WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఎక్స్ ఆర్ సృజనాత్మక పరిష్కారాలను పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఇతర రంగాలకు చేరవేస్తున్న వేవ్స్ ఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ విజేతలు


వేవ్స్ సదస్సులో ఎక్స్ ఆర్ విజేతలైన అయిదు బృందాల ప్రాజెక్టుల ప్రదర్శన

రెండో మూడో శ్రేణి నగరాల నుంచి అధిక సంఖ్యలో ఎక్స్ ఆర్ సృజనకారుల ఆవిర్భావం

 Posted On: 10 APR 2025 9:06PM |   Location: PIB Hyderabad

 ప్రాజెక్టులో సంపూర్ణంగా లీనమైపోయే అనుభూతినిచ్చే (ఇమ్మర్సివ్ సాంకేతికత) పరిశోధన శాలలు మొదలుకొని వివిధ వేదికల మధ్య జరిగే వార్ గేములు వంటి అద్భుతాలను సృష్టిస్తున్న దేశ టాప్ ఎక్స్టెండెడ్ రియాలిటీ సృజనకారులు, కొత్త అంశాలను నేర్చుకునే విధానాన్ని, చికిత్సలు అందుకునే విధానాలని, షాపింగ్, పర్యాటన అనుభవాలని కొత్త తరహాలో పునఃపరిచయం చేస్తున్నారు. వేవ్స్ (ప్రపంచ దృశ్య-శ్రవణ, వినోద రంగ సదస్సు) లో భాగంగా సమాచార ప్రసార శాఖ వేవ్ ల్యాప్స్ సహకారంతో చేపట్టిన క్రియేట్ ఇన్ ఇండియా పోటీల్లో ఏర్పాటు చేసిన ఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ విజేతలను ప్రకటించారు. ఇమ్మర్సివ్ సాంకేతికతలో భారత్ ను మరింత ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ హ్యాకథాన్, 5 ప్రధాన ఇతివృత్తాలతో ఏర్పాటైంది, అవే – ఆరోగ్యం, శారీరక దారుఢ్యం, సంక్షేమం... విద్యారంగ  పరివర్తన... ఇమ్మర్సివ్ పర్యాటకం ... డిజిటల్ మీడియా, వినోదం... ఈ-కామర్స్, రిటైల్ వ్యాపార పరివర్తన.    

హ్యాకథాన్ లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి 2,200 మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మూడు దశల వడపోతల అనంతరం, అయిదు బృందాలను  విజేతలుగా ప్రకటించారు – వీరిలో వివిధ నగరాలు, సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) ద్వారా ఏర్పాటు చేసిన విజేతల సంరంభం (విన్నర్స్ సెరిమని) కార్యక్రమంలో విజేతలను ప్రకటించారు.

 

విజేతలుగా నిలిచిన బృందాలు, చేపట్టిన ఎక్స్ ఆర్ ప్రాజెక్టుల వివరాలు:

1) ‘ఎడ్యుకేషన్ ట్రాన్సఫర్మేషన్’ (విద్యారంగ పరివర్తన) అనే ఇతివృత్తంలో ‘ఎడ్యుస్కేప్ ఎక్స్ ఆర్’ పేరిట ప్రాజెక్టును చేపట్టిన ‘ఎక్స్ ఆర్ రన్నర్స్’ బృందం విజేతగా నిలిచింది.


ఐఐటీ-ఖరగ్ పూర్ విద్యార్థులు వీఆర్-ఆధారిత సాంకేతికత ద్వారా అభివృద్ధి పరచిన ఎడ్యుస్కేప్ ఎక్స్ ఆర్, హ్యాండ్ ట్రాకింగ్, ఎఐ ఆధారిత స్పందనను తెలుసుకోవడం ద్వారా భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్ర ప్రాజెక్టులలో ఇమ్మర్సివ్ సాంకేతికతను ఉపయోగించే వీలును విద్యార్థులకు  కల్పిస్తుంది. పరిశోధనశాల సౌకర్యాలు లేని అనేక పాఠశాలలకు, కళాశాలలకు ఇది ప్రయోజనం కలిగిస్తుంది. సాహిల్ పటేల్, శౌర్యా బరన్వాల్ లతో కూడిన బృందానికి సారథ్యం వహించిన వేదాంతా హాజ్రా స్పందిస్తూ.. “ప్రయోగశాలల కొరత వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లోని విద్యార్థులు వైజ్ఞానిక ప్రయోగాలు చేపట్టలేకపోతున్నారు. ఈ పరిస్థితిని మేం మార్చాలనుకున్నాం. వర్చువల్ రియాలిటీ వేదిక సాయంతో విద్యార్థులకు స్టెమ్ ప్రాక్టికల్స్ అందించడం ద్వారా విద్యా పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తేవాలన్నది మా అభిమతం” అని అన్నారు.

