ప్రధాన మంత్రి కార్యాలయం
సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులకు ప్రధాని అభినందన
పరీక్షలొక్కటే మీ ప్రతిభకు కొలమానం కాదు.. మీ ప్రయాణం చాలా పెద్దది, మీ శక్తి మార్కులకు అతీతమైనది: ప్రధాని
Posted On:
13 MAY 2025 2:36PM by PIB Hyderabad
సీబీఎస్ఈ పన్నెండు, పదో తరగతుల పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘మీ సంకల్పం, క్రమశిక్షణ, కృషి ఫలితమిది. మీ విజయానికి దోహదపడిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులందరి పాత్రనూ గుర్తించాల్సిన రోజు కూడా ఇది’’ అని శ్రీ మోదీ అన్నారు.
‘‘మార్కులపట్ల కొద్దిగా నిరుత్సాహంగా ఉన్నవారికి నేను చెప్తున్నా: పరీక్షలొక్కటే మీ సామర్ధ్యానికి కొలమానం కాదు. మీ ప్రయాణం చాలా పెద్దది. మీ శక్తి మార్కులకు అతీతమైనది. మీరు మున్ముందు గొప్ప విజయాలు సాధించబోతున్నారు. ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఉత్సాహంగా ఉండండి’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
ప్రియమైన #ExamWarriors,
సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు! మీ సంకల్పం, క్రమశిక్షణ, కృషికి ఫలితమిది. మీ ఈ విజయానికి దోహదపడిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులందరి పాత్రను నేడు మీరు గుర్తించాలి.
రాబోయే అన్ని అవకాశాలలో పరీక్షలు రాసేవారు గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను!
మార్కులపట్ల కొద్దిగా నిరుత్సాహంగా ఉన్నవారికి నేను చెప్తున్నా: పరీక్షలొక్కటే మీ సామర్ధ్యానికి కొలమానం కాదు. మీ ప్రయాణం చాలా పెద్దది. మీ శక్తి మార్కులకు అతీతమైనది. మీరు మున్ముందు గొప్ప విజయాలు సాధించబోతున్నారు. ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఉత్సాహంగా ఉండండి. #ExamWarriors
***
MJPS/VJ
(Release ID: 2128402)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam