WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్-2025లో మీడియా, వినోద రంగంపై కీలకమైన నాలెడ్జ్ రిపోర్టులను విడుదల చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్..


అంతర్జాతీయ సృజన శక్తి కేంద్రంగా భారత పురోగతిని చాటుతున్న నివేదిక

 Posted On: 04 MAY 2025 1:50PM |   Location: PIB Hyderabad

శరవేగంగాక్రియాశీలంగా ఎదుగుతున్న భారత మీడియావినోద రంగాన్ని సమగ్రంగా సమీక్షిస్తూ రూపొందించిన అయిదు ముఖ్య నివేదికలను ముంబయిలో నిర్వహిస్తున్న వేవ్ సదస్సులో కేంద్ర సమాచార ప్రసారపార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్ నిన్న (మే 3విడుదల చేశారు.

ప్రఖ్యాత జాతీయఅంతర్జాతీయ సంస్థలు రూపొందించిన ఈ నివేదికలు సృజనాధారిత ఆర్థిక వ్యవస్థకంటెంట్ నిర్మాణం, చట్టపరమైన వ్యవస్థలులైవ్ ఈవెంట్స్ ఇండస్ట్రీడేటా ఆధారిత విధానపరమైన చేయూతకు సంబంధించి విలువైన సూచనలను అందించేలా ఉన్నాయి.

మీడియావినోద రంగంపై గణాంకాలతో కూడిన కరదీపిక 2024-25:

సమాచారప్రసార మంత్రిత్వశాఖ రూపొందించిన ఈ గణాంక కరదీపిక.. సమాచార ఆధారిత విధానాల రూపకల్పనకూనిర్ణయాలు తీసుకోవడానికీ కీలకమైన వనరుగా ఉపయోగపడుతుందిరంగాలవారీగా ధోరణులుప్రేక్షకుల అభిరుచులుఆదాయ వృద్ధి నమూనాలుప్రాంతీయజాతీయ పరిణామాలను ఇది సంగ్రహంగా పేర్కొంటుందిఅనుభవపూర్వక ఆధారాలుఆచరణాత్మక వాస్తవాలపై ఆధారపడి ఉండేలా చూస్తూ.. భవిష్యత్తులో విధాన రూపకల్పనపారిశ్రామిక వ్యూహాలకు మార్గనిర్దేశం చేసేలా దీనిని రూపొందించారుఈ కరదీపికలోని ముఖ్యాంశాలు:

  • పీజీఆర్ఐలో నమోదైన ప్రచురణలు1957 లో 5,932 నుండి 2024-25 నాటికి 154,523 కు పెరిగిందిఇందులో సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్4.99%.

  • పబ్లికేషన్స్ విభాగం వారు వెలువరించిన పుస్తకాలు: బాల సాహిత్యంచరిత్రస్వాతంత్య్ర పోరాటంసైన్స్పర్యావరణంజీవిత చరిత్రల వంటి అంశాలపై 2024-25లో 130 పుస్తకాలు ప్రచురితమయ్యాయి.

  • దూరదర్శన్ ఉచిత డిష్: 2004లో 33 ఛానళ్ల నుంచి 2025 నాటికి 381కి పెరిగింది.

  • డీటీహెచ్ సేవలు: 2025 మార్చి నాటికి పూర్తిగా అన్ని ప్రాంతాలకూ చేరాయి.

  • ఆలిండియా రేడియో (ఏఐఆర్):

      • 2025 మార్చి నాటికి 98% భారత ప్రజానీకాన్ని చేరింది.

      • ఏఐఆర్ స్టేషన్ల సంఖ్య 2000 సంవత్సరంలో 198 నుంచి 2025 నాటికి 591కి పెరిగింది.

  • ప్రైవేటు ఉపగ్రహ టీవీ చానెళ్లు2004–05లో 130 నుంచి 2024–25లో 908కి పెరిగాయి.

