గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్ఓఆర్‌లతో ఆధార్ అనుసంధాన ప్రక్రియను రాష్ట్రాలు పూర్తి చేయాలి: కేంద్ర మంత్రి శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని


* కచ్చితంగా లేని, పాత భూమి రికార్డులే వివాదాలకు కారణమవుతున్నాయి: శ్రీ పెమ్మసాని

* కేంద్రీకృత సమన్వయంతో, సాంకేతికతపై ఆధారపడే భూ సర్వే, రీసర్వేలను చేపట్టనున్న కేంద్ర ప్రభుత్వం

* అయిదు దశల్లో దీని అమలు... 3 లక్షల చ.కి.మీ. గ్రామీణ వ్యవసాయ భూమితో మొదలవనున్న ప్రక్రియ

* డీఐఎల్ఆర్ఎంపీలో భాగంగా సర్వే, రీసర్వేపై జాతీయ కార్యశాల

Posted On: 15 MAY 2025 2:22PM by PIB Hyderabad

రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్‌‌)- ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కేంద్ర గ్రామీణాభివృద్ధికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ చంద్రశేఖర పెమ్మసాని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారుఇది భూమి యాజమాన్య హక్కుకు డిజిటల్ గుర్తింపును ప్రసాదించేతప్పుడు గుర్తింపునకు స్వస్తి పలికేఅగ్రిస్టాక్ (Agristack), పీఎం-కిసాన్ (PM-KISAN), పంట బీమా వంటి ప్రయోజనాలను నిజమైన లబ్దిదారులకు అందించేలా జాగ్రత్తలు తీసుకోవడంలో సహాయకారిగా నిలిచే ఓ ముఖ్య సంస్కరణగా ఈ అనుసంధాన ప్రక్రియ ఉపయోగపడుతుందిడిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల ఆధునికీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో సర్వేరీసర్వే అంశంపై రెండు రోజుల జాతీయ కార్యశాలను మంత్రి ఈ రోజు ప్రారంభించారుఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... రీసర్వేడిజిటలీకరణకాగిత రహిత కార్యాలయాలున్యాయస్థానాల్లో కేసుల నిర్వహణఆధార్ అనుసంధానం వంటి సంస్కరణలు ఒక సమగ్రమైనపారదర్శకమైన భూ పరిపాలన అనుబంధ విస్తారిత వ్యవస్థను ఆవిష్కరించనుందిరికార్డులు సరిగా ఉన్నప్పుడుసరైన సర్వేలను నిర్వహించే ప్రక్రియ భూమి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతుందనిబ్యాంకులు రుణాలను నమ్మకంగా ఇవ్వగలుగుతాయనివ్యాపారులు నిశ్చింతగా పెట్టుబడి పెట్టేందుకు వీలు ఉంటుందనిరైతులు వ్యావసాయిక సహాయాన్ని అందుకోగలుగుతారని మంత్రి వివరించారు.
స్పష్టమైననిర్ణయాత్మకమైనప్రస్తుత భూ రికార్డులను అందుబాటులోకి తీసుకు రావాలన్న దీర్ఘకాలంగా ఉందిఈ పనిని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారుడిజిటలీకరణఅనుసంధానంసాంకేతికత.. ఆధారంగా ఆధునికీకరణ చేయడం ద్వారా భూ యాజమాన్య నిర్వహణలో మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమాన్ని అమలుచేయాలని నిర్ణయించామని ఆయన వివరించారు.  
‘‘
వేగవంతమైన హైవేలుస్మార్ట్ నగరాలుభద్రమైన గృహనిర్మాణందీర్ఘకాలం పాటు మనుగడలో ఉండే వ్యవసాయం.. వీటిని మనం కోరుకుంటున్నట్లయితే ఈ ప్రయత్నాలను మొదలుపెట్టవలసి ఉంటుంది’’ అని మంత్రి ప్రధానంగా చెప్పారు.
డీఐఎల్ఆర్ఎంపీలో భాగంగా తగినంత ప్రగతి చోటుచేసుకొందనిఅయితే సర్వేరీసర్వే ఇప్పటి వరకు కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే పూర్తయిందని ఆయన వెల్లడించారుఎందుకంటే ఈ పని ఒక విస్తృత పాలనపరమైనసాంకేతికత ప్రధానమైనప్రజల భాగస్వామ్యంతో కూడిన కసరత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్‌లో భూమి అంటే అది ఒక్క భౌతిక ఆస్తి మాత్రమే కాదని శ్రీ చంద్రశేఖర్ అన్నారుఅది గుర్తింపుభద్రతఆత్మగౌరవాల ప్రతీక అని ఆయన అభివర్ణించారుమన దేశ పౌరుల్లో సుమారు 90 శాతం మందికి భూమి అన్నాస్థిరాస్తి అన్నా వారి దృష్టిలో మిగిలిన అన్నింటి కన్నా చాలా విలువైన ఆస్తి అని మంత్రి అన్నారుఅయినప్పటికీకచ్చితంగా లేనిలేదా పాత భూమి రికార్డులు దీర్ఘకాలంగా విస్తృతమైన వివాదాల్లో చిక్కుబడిపోవడానికిఅభివృద్ధిలో జాప్యానికి గురవడానికిలేదంటే న్యాయం జరగని స్థితికి లోను కావడానికి కారణమయ్యాయని తెలిపారుమన న్యాయ సంబంధ గణాంకాలను బట్టి చూస్తేకింది కోర్టుల్లో ప్రతి వందలో 66కు పైగా సివిల్ కేసులు భూమి-స్థిరాస్తి వివాదాలతో ముడిపడ్డవేచివరకు సర్వోన్నత న్యాయస్థానంలోనూపెండింగు పడ్డ వివాదాల్లో నాలుగింట ఒక వంతు భూసంబంధమైనవేఅందువల్ల ఇది అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు చేరవేయాలనే భావనకు ఒక సవాలును విసురుతోందని మంత్రి అన్నారు.  
