WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్ 2025: ప్రతి సృజనకారుడినీ స్టార్ గా తీర్చిదిద్దే ప్రజా ఉద్యమం విజయవంతమైన వేవ్స్‌బజార్


3 రోజుల్లోనే 3000లకు పైగా బీ2బీ సమావేశాలతో రూ. 1328 కోట్లకు పైగా విలువైన వ్యాపార లావాదేవీలు

మీడియా-వినోద రంగంలో రూ. 8000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం

గ్లోబల్ మీడియా డైలాగ్‌లో వేవ్స్ డిక్లరేషన్‌ను ఆమోదించిన సభ్య దేశాలు

వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్‌లో భాగంగా త్వరలోనే రానున్న రూ. 50 కోట్ల విలువైన పెట్టుబడులు

క్రియేటివ్ ఎకానమీ సామర్థ్య నిర్మాణంలో కీలక మైలురాయిగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (ఐఐసీటీ)
భారత్‌లో సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహానికి భరోసా ఇచ్చిన క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్

వేవ్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా నాలెడ్జ్ రిపోర్ట్స్ ఆవిష్కరణ – సృజనాధారిత ఆర్థిక వ్యవస్థలో భారత్ భారీ ముందడుగు

 Posted On: 04 MAY 2025 7:48PM |   Location: PIB Hyderabad

వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్వేవ్స్ 2025 ప్రీమియర్ ఎడిషన్ ఈరోజు ముంబయిలో అద్భుత ప్రదర్శనతో ముగిసింది. ఎగ్జిబిటర్లుపరిశ్రమ ప్రముఖులుఅంకురసంస్థలువిధాన నిర్ణేతలువిద్యావేత్తలుసాధారణ ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందిఈ సమ్మిట్ మీడియా-వినోద రంగంలో కీలకమైన సమ్మేళన కేంద్రంగా ఆవిర్భవించింది. ప్రముఖ కళాకారులుప్రభావవంతమైన కంటెంట్ క్రియేటర్ల నుంచి టెక్ ఇన్నోవేటర్లుకార్పొరేట్ నాయకుల వరకు పరిశ్రమలోని ప్రతి విభాగానికి చెందిన నిపుణులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారుప్రదర్శనలుప్యానెల్ చర్చలుబీ2బీ సహకారాల శక్తివంతమైన సమ్మేళనంతో కొనసాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములయ్యారుమీడియా-వినోద రంగంలో ప్రపంచ శక్తి కేంద్రంగా ఎదుగుతున్న భారత స్థానాన్ని ఇది పునరుద్ఘాటించింది.

జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనేక మంది తారల సమక్షంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా సృజనాత్మకతసాంకేతికకథలు చెప్పే నైపుణ్యాల వేడుకగా తొలి ఎడిషన్ ఘనంగా ప్రారంభమైందితన ప్రారంభ ప్రసంగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ... వేవ్స్ కేవలం పదాల సంక్షిప్త రూపం కాదనిఇది సంస్కృతిసృజనాత్మకతసార్వత్రిక అనుసంధానాల తరంగమని వ్యాఖ్యానించారుచలనచిత్ర నిర్మాణండిజిటల్ కంటెంట్గేమింగ్ఫ్యాషన్సంగీతంప్రత్యక్ష కచేరీలకు ప్రపంచ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారుప్రపంచవ్యాప్త క్రియేటర్లు పెద్ద కలలు కని వారి కథలను చెప్పాలనీపెట్టుబడిదారుల వేదికలపైనే కాకుండా ప్రజల్లోనూ పెట్టుబడి పెట్టాలని కోరారుభారతీయ యువత ఇప్పటి వరకు వెల్లడించని వారి బిలియన్ కథలను ప్రపంచానికి చెప్పాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారుభారత ఆరెంజ్ ఎకానమీ వృద్ధికి వేవ్స్ గొప్ప ఆరంభమని ప్రకటిస్తూఈ సృజనాత్మక ఉత్తుంగ తరంగాలకు నాయకత్వం వహిస్తూభారతదేశాన్ని ప్రపంచ సృజనాత్మక కేంద్రంగా మార్చాలని ఆయన యువతను కోరారు.

