైవేలు, ఓడరేవులతో పాటు విమానాశ్రయాల ఏర్పాటులో... భారత్ సాధించిన విశేష ప్రగతిని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో సంధానం (కనెక్టివిటీ) పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ విస్తరించిందని, జీవన సౌలభ్యం మెరుగవడంతో పాటు పౌరులకు సమృద్ధి కూడా ఇనుమడించిందన్నారు.


స్థిరత్వం, దీర్ఘకాలిక దృష్టి.. వీటిని భారత్ ప్రేరణగా తీసుకొని, రాబోయే కాలానికి తగినట్లు ఉండే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తూ, స్వయంసమృద్ధి సహిత భారత్‌కు పునాదిని వేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.


మైగవ్‌ఇండియా (MyGovIndia) సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరిచిన వేర్వేరు పోస్టులపై శ్రీ మోదీ స్పందిస్తూ:


‘‘#11YearsOfInfraRevolution (11 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాల కల్పన) లో క్రాంతి చోటుచేసుకుంది..ఇది శ్రేష్ఠమైన మౌలిక సదుపాయాలను జోడిస్తూ భారత్ వృద్ధి వేగాన్ని పెంచింది. రైల్వేలు మొదలు హైవేల వరకు, ఓడరేవులు మొదలు విమానాశ్రయాల వరకు చూస్తే, చాలా వేగంగా విస్తరిస్తున్న ఇండియా మౌలిక సదుపాయాల నెట్‌వర్క్ ‘జీవన సౌలభ్యాని’కి మెరుగులు పెడుతూ, సమృద్ధిని ఇంతలంతలు చేస్తోంది.’’


‘‘స్థిరత్వం, దీర్ఘకాలిక దృష్టి.. వీటిని భారత్ ప్రేరణగా తీసుకొని రాబోయే కాలానికి తగ్గ మౌలిక సదుపాయాలను అందించడానికి కృషి చేస్తోంది. స్వయంసమృద్ధి సహిత భారత్‌కు పునాదులు వేస్తోంది.
#11YearsOfInfraRevolution” అని పేర్కొన్నారు.

 

***


(Release ID: 2135576)