మన పాత సర్వేలు 100 సంవత్సరాల కిందటివిఅవి 1880 మొదలు 1915 మధ్య కాలంలో నిర్వహించినవిఅప్పట్లో గొలుసులుక్రాస్-స్టాఫ్స్ వంటి పరికరాలను ఉపయోగించారని మంత్రి చెప్పారుదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల్లో పన్ను విధించే విషయమై స్థిరాస్తి ఎల్లలుస్థిరాస్తి విలువస్థిరాస్తిపై యాజమాన్య హక్కులు.. వీటికి సంబంధించిన సిసలైన సర్వేలు ఎప్పటికీ పూర్తి కాలేదని కూడా ఆయన వివరించారుసర్వే చేయడానికి ప్రయత్నాలు చేసిన రాష్ట్రాలు ఈ ప్రక్రియలో క్షేత్ర వాస్తవికతముసాయిదా మ్యాపుల ప్రచురణఅభ్యంతరాల పరిష్కారంతుది నోటిఫికేషన్.. వీటికి చాలా పెద్ద సంఖ్యలో మనుషులను రంగంలోకి దించవలసి వస్తుందని గ్రహించాయని మంత్రి చెప్పారు.
‘‘
చాలా రాష్ట్రాలు మ్యాప్ ఆధారిత సబ్‌డివిజన్లను పూర్తి చేయడం గానిలేదా స్థాన సంబంధిత రికార్డులను సమన్వయపరచలేదుదీంతో పన్ను విధించే విషయంలో ఇప్పటి స్థిరాస్తి హద్దులువిలువయాజమాన్య హక్కులకు సంబంధించిన రిజిస్టర్లలోని మ్యాపులు ఉపయోగించడానికి తగనివిగా ఉండిపోయాయిరాజకీయ సంకల్పంబలమైన సమన్వయం లేనిదే సర్వేల వేగం మందగిస్తుందనిఅవి అసంపూర్తిగా మిగిలిపోతాయని మాకు అనుభవంలోకి వచ్చిందిఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఒక కేంద్ర స్థాయి సమన్వయ కసరత్తుకు పూనుకోవాలని సంకల్పించిందిఇది భూమి రికార్డులను 21వ శతాబ్దంలోకి తీసుకుపోనుంది’’ అని శ్రీ చంద్రశేఖర్ వివరించారు.  
కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం సాంకేతికతపై ఆధారపడిందిగా ఉంటుందని మంత్రి వివరించారుదీనిలో డ్రోన్లువిమానాల ద్వారా గగనతల సర్వేల మాధ్యమ ప్రయోజనాలను అందుకుంటారనిసాంప్రదాయక పద్ధతుల్లో అయ్యే ఖర్చులో 10 శాతం ఖర్చు మాత్రమే అవుతుందని చెప్పారుఈ క్రమంలో కృత్రిమ మేధ (ఏఐ), జీఐఎస్‌లతో పాటు ఉన్నత కచ్చితత్వాన్ని ప్రదర్శించే పరికరాలను ఉపయోగిస్తారన్నారుఇది రాష్ట్రాలతో కలిసి క్షేత్ర వాస్తవాన్ని తెలియజేస్తుందనివిషయాల సక్రమతను ప్రకటిస్తుందనికేంద్రం తన వంతుగా విధాన రూపకల్పనఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు సాంకేతిక దన్నును సమకూరుస్తుందన్నారుకార్యక్రమాన్ని అయిదు దశల్లో అమలుచేస్తారనిదీనిని లక్షల చదరపు కిలోమీటర్ల గ్రామీణ వ్యవసాయ భూమి పరిధిలో మొదలుపెడతారని తెలిపారుఒకటో దశలో సంవత్సరాలకు రూ.3,000 కోట్లు ఖర్చుపెడతారని మంత్రి చెప్పారు
అర్బన్, పెరి-అర్బన్ భూ రికార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక మార్గదర్శక కార్యక్రమం ‘నక్షా’ను కూడా చేపడుతోంది అని మంత్రి తెలిపారుదీనిని 150కి పైగా పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటికే అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారుపట్టణ ప్రాంతాల్లో భూముల విలువలు పెరగడంఎత్తయిన భవనాలను నిర్మిస్తూ ఉండడంతో వివాదాలుతరచుగా అసాంప్రదాయక పరిష్కారాలు చోటు చేసుకొంటూ ఉండడం పెచ్చుమీరుతున్నాయన్నారుఈ కారణంగాపట్టణ ప్రణాళికతక్కువ ఖర్చులో గృహ నిర్మాణంనగరపాలక సంస్థల రెవెన్యూ.. వీటి కోసం సరి అయిన రికార్డులు అనేవి ఎంతయినా కీలకంగా మారుతున్నాయి అని మంత్రి శ్రీ చంద్రశేఖర్ వివరించారు
రాష్ట్రాలు వాటి రిజిస్ట్రేషన్ వ్యవస్థలతోపాటు రెవెన్యూ కోర్ట్ కేస్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (ఆర్‌సీసీఎంఎస్)లను ఆన్‌లైన్ మాధ్యమంలో కి మళ్లిస్తూకాగితాలను ఉపయోగించని స్థితికి చేర్చేటట్లు భూ వనరుల విభాగం (డీఓఎల్ఆర్ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారుఅంతేకాకుండా ఆటోమేటెడ్ వర్క్‌ఫ్లో పద్ధతుల్ని అవలంబించే విధంగాపౌరులతోపాటు అధికారులకు ఎక్కడైనా సరే అందుబాటు సాధ్యపడేటట్లు చూడాలంటోందని కూడా ఆయన అన్నారుదీనితో భూమికి సంబంధించిన కోర్టు కేసులను ఆరా తీయడంవాటిని నిర్వహించడంజవాబుదారుతనాన్ని ఖరారు చేయడంజాప్యాలను తగ్గించడంలో సాయం అందగలదని ఆయన చెప్పారు.