  • ప్రైవేటు ఎఫ్ఎం స్టేషన్లు 2001లోఉండగా2024 నాటికి 388 కి చేరాయిఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రాల వారీగా వాటి సంఖ్యను నివేదిక పేర్కొన్నది.

  • సామాజిక రేడియో కేంద్రాలు (సీఆర్ఎస్): 2005లో 15 నుంచి 2025 నాటికి 531కి పెరిగాయిరాష్ట్రం జిల్లా ప్రాంతాల వారీగా వివరాలు నివేదికలో ఉన్నాయి.

  • చిత్ర ధ్రువీకరణధ్రువీకరణ పొందిన భారతీయ కథా చిత్రాల (ఫీచర్ ఫిల్ములుసంఖ్య 1983లో 741 కాగా, 2024-25లో ఆ సంఖ్య 3,455కు పెరిగింది2024-25 నాటికి మొత్తంగా 69,113 సినిమాలు ధ్రువీకరణ పొందాయి.

  • సినీ రంగ విశేషాలుపురస్కారాలుఅంతర్జాతీయ చలనచిత్రోత్సవాలుఎన్ఎఫ్‌డీసీ నిర్మించిన డాక్యుమెంటరీలకు సంబంధించిన సమాచారం ఈ కరదీపికలో ఉంటుంది.

  • డిజిటల్ మీడియాసృజనాధార ఆర్థిక వ్యవస్థవేవ్స్ ఓటీటీ విజయాలుభారత సృజనాత్మక సాంకేతిక సంస్థ (ఐఐసీటీఏర్పాటుక్రియేట్ ఇన్ ఇండియా పోటీ (సీఐసీమొదలైన విశేషాలు ఇందులో ఉన్నాయి.

  • గుర్తించ దగిన కాలక్రమణికకేంద్ర సమాచార ప్రసార శాఖ సాధించిన విజయాలుపీఆర్జీఐఆకాశవాణిదూరదర్శన్ఇన్సాట్ ఆధారిత టెలివిజన్ సేవలుప్రైవేటు ఎఫ్ఎం రేడియో.

  • నైపుణ్య కార్యక్రమాలుమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణసామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం.

  • వాణిజ్య సౌలభ్యంసరళీకృతపారదర్శక ప్రక్రియల దిశగా మీడియాకంటెంట్ సృజనకారులకు సదుపాయం కల్పించేలా అమలు చేసిన చర్యలను నివేదికలో పేర్కొన్నారు.

కంటెంట్ నుంచి వాణిజ్యం దాకాభారత సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ విశేషాలు’ – బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీనివేదిక

డిజిటల్ యుగంలో భారత సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ అపూర్వ స్థాయిని చేరుకున్న తీరును, దాని ప్రభావాన్ని ఈ నివేదిక వెల్లడించింది. 2నుంచి 25 లక్షల మంది క్రియాశీల డిజిటల్ సృజనకారులతో.. ప్రపంచంలో శరవేగంగా ఎదుగుతున్న సృజన వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఇప్పటికే వినియోగదారు వార్షిక వ్యయంలో 350 బిలియన్ డాలర్లకు పైగా వారు ప్రభావితం చేయగాఈ సంఖ్య 2030 నాటికి మూడింతలు పెరిగి ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా.

సంఖ్యాపరమైన కొలమానాలకు అతీతంగా ఆలోచించాలనీ.. కథకులుగాసాంస్కృతిక రూపకర్తలుగాఆర్థిక చోదకులుగా క్రియేటర్ల పాత్ర విస్తరిస్తున్న తీరును గుర్తించాలని ఈ నివేదిక వారందరినీ కోరిందికేవలం లావాదేవీలను ప్రభావితం చేసే భాగస్వామ్యాలను కాకుండా.. ప్రామాణికతవిశ్వాసంసృజనాత్మక సామర్థ్యం ప్రాతిపదికన దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకునే దిశగా వ్యాపార సంస్థలు ఆసక్తి చూపడాన్ని ఈ మార్పు సూచిస్తుంది.

