ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ కే కస్తూరి రంగన్ మృతికి ప్రధాని సంతాపం

Posted On: 25 APR 2025 2:34PM by PIB Hyderabad

భారత సైన్స్విద్యా రంగాల్లో మహోన్నత వ్యక్తిగా పేరు గాంచిన డాక్టర్ కే కస్తూరి రంగన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారుఅంకితభావంతో ఇస్రోకు సేవలందించిన డాక్టర్ కే కస్తూరి రంగన్భారతీయ అంతరిక్ష రంగాన్ని నూతన శిఖరాలు అధిరోహించేలా చేశారని శ్రీ మోదీ అన్నారు. ‘‘జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీముసాయిదాను రూపొందించడంలోదేశంలో అభ్యాసం సమగ్రంగాభవిష్యత్తుకు తగినట్టుగా ఉండేలా డాక్టర్ కస్తూరి రంగన్‌ చేసిన కృషికి భారత్ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందిఎంతో మంది యువ శాస్త్రవేత్తలుపరిశోధకులకు ఆయన ఉత్తమ మార్గదర్శిగా ఉన్నారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

‘‘ఎక్స్‌’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘భారతీయ శాస్త్రీయవిద్యా ప్రయాణంలో మహోన్నత వ్యక్తి డాక్టర్ కే కస్తూరి రంగన్ మరణం నన్ను కలచివేసిందిఆయన దార్శనిక నాయకత్వంనిస్వార్థమైన దేశ సేవ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

అంకితభావంతో ఇస్రోకు సేవలందించిభారత అంతరిక్ష రంగాన్ని నూతన శిఖరాలు అధిరోహించేలా చేశారుఈ అంశంలో మనకు అంతర్జాతీయ గుర్తింపు దక్కిందిఆయన నాయకత్వంలో  పెద్ద సంఖ్యలో ఉపగ్రహ ప్రయోగాలు జరిగాయిఆవిష్కరణలపై దృష్టి సారించారు.’’

‘‘జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీముసాయిదా రూపొందించడంలోదేశంలో అభ్యాసం సమగ్రంగాభవిష్యత్తుకు తగినట్టుగా ఉండేలా డాక్టర్ కస్తూరి రంగన్‌ చేసిన కృషికి భారత్ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందిఎంతో మంది యువ శాస్త్రవేత్తలుపరిశోధకులకు ఆయన ఉత్తమ మార్గదర్శిగా ఉన్నారు.

ఆయన కుటుంబంవిద్యార్థులుశాస్త్రవేత్తలుఅసంఖ్యాకమైన అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నానుఓం శాంతి’’

 

***


(Release ID: 2124291)