ప్రధాన మంత్రి కార్యాలయం
‘పౌర పురస్కారాల ప్రదాన కార్యక్రమం-II’కు హాజరైన ప్రధానమంత్రి
Posted On:
27 MAY 2025 10:52PM by PIB Hyderabad
ఈ రోజు నిర్వహించిన ‘పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం -II ’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.‘‘పద్మ పురస్కారాల విజేతలు మన సమాజానికి చెప్పుకోదగిన తోడ్పాటును అందించారు. పద్మ పురస్కారాలను అందుకున్న వ్యక్తుల జీవన యాత్ర అత్యంత ప్రేరణాత్మకంగా ఉంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో :
‘‘నేను ‘పౌర పురస్కారాల ప్రదాన కార్యక్రమం-II’లో పాల్గొన్నాను... ఈ కార్యక్రమంలో ‘పద్మ అవార్డుల’ను ప్రదానం చేశారు. పద్మ పురస్కారాల విజేతలు మన సమాజానికి చెప్పుకోదగిన తోడ్పాటును అందించారు. పద్మ పురస్కారాలను అందుకున్న వ్యక్తుల జీవన యాత్ర అత్యంత ప్రేరణదాయకం’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2131915)