ఎర్నెస్ట్ అండ్ యంగ్  రూపొందించిన భారత్ స్టూడియో’ – అంతర్జాతీయ కంటెంట్ కేంద్రంగా భారత్‌

ఈ నివేదిక భారత్ను కేవలం కంటెంట్ వినియోగించే దేశంగానే కాకుండా ప్రపంచానికి స్టూడియోగా పరిచయం చేస్తోందిభాషా వైవిధ్యంసుసంపన్నమైన సంస్కృతిసాంకేతికతను అందిపుచ్చుకోగల ప్రతిభావంతులు భారత్‌కు బలమనీ.. సరిహద్దులకు అతీతమైన కథనాలను సృష్టించే స్థాయిలో అవి దేశాన్ని నిలుపుతాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.

యానిమేషన్వీఎఫ్ఎక్స్ సేవలకు సంబంధించి నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి విస్తృతంగా అందుబాటులో ఉన్న భారత్‌లో వ్యయంలో 40% నుంచి 60% వరకు ఆదా అవుతుందిభారతీయ ఓటీటీ కంటెంట్ వీక్షణలో 25% వరకు విదేశీ ప్రేక్షకుల నుంచి వచ్చినవే అని చెప్తూ.. ఇక్కడి కథనాలకు అంతర్జాతీయంగా కూడా ఆదరణ పెరుగుతోందని నివేదిక పేర్కొన్నదిఇది కేవలం వాణిజ్యపరమైన అంశం మాత్రమే కాదు – సాంస్కృతిక దౌత్యాన్నీ ఇది ప్రతిబింబిస్తుందిభారతీయ కథలు ఖండాంతరాల్లో భావోద్వేగపరమైనసాంస్కృతిక సంబంధాలను ఏర్పరుస్తున్నాయి.

ఖైతాన్ అండ్ కో వారి లీగల్ కరెంట్స్: భారతీయ మీడియావినోద రంగంపై నియమాల కరదీపిక 2025’

సృజనాత్మకతకు నియమ నిబంధనలపై స్పష్టత ఉండాలని గుర్తించిన ఖైతాన్ అండ్ కో.. మీడియావినోద రంగాలకు సంబంధించి చట్టపరమైననియమ నిబంధనలతో వివరణాత్మక హ్యాండ్ బుక్‌ను రూపొందించింది. నిర్మాతలుస్టూడియోలు, ఇన్‌ఫ్లూయెన్సర్లువివిధ వేదికలకు సంబంధించి ఆచరణాత్మక నిర్దేశకంగా రూపొందించిన ఈ హాండ్‌బుక్‌లో అనేక కీలకమైన చట్టపరమైన అంశాలున్నాయి:

  • దేశీయవిదేశీ సంస్థలకు సంబంధించి అనుమతి నిబంధనలు

  • అంతర్జాతీయ నిర్మాణాలకు ప్రోత్సాహక పథకాలు

  • ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్డిజిటల్ కంటెంట్‌కు సంబంధించి చట్టపరమైన ఏర్పాట్లు

  • గేమింగ్ రంగంలో నిర్వచనాలుజీఎస్టీ సహా పన్ను సంక్లిష్టతలు

  • సెలెబ్రిటీ హక్కుల రక్షణ

  • ఏఐ వెలువరించిన కంటెంట్‌కు సంబంధించి నైతిక పరిశీలనలునియంత్రణ విధానం

తగిన విధానాలనుమార్గాలను తెలియజేస్తూ.. ఆత్మవిశ్వాసంతోనిబంధనలకు అనుగుణంగాబాధ్యతాయుతంగా సృజనాధారిత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములయ్యేలా ఆ రంగంలో అందరినీ సన్నద్ధులను చేయడం దీని లక్ష్యం.