హై ఇంపాక్ట్ నాలెడ్జ్ సెషన్స్

ప్రధానమంత్రి దార్శనికతను ముందుకు తీసుకెళ్లే వేవ్స్ 2025, గత నాలుగు రోజులుగా ఉన్నత స్థాయి ఆలోచనలునైపుణ్యాలుఆయా రంగాల్లో విజయం సాధించిన ప్రముఖుల అర్థవంతమైన ఆలోచనలు పంచుకునే వేదికగా పనిచేసిందివేవ్స్ 2025 కాన్ఫరెన్స్ ట్రాక్ప్రపంచవ్యాప్త మేధావులుపరిశ్రమ మార్గదర్శకులువిధాన రూపకర్తలునిపుణులను ఒకచోట చేర్చి సంభాషణలుసహకారాల కోసం ఒక ముఖ్యమైన వేదికగా నిలిచిందిఅత్యంత జాగ్రత్తగా రూపొందించి నిర్వహించిన ప్లీనరీ సమావేశాలుబ్రేక్ అవుట్ చర్చలుమాస్టర్ క్లాసుల ద్వారాఈ సమ్మిట్ మీడియా-వినోద రంగ భవిష్యత్తును రూపొందించే తాజా ఆవిష్కరణలుఅధునాతన వ్యూహాలను అన్వేషించిందిఈ సమావేశాలు విభిన్న రంగాలుస్పెషలైజేషన్స్‌కు అతీతంగా అర్థవంతమైన ఆలోచనలను పంచుకునేందుకు వీలు కల్పించాయి.

వేవ్స్ తొలి ఎడిషన్ హై ఇంపాక్ట్ నాలెడ్జ్ సమావేశాలుబ్రాడ్‌కాస్టింగ్-ఇన్ఫోటైన్‌మెంట్ఏవీజీసీ-ఎక్స్ఆర్డిజిటల్ మీడియాచలనచిత్రాలు సహా విస్తృత శ్రేణి అంశాలను కవర్ చేసే ప్రసంగాలతో సాగిందిమూడు ప్రధాన హాళ్లు (ఒక్కొక్కటి 1,000 కంటే ఎక్కువ మందికి అనువుగా ఉండేది), అదనంగా 75 నుంచి 150 మంది సామర్థ్యం గల మరో ఐదు హాళ్లలో నిర్వహించిన 140కి పైగా సమావేశాల్లో 100కు పైగా అంతర్జాతీయ వక్తలు పాల్గొన్న ఈ సమ్మిట్ కోసం ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారుదీంతో చాలా సమావేశాలు నిండుగా ఆహూతులతో కళకళలాడాయి.

ఈ ప్లీనరీ సమావేశాల్లో ముఖేష్ అంబానీటెడ్ సరండోస్కిరణ్ మజుందార్-షానీల్ మోహన్శంతను నారాయణ్మార్క్ రీడ్ఆడమ్ మోసేరినీతా అంబానీ వంటి ప్రముఖులు 50కి పైగా కీలక ప్రసంగాలు చేశారువారి ఆలోచనలు అభివృద్ధి చెందుతున్న వినోద పరిశ్రమప్రకటనల రంగండిజిటల్ పరివర్తన గురించి బలమైన దృక్పథాలను అందించాయిచిరంజీవిమోహన్ లాల్హేమ మాలినిఅక్షయ్ కుమార్నాగార్జునషారుఖ్ ఖాన్దీపికా పదుకొనేఅల్లు అర్జున్శేఖర్ కపూర్ వంటి చలనచిత్ర దిగ్గజాలు.. వీరిలో చాలా మంది వేవ్స్ సలహా మండలి సభ్యులు కూడావర్చువల్ ప్రొడక్షన్కృత్రిమ మేధ యుగంలో సినిమా భవిష్యత్తుకంటెంట్ క్రియేషన్ గురించిన ఆలోచింపజేసే సంభాషణల్లో పాల్గొన్నారు.

