ప్రధాన మంత్రి కార్యాలయం
చినాబ్ రైలు వంతెనపై మువ్వన్నెల జెండా రెపరెపలు: ప్రధానమంత్రి
Posted On:
06 JUN 2025 2:59PM by PIB Hyderabad
ప్రతిష్ఠాత్మక చినాబ్ రైలు వంతెన మీద జాతీయ పతాకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఇది దేశానికి ఎంతో గర్వకారణమైన క్షణం.. అంతేకాదు, అత్యంత దుర్గమ ప్రాంతాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను నిర్మించుకునే సత్తా భారత్కు రోజురోజుకూ పెరుగుతోందనడానికి ఇది ఒక నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.
ప్రధానమంత్రి ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో:
‘‘చినాబ్ రైలు వంతెనపై త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది.
హృదయం గర్వంతో ఉప్పొంగుతున్న క్షణాలు... ఆకాంక్ష, నేరవేర్చుకోవడం అన్న రెండింటి రూపం ఈ వంతెన. అత్యంత దుర్గమ ప్రాంతాల్లో కూడా అత్యాధునిక మౌలిక సదుపాయాలను సమకూర్చుకొనే సామర్థ్యం భారత్కు పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
***
(Release ID: 2134712)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam