WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్-2025 లో భారత్ ప్రత్యక్ష కార్యక్రమాల విభాగంపై శ్వేత పత్రాన్ని విడుదల చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్

 Posted On: 03 MAY 2025 5:46PM |   Location: PIB Hyderabad

వేవ్స్ 2025  విజ్ఞాన భాగస్వాములలో ఒకటైన ఈవెంట్ఎఫ్ఏక్యూస్ మీడియా తయారు చేసిన "ఇండియాస్ లైవ్ ఈవెంట్స్ ఎకానమీ స్ట్రాటజిక్ గ్రోత్ ఇంపెరేటివ్శ్వేత పత్రాన్ని కేంద్ర సమాచారప్రసార - పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఆవిష్కరించారు తరహా మొట్టమొదటి శ్వేత పత్రం తయారీకి ఈవెంట్ఎఫ్ఏక్యూస్ మీడియాను సమాచారప్రసార మంత్రిత్వ శాఖ నియమించింది

 కార్యక్రమంలో సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజుసీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీ ఆర్కెజెనాసంయుక్త కార్యదర్శి శ్రీమతి మీను బాత్రాసంయుక్త కార్యదర్శి (ప్రసార విభాగంశ్రీ పృథుల్ కుమార్ఈవీఏ లైవ్ఈవెంట్ఫాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దీపక్ చౌదరి పాల్గొన్నారు.

భారత్ లో వేగంగా విస్తరిస్తున్న వినోద పరిశ్రమ  నిరంతర పురోగతికి ఉన్న వృద్ధి అవకాశాలుకొత్త పోకడలువ్యూహాత్మక సిఫార్సులతో కూడిన సమగ్ర విశ్లేషణను  శ్వేతపత్రం అందిస్తుంది.

భారత ప్రత్యక్ష కార్యక్రమాల ముఖచిత్రం ఒక చిన్న స్థాయి నుంచి దేశ సాంస్కృతిక,  సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలకు నిర్మాణాత్మకప్రభావవంతమైన దివ్వెలా మార్పు చెందుతోంది. 2024 నుంచి 2025 వరకు అహ్మదాబాద్ముంబయిలలో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కోల్డ్ ప్లే  ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా ప్రపంచ స్థాయి కార్యక్రమాలను నిర్వహించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని భారత్ చాటిచెప్పింది.

ఈవెంట్ టూరిజం పెరగడం  రంగంలోని ప్రధాన పోకడల్లో ఒకటిప్రత్యక్ష సంగీత కార్యక్రమాలకు హాజరయ్యేందుకు దాదాపు 5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారుబలమైన సంగీత-పర్యాటక ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావానికి ఇదొక సంకేతంగా భావించవచ్చువిఐపీక్యూరేటెడ్లగ్జరీ హాస్పిటాలిటీ వంటి ప్రీమియం టికెటింగ్ విభాగాలు ఏడాదికి 100% నమోదు చేశాయిఅనుభవ-ఆధారిత ప్రేక్షకుల పెరుగుదలకు ఇది నిదర్శనంరకరకాల నగరాలు పర్యటించడంస్థానిక పండగలకు విస్తృతమవుతున్న ప్రజాదరణ వంటి కారణాలతో టైర్-2 నగరాల నుంచి  పాల్గొనే వారి సంఖ్య  పెరిగింది.

 పురోగతి వినోద రంగంలో ఉద్యోగాలుప్రతిభలను ప్రతిబింబిస్తుందిఇకపై భారతదేశపు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ప్రత్యక్ష వినోదాన్ని పక్కన పెట్టేయలేంఇది ఒక వ్యూహాత్మక విభాగంఇది ఉపాధినినైపుణ్య అభివృద్ధిని  పెంచుతుందిఇలా భారీ స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలు సాధారణంగా సుమారు 2,000 నుంచి 5,000 వరకు తాత్కాలిక ఉద్యోగాలను సృష్టిస్తాయిజీవనోపాధివిస్తృత   శ్రామిక శక్తిని పెంపొందించడంలో  రంగం పాత్రను  అంశాలు స్పష్టం చేస్తాయి.

మీడియా-వినోద రంగం 2024-25 పై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ రూపొందించిన గణాంకాల పుస్తకంతో సహా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీతయారుచేసిన  'ఫ్రమ్ కంటెంట్ టు కామర్స్మ్యాపింగ్ ఇండియాస్ క్రియేటర్ ఎకానమీ', ఎర్నెస్ట్ & యంగ్ రూపొందించిన ' స్టూడియో కాల్డ్ ఇండియా', ఖైతాన్ & కో సిద్ధం చేసిన  'లీగల్ కరెంట్స్ రెగ్యులేటరీ హ్యాండ్బుక్ ఆన్ ఇండియాస్ మీడియా & ఎంటర్టైన్మెంట్ సెక్టార్ 2025' వంటి కీలక నివేదికలను కూడా  కార్యక్రమంలో విడుదల చేశారు.

పెట్టుబడులువిధాన మద్దతుమౌలిక సదుపాయాల మెరుగుదలతో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొదటి ఐదు ప్రత్యక్ష వినోద గమ్యస్థానాలలో ఒకటిగా నిలబడే దిశగా భారత్ సాగుతోందిఆర్థిక వృద్ధిఉపాధి కల్పనపర్యాటకంప్రపంచ సాంస్కృతిక ఉనికికి కొత్త మార్గాలను తెరవడం ఇందుకు అవకాశం కల్పిస్తాయి

అధికారిక తాజా సమాచారం కోసం "X " లో  లింకులను చూడండి.

https://x.com/WAVESummitIndia

https://x.com/MIB_India

https://x.com/PIB_India

https://x.com/PIBmumbai

ఇన్స్టాగ్రామ్ లో:

https://www.instagram.com/wavesummitindia

https://www.instagram.com/mib_india

https://www.instagram.com/pibindia

***

 


Release ID: (Release ID: 2126649)   |   Visitor Counter: 7