వేవ్స్ 2025లో భాగంగా ఆచరణాత్మక అభ్యాసంసృజనాత్మక అన్వేషణను అందించడానికి 40 మాస్టర్‌క్లాసులు రూపొందించారుఆమిర్ ఖాన్ ద్వారా నటనలో మెళకువలుఫర్హాన్ అక్తర్ ద్వారా దర్శకత్వంలో మెళకువలూమైఖేల్ లేమాన్ ద్వారా ఫిల్మ్‌ మేకింగ్ అంశాలపై సమావేశాలను నిర్వహించిఆహూతులకు పరిశ్రమ పద్ధతుల గురించి ప్రత్యక్ష అవగాహన కలిగించారుఅమేజాన్ ప్రైమ్ ద్వారా పంచాయత్ చిత్రీకరణ అంశాలను వివరించారుఏఆర్ లెన్స్‌లను రూపొందించడంఏఐ అవతార్‌లను సృష్టించడంజనరేటివ్ ఏఐని ఉపయోగించి గేమ్‌లను అభివృద్ధి చేయడం వంటి తెరవెనుక కథనాలను గురించి వివరించడం ద్వారా ఇతర సమావేశాలూ ప్రజలకు అవగాహన కలిగించాయిఈ సమావేశాల ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న సృజనాత్మాకాధారిత ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకుపోయేందుకు అవసరమైన కార్యాచరణఇతర సాధనాల గురించి ప్రొఫెషనల్స్ఔత్సాహిక సృజనకారులకు వివరించారు.

వేవ్స్‌లో 55 బ్రేక్ అవుట్ సమావేశాలు కూడా జరిగాయిఇవి బ్రాడ్‌కాస్టింగ్డిజిటల్ మీడియాఓటీటీఏఐసంగీతంవార్తలులైవ్ ఈవెంట్లుయానిమేషన్గేమింగ్వర్చువల్ ప్రొడక్షన్కామిక్స్ఫిల్మ్ మేకింగ్ వంటి స్పెషలైజ్డ్ థీమ్స్ గురించిన సమగ్ర చర్చలకు వేదికగా నిలిచాయిఈ ఇంటరాక్టివ్ సమావేశాలు మెటాగూగుల్అమేజాన్ఎక్స్స్నాప్స్పాటిఫైడిఎన్ఈజీనెట్‌ఫ్లిక్స్ఎన్‌విడియా వంటి ప్రముఖ కంపెనీల సీనియర్ నిపుణులుఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ), సీఐఐఐఎమ్ఐ వంటి పరిశ్రమ సంస్థల ప్రతినిధులను ఒకేచోటుకు చేర్చాయిఆయా రంగాలకు సంబంధించిన నిర్ధిష్ట ఆలోచనలుసహకారాన్ని ప్రోత్సహించడానికి రూపొందించిన ఈ చర్చలు క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించాయివృద్ధిఆవిష్కరణల కోసం కొత్త దిశను చూపించాయి.

వ్యాపార ఒప్పందాల ద్వారా  రూ.1328 కోట్లు రాబట్టిన వేవ్స్ బజార్మీడియావినోద రంగాల్లో రూ.8 వేల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం

వేవ్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిర్వహించిన వేవ్స్ బజార్ తొలి ఎడిషన్ గొప్ప విజయాన్ని సాధించిందిసృజనాత్మక రంగాలలో అంతర్జాతీయ వ్యాపార సహకారానికి ఇది ఒక ప్రముఖ వేదికగా నిలిచిందిఈ మార్కెట్ విభాగంలో సినిమాసంగీతంరేడియోవిఎఫ్ఎక్స్యానిమేషన్ రంగాల్లో మొత్తం రూ.1328 కోట్ల విలువైన వ్యాపార ఒప్పందాలు లేదా లావాదేవీలు నమోదయ్యాయిమొత్తం అంచనా రాబడిలో రూ.971 కోట్లు కేవలం బి2బి  సమావేశాల ద్వారానే సమకూరాయివేవ్స్ బజార్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన కొనుగోలుదారులుఅమ్మకందారుల మార్కెట్ లో 3,000కి పైగా బి2బి  సమావేశాలు జరిగాయిఅంతర్జాతీయ సహకారంలో ఇది ఒక పెద్ద విజయంగా నిలవగాఫిల్మ్ ఇండియా స్క్రీన్ కలెక్టివ్న్యూజిలాండ్‌కు చెందిన స్క్రీన్ కాంటర్బరీ ఎన్జెడ్ కలిసి సంయుక్తంగా న్యూజిలాండ్‌లో తొలి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాయిభారత్రష్యాలలో విభిన్న సాంస్కృతిక ఉత్సవాలునిర్వహించడం పైనఅలాగే కామెడీసంగీత ప్రదర్శనలను సంయుక్తంగా నిర్మించడంపైన అవగాహన ఒప్పందంపై చర్చలు ప్రారంభమయినట్లు ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ- సీఈఓ తుషార్ కుమార్రష్యా సంస్థ గాజ్‌ప్రోమ్ మీడియా సీఈఓ అలెగ్జాండర్ జారోవ్ ప్రకటించడం మరో ముఖ్యమైన విజయంగా నిలిచింది.