   2) ‘ఆరోగ్యం, శారీరక దారుఢ్యం, సంక్షేమం’ విభాగంలో ‘కాగ్నిహ్యాబ్’ ప్రాజెక్టును చేపట్టిన ‘కాగ్నిహ్యాబ్’ బృందం విజయాన్ని దక్కించుకుంది.

లేజీ ఐ (మెల్లకన్ను), గుండెపోటు, ఆందోళన ఆరోగ్య  సమస్యలకు కాగ్నిహ్యాబ్ బృందం ఎక్స్ ఆర్ ఆధారిత పరిష్కారాలను సూచించింది. బృందానికి నేతృత్వం వహించిన రిషభ్ కపూర్ మాట్లాడుతూ, “నిజజీవిత పరిస్థితుల్లో ఈ సమస్యల పరిష్కారాలను ప్రయత్నించి చూశాం. హ్యాకథాన్ ద్వారా మా విధానానికి మెరుగులు దిద్దుకునే అవకాశం, కొత్త భాగస్వాములను కనుగొనే అవకాశం మాకు దక్కింది” అని ఆనందం వ్యక్తం చేశారు. ఎక్స్ ఆర్ ఆరోగ్య సాంకేతికతలో అనుభవం కలిగిన పింటూ కుమార్ తదితరులు బృందంలోని ఇతర సభ్యులు.

 

3) ‘ఇమ్మర్సివ్ పర్యాటకం’ అంశంలో లూమెక్సార్ బృందానికి ‘ఇమ్మర్సివ్ ట్రావెల్ గైడ్’ ప్రాజెక్టు విజయాన్ని చేకూర్చింది.


లూమెక్సార్ అభివృద్ధి పరచిన మిక్సడ్- రియాలిటీ టూరిజం గైడ్, వినియోగదారులు వర్చువల్ పద్ధతిలో పర్యాటక ప్రాంతాలను గురించే ముందుగానే తెలుసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. 3-డీ మ్యాపులు, డ్రోన్ ల ద్వారా తీసిన ఛాయాచిత్రాలు, వీడియో కథనాలు వంటి అంశాలను ఒకచోట కూర్చి, ఔత్సాహిక పర్యాటకులు ఏ ప్రాంతాన్ని పర్యటించాలన్న నిర్ణయాన్ని తీసుకోవడంలో సహాయకారిగా ఉంటుంది. సాధారణ పర్యాటక బ్రోచర్లు, వీడియోలకు మించి, టూరిజం సంస్థలు పర్యాటకులకు ఎక్స్ ఆర్ ఆధారిత ప్రివ్యూలను అందించడంలో ఈ ప్రాజెక్టు ఉపయోగకరంగా ఉంటుంది. లూమెక్సార్ బృంద నాయకుడు శావియో మాట్లాడుతూ, “మ ప్రాజెక్టు సాధారణ ట్రావెల్ యాప్ లకు భిన్నం – ఒక ప్రాంత విశేషాలను కథల రూపంలో తెలియజేసే ఇమ్మర్సివ్ అనుభూతి. దీని ద్వారా బుక్ చేసుకునే ముందే పర్యాటకులు ఆయా ప్రాంతాలను నిజ జీవితంలో చూసిన అనుభూతిని పొందగలరు” అని అన్నారు.  

4)  ‘ఈ-కామర్స్, రిటైల్ వ్యాపార పరివర్తన’ అంశంలో పోటీ పడ్డ ‘ఈఎంఓ’ బృందానికి విజయాన్ని కట్టబెట్టిన ‘హెవెన్ ఎస్టేట్’ ప్రాజెక్ట్  

 