భారత లైవ్ ఈవెంట్స్ పరిశ్రమపై శ్వేతపత్రం

భారత లైవ్ ఈవెంట్స్ పరిశ్రమపై శ్వేతపత్రం ఈ రంగంలో విశేషమైన వృద్ధినివినియోగదారు తీరుతెన్నుల్లో మార్పును స్పష్టంగా పేర్కొంటోందిగతేడాదితో పోలిస్తే 15% వృద్ధి రేటుతో ఈ పరిశ్రమ ఒక్క 2024 లోనే 13 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందించింది.

ఈవెంట్లకు హాజరయ్యేందుకు దాదాపు అయిదు లక్షల మంది అభిమానులు దేశంలో వివిధ నగరాలకు ప్రయాణిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించిందిదేశంలో ఈవెంట్ ఆధారిత పర్యాటకం బలోపేతమవుతుండడాన్ని ఇది సూచిస్తుందిప్రీమియం సర్వీసులకు కూడా ఆదరణ పెరుగుతోందిషిల్లాంగ్వడోదరజంషెడ్‌పూర్ వంటి ద్వితీయశ్రేణి నగరాలు సాంస్కృతిక కేంద్రాలుగా ఎదుగుతున్నాయి.

ఈ పురోగతికి చేయూతనిచ్చి కొనసాగించడం కోసం కింది అంశాలు ఆవశ్యకమని ఈ శ్వేతపత్రం వెల్లడిస్తుంది:

  • ఈవెంట్ మౌలిక సదుపాయాలను ఉన్నతీకరించడం

  • లైసెన్స్ ప్రక్రియను క్రమబద్దీకరించడంసరళీకృతం చేయడం

  • సంగీత హక్కులకు సంబంధించి దృఢమైనమరింత పారదర్శకమైన వ్యవస్థలు

  • లైవ్ ఈవెంట్ల రంగాన్ని ఎంఎస్ఎంఈసృజనాత్మక ఆర్థిక విధానాల కింద అధికారికంగా గుర్తించడం

ప్రపంచ సాంస్కృతిక రంగంలో భారత్‌ను కేవలం ప్రేక్షక పాత్రలో కాకుండాఅంతర్జాతీయంగా కేంద్రంగా కీలక వేదికగా నిలిపేలా వ్యూహాత్మకంగా పునర్నిర్మించాలని ఈ నివేదిక పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమానికి సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజుఎంఐబీ సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీ ఆర్.కెజెనాఎంఐబీ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మీనూ బాత్రాఎంఐబీ సంయుక్త కార్యదర్శిఎన్ఎఫ్‌డీసీ ఎండీ శ్రీ పృథుల్ కుమార్ హాజరయ్యారునాలెడ్జ్ పార్టనర్ల ప్రతినిధులుగాబోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్పార్టనర్ శ్రీ విపిన్ గుప్తబోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పార్టనర్ పాయల్ మెహతాఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్‌నర్లు శ్రీ ఆశిష్ ఫేర్వాణీశ్రీ అమీయ స్వరూప్కైతాన్ అండ్ కో టెక్నాలజీ అండ్ మీడియా పార్టనర్ తనూ బెనర్జీకైతాన్ అండ్ కో పార్ట్‌నర్ శ్రీ ఇషాన్ జోహారీఈవెంట్స్ ఎఫ్ఏక్యూ లైవ్ డైరెక్టర్ శ్రీ వినోద్ జనార్ధన్ఈవెంట్స్ ఎఫ్ఏక్యూ ఎండీ శ్రీ దీపక్ చౌధరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎప్పటికప్పుడు అధికారిక అప్‌డేట్ల కోసం ఫాలో అవ్వండి:

ఎక్స్’లో:

https://x.com/WAVESummitIndia

https://x.com/MIB_India

https://x.com/PIB_India

https://x.com/PIBmumbai

ఇన్‌స్టాగ్రామ్‌లో: 

https://www.instagram.com/wavesummitindia

https://www.instagram.com/mib_india

https://www.instagram.com/pibindia

 

***


Release ID: (Release ID: 2127041)   |   Visitor Counter: 11