ప్రైమ్ వీడియోసిజె ఇఎన్ఎమ్ మధ్య బహుళ సంవత్సరాల సహకార ఒప్పందాన్ని ప్రకటించడం కూడా వేవ్స్ బజార్‌లో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచిందిఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ప్రీమియం కొరియన్ కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తారుఇతర ముఖ్యమైన విజయాల్లో భారత్బ్రిటన్  మధ్య మొదటి అధికారిక సంయుక్త నిర్మాణంగా ‘దేవీ చౌదురాణి’ సినిమా ప్రకటన ఒకటిఅలాగే యూకేకు యుకేకు చెందిన ఫ్యూషన్ ఫ్లిక్స్జెవిడి ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ‘వయొలేటెడ్’ సినిమా ప్రకటన కూడా ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది.

ఐఎంఎఫ్ లో రూ.8,000 కోట్ల విలువైన ఎంవోయూలపై సంతకాలు చేయడం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం సదస్సుకు వ్యాపార విలువను జోడించిందియూనివర్సిటీ ఆఫ్ యార్క్యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో చెరో రూ.1,500 కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకోగారాష్ట్ర పరిశ్రమల శాఖప్రైమ్ ఫోకస్గోద్రెజ్ సంస్థలతో వరుసగా రూ.3,000 కోట్లురూ.2,000 కోట్ల విలువైన ఎంవోయూలపై సంతకాలు చేసింది.

గ్లోబల్ మీడియా డైలాగ్ 2025లో 'వేవ్స్ డిక్లరేషన్'ను ఆమోదించిన సభ్య దేశాలు

ముంబయిలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025) సందర్భంగా జరిగిన గ్లోబల్ మీడియా డైలాగ్ 2025 ఒక చరిత్రాత్మక కార్యక్రమంగా నిలిచింది. 77 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొనడం ప్రపంచ మీడియా,  వినోద రంగంలో భారతదేశ కీలకపాత్రను ధ్రువీకరించింది

ఈ చర్చలో సాంస్కృతిక సునిశితత్వాన్ని గౌరవిస్తూనే సృజనాత్మకతను ప్రోత్సహించడంలో అంతర్జాతీయ సహకారాల శక్తిని చాటి చెప్పారుసభ్య దేశాలన్నీ కలసి వేవ్స్ డిక్లరేషన్ ను ఆమోదించాయిఇందులో డిజిటల్ అంతరాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతనుప్రపంచ శాంతిఐక్యత కోసం మీడియాను ఉపయోగించవలసిన అవసరాన్ని ఉద్ఘాటించారు

విభిన్న సంస్కృతులను ఏకం చేయడంలో చలనచిత్రాల కీలక పాత్రనుసాంకేతిక పురోగతితో విస్తరించిన సృజనాధారిత ఆర్థికవ్యవస్థలో వ్యక్తిగత కథల పెరుగుతున్న ప్రాముఖ్యతను ఈ చర్చలు స్పష్టం చేశాయి

భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.  జైశంకర్ సదస్సులో మాట్లాడుతూ- సాంకేతిక పరిజ్ఞానంసంప్రదాయం మధ్య సమన్వయం అవసరమనినైపుణ్యాభివృద్ధిఆవిష్కరణల ద్వారా యువత సాధికారతను సాధించాలని సూచించారుకేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూకంటెంట్ సృష్టిపై మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రభావాన్ని ప్రస్తావించారుస్థానిక కంటెంట్ ను ప్రోత్సహించడంసహ-నిర్మాణ ఒప్పందాలు,  సమష్టిగా నిధులను పొందడం ఎంత ముఖ్యమో ఆయన ప్రత్యేకంగా వివరించారు700 మందికి పైగా ప్రపంచ సృజనకారులను విజయవంతంగా గుర్తించిన భారతదేశ "క్రియేట్ ఇన్ ఇండియాఛాలెంజ్ లను ప్రదర్శించారు. వచ్చే ఎడిషన్ లో వాటిని 25 భాషలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయిఈ సదస్సు మీడియావినోద రంగాలలో భవిష్యత్  ప్రపంచ సహకారానికి బలమైన పునాదిని వేసింది. సృజనాత్మక నైపుణ్యంనైతిక విలువలు కలిగిన కంటెంట్ సృష్టికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇచ్చింది.

వేవ్ఎక్స్ మీడియావినోద రంగంలో ఔత్సాహిక స్టార్టప్ ల కోసం యాక్సిలరేటర్

వేవ్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ 30 మీడియావినోద స్టార్టప్ లను ఎంపిక చేసి తమ ప్రత్యేక ఆలోచనలను నేరుగా లుమికైజియోసిఎబిఐఎల్వార్మప్ వెంచర్స్ వంటి భారీ పెట్టుబడిదారులకు అందించడానికి అవకాశం కల్పించింది.1000కి పైగా రిజిస్ట్రేషన్లతో ఈ కార్యక్రమంరూ. 50 కోట్ల విలువైన పెట్టుబడుల చర్చలను ప్రారంభించింది. ఇవి ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయిదానితో పాటు, 100కి పైగా స్టార్టప్స్ తమ ఆలోచనలుఉత్పత్తులను ప్రత్యేక స్టార్టప్ పెవిలియన్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్న ఇన్వెస్టర్ల ఎదుట ప్రదర్శించాయిమీడియావినోద రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఏంజెల్ ఇన్వెస్టర్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడం ద్వారా స్టార్టప్ లు వృద్ధి చెందడానికిఎదగడానికి ఒక స్పష్టమైన పెట్టుబడి వ్యవస్థను సృష్టించడం వేవ్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుందిటైర్ 1, టైర్ 2కు చెందిన స్టార్టప్ లు వేవ్ ఎక్స్ లో మెరిశాయివాటి వ్యవస్థాపకులు కేంద్ర బిందువుగా మారారుఇలాంటి సృజనకారులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వేవ్ఎక్స్ ప్రత్యేక మార్గదర్శకులతో ఇంక్యుబేటర్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేయనుందివేవ్ఎక్స్ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఇంకా స్పష్టమైన ఉత్పత్తిని కలిగిలేకున్నాగొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆలోచనలకు మద్దతు అందిస్తుంది.

వేవ్స్ 2025లో విడుదల చేసిన కీలక విజ్ఞాన నివేదికలు 

వేవ్స్ శిఖరాగ్ర సదస్సు 2025లో కేంద్ర సమాచారప్రసారపార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఐదు కీలక నివేదికలను విడుదల చేశారుఈ నివేదికలు అభివృద్ధి చెందుతున్న భారత మీడియా,  వినోద రంగాలపై సమగ్ర అవలోకనాన్ని అందిస్తాయి. ఇందులో కంటెంట్ ఉత్పత్తివిధాన పద్ధతులులైవ్ ఈవెంట్లు వంటి ముఖ్యాంశాలను పొందుపరిచారు

మీడియావినోద రంగాలపై స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్ 2024-25సమాచార,  ప్రసార మంత్రిత్వ శాఖ రూపొందించిన స్టాటిస్టికల్ హ్యాండ్  బుక్ భారతదేశ మీడియా రంగం గురించి విలువైన డేటా ఆధారిత అవగాహనలను అందిస్తుందిఇది బ్రాడ్ కాస్టింగ్డిజిటల్ మీడియాఫిల్మ్ సర్టిఫికేషన్లుపబ్లిక్ మీడియా సేవలలో పురోగతి ధోరణులను తెలియచేస్తుందిఅనుభవపూర్వక ఆధారాల ఆధారంగా భవిష్యత్ విధాన రూపకల్పన,  పరిశ్రమ వ్యూహాలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.