కచ్చితమైన సర్వేలు మనలోని అత్యంత బలహీన వర్గాలకు సాయపడతాయని మంత్రి అన్నారు. చిన్నసన్నకారు రైతులుగిరిజన సముదాయాలుగ్రామీణ మహిళలు.. వీరికి స్పష్టమైన భూమి హక్కులు విలాసాలేమీ కాదనివారు దోపిడీ బారిన పడకుండా అవి తప్పక కాపాడతాయని ఆయన స్పష్టం చేశారుభూమి రికార్డులతో ముడిపడి ఉండిదీర్ఘకాలంగా పెండింగు పడ్డ దేశ ప్రజల పనిని పూర్తి చేయడానికి కేంద్రంతో కలిసి పనిచేయాల్సిందిగా రాష్ట్రాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.  భూమి అనేది ఇక మీదట గందరగోళానికిసంఘర్షణకూ కాక నమ్మకానికిభద్రతకుసమృద్ధికి ఒక మూలంగా మారే దేశాన్ని మనమందరం కలిసి నిర్మిద్దామని ఆయన అన్నారు. ‘భూ-వివాదాల’ నుంచి ‘భూ-విశ్వాసం’ దిశగా ముందడుగు వేయాల్సిన సమయం వచ్చేసింది అని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలోఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూరిజిస్ట్రేషన్-స్టాంపుల శాఖ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్స్పెషల్ చీఫ్ సెక్రటరీభూ పరిపాలన ప్రధాన కమిషనరు జిజయలక్ష్మికార్యదర్శి శ్రీ మనోజ్ జోషీ జీభారత ప్రభుత్వ భూ వనరుల విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ కుణాల్ సత్యార్థికేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులురాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులునిపుణులుఫీల్డ్ ప్రాక్టీషనర్లు తదితరులు పాల్గొన్నారు.    

 

***


(Release ID: 2128939)