కంటెంట్ నుంచి వాణిజ్యం వరకు బీసీజీ:, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీనివేదిక భారతదేశ సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ లో వేగవంతమయిన వృద్ధిని వివరిస్తుందిఇందులో నుండి 2.5 మిలియన్ల క్రియాశీల డిజిటల్ సృష్టికర్తలను అంచనా వేసిందిఈ సృష్టికర్తలు వార్షిక వ్యయంలో 350 బిలియన్ డాలర్లకు పైగా ప్రభావాన్ని చూపుతారుఇది 2030 నాటికి ఒక  ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనాలు ఉన్నాయిఇది సృష్టికర్తలతో వ్యాపార లావాదేవీల కంటే దీర్ఘకాలికప్రామాణిక భాగస్వామ్యాలను నిర్మించడానికి ప్రాధాన్యం ఇస్తుంది.

 ఎర్నెస్ట్ అండ్ యంగ్ రూపొందించిన 'ఎ స్టూడియో కాల్డ్ ఇండియా:  భాషా వైవిధ్యంగొప్ప సంస్కృతిసాంకేతిక నైపుణ్యం దృష్ట్యా భారతదేశాన్ని ప్రపంచ కంటెంట్ హబ్ గా ఎర్నెస్ట్ అండ్ యంగ్స్ నివేదిక అభివర్ణించిందియానిమేషన్వీఎఫ్ఎక్స్ సేవల్లో భారత్ 40 నుంచి 60 శాతం వ్యయ ప్రయోజనాన్నిభారతీయ ఓటీటీ కంటెంట్ కు పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్ ను ఇది ప్రముఖంగా సూచిస్తుందిప్రపంచ సాంస్కృతిక దౌత్యంలో భారతదేశ పాత్రను బలోపేతం చేస్తుంది.

లీగల్ కరెంట్స్,  ప్రత్యక్ష ఈవెంట్స్ ఇండస్ట్రీ నివేదికలుఖైతాన్ కంపెనీ లీగల్ హ్యాండ్  బుక్ ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ కాంప్లయిన్స్ నిబంధనలు వంటి కీలక అంశాలను కవర్ చేస్తూమీడియా వాటాదారులను భారతదేశ నియంత్రణల వ్యవస్థను సమర్థవంతంగా నావిగేట్ చేయడంలో సహాయపడుతుందిభారతదేశ లైవ్ (ప్రత్యక్షకార్యక్రమాల విభాగంపై శ్వేతపత్రం ఈ రంగం 15% వృద్ధి రేటును చూపుతున్నది. అభివృద్ధి చెందుతున్న ఈ రంగానికి మద్దతు ఇవ్వడానికి మెరుగైన మౌలిక సదుపాయాలుసరళమైన లైసెన్సింగ్ ప్రక్రియల అవసరాన్ని సూచిస్తుంది.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీజాతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

 

ముంబయిలో జాతీయ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఏర్పాటు చేస్తోన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (ఐఐసీటీసృజనాత్మక ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించటంలో ఒక మైలురాయిగా నిలవనుందిఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌లపై పనిచేయనున్న ఈ సంస్థను వేవ్స్ 2025 మూడో రోజు లాంఛనంగా ప్రారంభించారుఐఐసీటీని మీడియావినోద రంగంలో ప్రపంచ స్థాయి సంస్థగా మార్చేందుకు పారిశ్రామిక సంఘాలతో వేవ్స్ వేదికగా వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారుఈ వ్యూహాత్మక భాగస్వామ్యాలను లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్.. మీడియావినోద రంగాల్లో ‌ప్రపంచ స్థాయి నాయకత్వ స్థాయికి భారత్‌కు ఎదిగే సామర్థ్యం ఉందని ప్రధానంగా ప్రస్తావించారుసాంకేతికమేనేజ్ మెంటు విద్యలో ఐఐటీలుఐఐఎంలు ఎలా మైలురాళ్లుగా ఉన్నాయో.. ఐఐసీటీ కూడా తన రంగంలో ఒక ప్రధాన సంస్థగా మారనుందని అన్నారుజియోస్టార్అడోబ్గూగుల్‌యూట్యూబ్మెటావయాకామ్మైక్రోసాఫ్ట్ఎన్‌విడియా వంటి కంపెనీలు దీర్ఘకాలిక భాగస్వామ్యం కోసం ముందుకు వచ్చాయి.

 

క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్క్రియేటోస్పియర్సృజనాత్మక నైపుణ్యాల విషయంలో ప్రపంచ స్థాయి కార్యక్రమం

 

వేవ్స్ 2025కు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సీఐసీసీజన్ ఒకటిదీనికి గొప్ప ఆదరణ లభించింది. 60కి పైగా దేశాల నుంచి దాదాపు లక్ష రిజిస్ట్రేషన్లు వచ్చాయియానిమేషన్ఎక్స్ఆర్గేమింగ్ఏఐచిత్ర నిర్మాణండిజిటల్ మ్యూజిక్ తదితర విభాగాల్లోని క్రియేటర్లను సీఐసీ ఏకతాటిపైకి తెచ్చిందిఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి క్రియేటర్ స్టార్‌గా మారిపోయారు.

భవిష్యత్తులో తలెత్తే అంశాలుఊహాత్మక విషయాలకు సంబంధించిన 32 ఛాలెంజ్‌లను నిర్వహించారువీటి నుంచి 750కు పైగా తుదిపోటీదారులను ఎంపికచేశారుఈ ఛాలెంజ్‌లలో 1100కు పైగా అంతర్జాతీయ పోటీదారులు పాల్గొనటం విశేషంవేవ్స్‌లో సృజనాత్మకతను ప్రదర్శించేందుకు కేటాయించిన ప్రత్యేకమైన క్రియటోస్పియర్‌లో ఈ తుదిపోటీదారులు తమ ప్రాజెక్టులను వీక్షకుల ముందుంచారుపరిశ్రమల ప్రతినిధులతో అనుసంధానమ్యే అవకాశం కూడా క్రియటోస్పియర్ వారికి కల్పించింది.

క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ కేవలం పోటీగా మాత్రమే కాకుండా.. సంప్రదాయంసాంకేతికత కేంద్రంగా వైవిధ్యంయువజన శక్తికథాకథనాలను వేడుకగా జరుపుకునే ఉద్యమంగా మారిందిఅన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల నుంచి 12 నుంచి 66 ఏళ్ల మధ్య వయస్కులు పాల్గొనటంతో ఈ కార్యక్రమం సమగ్రతనుఆకాంక్షకు ప్రతిరూపంగా మారిందిరేపటి సృజనాత్మక భారత్‌ను అద్దం పట్టేలా క్షేత్రస్థాయి ఆవిష్కరణలుడ్రోన్ స్టోరీ‌టెల్లింగ్భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్న కంటెంట్‌లకు ఇది ఒక ఆవిష్కరణ వేదికగా తయారైందిసీఐసీ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నట్లుగా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందిఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ వంటి వాటితో ఈ జోరు మరింత ఊపందుకోనుంది.

8వ జాతీయ సామాజిక రేడియో సదస్సుసీఆర్‌లకు జాతీయ అవార్డులు

వేవ్స్‌లో భాగంగా నిర్వహించిన 8వ జాతీయ సామాజిక రేడియో సదస్సులో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ 12 అత్యుత్తమ స్టేషన్లను జాతీయ సామాజిక రేడియో అవార్డులతో సత్కరించారువిజేతలను అభినందించిన ఆయన.. ఆవిష్కరణసమ్మిళితత్వంప్రభావం ద్వారా భారత్‌లో సామాజిక మీడియా వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ జాతీయ సదస్సు లక్ష్యమని అన్నారుదేశవ్యాప్తంగా 400కు పైగా సామాజిక రేడియో (సీఆర్స్టేషన్ల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ సదస్సు.. భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునేందుకుచర్చలు జరిపేందుకు అవకాశం కల్పించిందిప్రస్తుతం దేశవ్యాప్తంగా 531 సీఆర్ స్టేషన్లు ఉన్నాయి.

భారత్ పెవిలియన్ కళ నుంచి కోడ్ వరకు భారత్ ప్రయాణం

భారతదేశ స్టోరీ టెల్లింగ్ సంప్రదాయాల గుండా తీసుకెళ్లే ఇమ్మర్సివ్ వ్యూ జోన్ అయిన భారత్ పెవిలియన్‌కు సందర్శకుల నుంచి ఘన స్వాగతంస్పందన లభించింది. "కళ నుంచి కోడ్ వరకుఅనే ఇతివృత్తం కింద ఈ పెవిలియన్ మౌఖికదృశ్య సంప్రదాయాల నుంచి అత్యాధునిక డిజిటల్ ఆవిష్కరణల వరకు మీడియావినోద రంగంలో భారత్‌ ప్రయాణాన్ని తెలియజేసింది.

ఈ పెవిలియన్ దేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్నిజరుగుతోన్న సాంకేతిక పురోగతిని సమతుల్యం చేస్తూ భారతదేశ ఆత్మను వీక్షకుల ముందుంచిందివేవ్స్ 2025 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ పెవిలియన్‌ను సందర్శించారుమహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ ఎస్ జైశంకర్కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్అనేక మంది ప్రముఖులు భారత్‌ పెవిలియన్‌ను సందర్శించి.. కథలను చెప్పడంలో దాని పాత్రను ప్రశంసించారుపెవిలియన్‌కు భారీగా సందర్శకులు వచ్చారుమన దేశానికి చెందిన అనేక విషయాలను తెలుసుకొని వాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు.

భారత్‌ సృజనాత్మక ప్రయాణాన్ని వేడుక చేసుకునే భారత్ పెవిలియన్ కేవలం కంటెంట్ ప్రదర్శన వేదికగా మాత్రమే కాకుండా ఒక క్రియేటర్‍గా భారత్‌కు ఉన్న శక్తి సామర్థ్యాలను వ్యక్తీకరించే కేంద్రంగా నిలిచిందిప్రపంచ స్టోరీ టెల్లింగ్‌లో భారతదేశ సంస్కృతికళాత్మక ఔన్నత్యాన్ని తెలియజేసింది.

సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఉజ్వల భవిష్యత్తుకు హామీ ఇస్తూ ముగిసిన వేవ్స్

సృజనాత్మకతవాణిజ్యంభాగస్వామ్యాలను ఏకతాటిపైకి తెచ్చిన ప్రపంచ స్థాయి వేదికగా వేవ్స్ 2025 ఒక ప్రామాణికతను ఏర్పాటు చేసిందిదార్శనిక విధాన ప్రకటనలుచారిత్రాత్మక అంతర్జాతీయ ఒప్పందాల నుంచి బలమైన వ్యాపార ఒప్పందాలుఅద్భుతమైన అంకుర పెట్టుబడుల వరకు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ స్థాయి నాయకత్వ స్థానానికి ఎదుగుతోన్న భారత్‌ ఖ్యాతిని ఈ సదస్సు ప్రధానంగా వ్యక్తపరిచింది. 77 భాగస్వామ్య దేశాలు వేవ్స్ డిక్లరేషన్‌ను ఆమోదించడం.. వేవ్ బజార్వేవ్‌ఎక్స్ యాక్సిలరేటర్ విజయం సాధించటం అనేవి సమష్టి సృజనాత్మకతసమ్మిళితత్వంఅంతర్జాతీయ భాగస్వామ్యాల మేళవింపుతో కూడిన భవిష్యత్తును తెలియజేస్తున్నాయితెరపడుతోన్న ఈ చారిత్రాత్మక మొదటి విడత వేవ్స్ భారతదేశ సృజనాత్మక శక్తిని ప్రదర్శించడమే కాకుండా సుస్థిర ప్రపంచ గమనాన్ని ప్రేరేపించిందిఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లకు స్ఫూర్తినివ్వటంవారిపై పెట్టుబడులు పెట్టటంవారిని ఉన్నత స్థాయిని తీసుకెళ్లటంలో పనిచేయటాన్ని కొనసాగిస్తునే ఉంటుంది.

 

అధికారిక తాజా సమాచారం కోసం మమ్మల్ని ఇక్కడ అనుసరించండి:

ఎక్స్ :

https://x.com/WAVESummitIndia

https://x.com/MIB_India

https://x.com/PIB_India

https://x.com/PIBmumbai

ఇన్‌స్టాగ్రామ్:

https://www.instagram.com/wavesummitindia

https://www.instagram.com/mib_india

https://www.instagram.com/pibindia

 

***


Release ID: (Release ID: 2126953)   |   Visitor Counter: 8