నూతన గృహాలను నిర్మించుకునే వారు ఇంటీరియర్ డెకోరేషన్ కు సంబంధించిన సరైన నిర్ణయాలు తీసుకోవడంలో హెవెన్ ఎస్టేట్ సాయపడుతుంది. ఏఆర్, 3-డీ సాంకేతికతల ద్వారా ఆయా సామగ్రి అమరిక గురించి వీరికి ప్రాథమిక అవగాహన కలుగుతుంది.  ఈ ప్రాజెక్టు కొనుగోలుదారు-అమ్మకందారు మధ్య వారధిగా నిలిచి, అధీకృత డిజైనర్లు తమ సామగ్రి చిత్రాలను అప్లోడ్ చేసేలా ప్రోత్సహిస్తుంది. దాంతో కొనుగోలుదార్లు తాము ఇష్టపడ్డ వస్తువులు తమ ఇంట్లో ఏ విధంగా అమరుతాయో తెలుకోగలుగుతారు. “గృహ యజమానులు, నిర్మాణ నిపుణుల మధ్య నిజమైన అనుసంధానం కోసం మేం ప్రయత్నించాం” అని ఈఎంఓ బృంద నాయకుడు ఉత్కర్ష్ రాయ్ వ్యాఖ్యానించారు. హిమాన్షు మహతో, ఆశుతోష్ మిశ్రా, ఇషితా గౌడ్ జట్టులోని ఇతర సభ్యులు. హ్యాకథాన్ లోని మెంటార్షిప్ దశ తమ డిజైన్, యూజర్ అనుభవాల మెరగుదలకు దోహదపడిందని బృందం అభిప్రాయపడింది.

5) ‘డిజిటల్ మీడియా, వినోదం’ ఇతివృత్తంగా జరిగిన పోటీల్లో ‘ఇమ్మర్సివ్ వార్ ఫేర్ సిమ్యులేటర్’ ప్రాజెక్టు సృష్టికర్తలైన యూత్ బజ్ టీం కు ప్రథమ స్థానం

యూత్ బజ్ బృందం తయారు చేసిన ది గేమ్ ఆఫ్ డైమన్షన్స్, వీ ఆర్ (వర్చువల్ రియాలిటీ) సాంకేతికతను వినియోగిస్తూ హెడ్ సెట్లు, మొబైల్ ఫోన్ల ద్వారా అనేకమంది ఒకేసారి పాల్గొనగలిగే ఇమ్మర్సివ్ గేమ్ ప్లే ను సృష్టించింది. “వివిధ ప్లాట్ఫామ్ లు, సాంకేతికతలను ఏకీకృతం చేసే గేమింగ్ అనుభూతిని అందించాలన్న ఆశయంతో ఈ ప్రాజెక్టు చేపట్టాం” అని జట్టు సారధి మోహిత్ కుమార్ శర్మ వెల్లడించారు. అనీశ్ డొంబాలే, ఏ శివరాం రాజ్, యశ్ సాధుఖన్ యూత్ బజ్ టీంలోని ఇతర సభ్యులు.    

  చంగల్ పట్, మణిపాల్, వేరవల్ సహా హ్యాకథాన్ లో రెండో మూడో శ్రేణి నగరాల నుంచి 66 శాతం సృజనకారులు భాగస్వాములయ్యారు. 17 నుంచి 35 ఏళ్ళ వయసువారు హ్యాకథాన్ లో అత్యధికంగా పాల్గొన్నారు.  ఫైనల్ కు చేరిన బృందాల్లో 53 శాతం విద్యార్థులు, 33 శాతం వృత్తి నిపుణులు, 14 శాతం స్వయం ఉపాధి రంగానికి చెందిన వారు ఉన్నారు. ఎక్స్ ఆర్ సృజనాత్మకత లో పెరుగుతున్న లింగ సమానతకి నిదర్శనంగా 19 శాతం మహిళలు ఫైనలిస్టులుగా నిలిచారు.  

వేవ్ ల్యాప్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ, అగ్ర ఎక్స్ ఆర్ కమ్యూనిటీలైన  భారత్ ఎక్స్ ఆర్, ఎక్స్ డీజీ  మద్దతుతో ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఇప్పుడు ప్రపంచ వేదికపైకి అడుగు పెడుతున్నారు. తరగతి గదులు, హాస్టళ్ళు, హోం స్టూడియోల్లో పుట్టిన ఆలోచనలు ప్రపంచ వినియోగదార్లను చేరే అవకాశం లభిస్తోంది. విజేతల పేర్లను ప్రకటించినప్పటికీ ఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ పోటీలు ముగియలేదు. ఫైనలిస్టులుగా నిలిచిన అయిదు బృందాలు తమ ప్రాజెక్టులను వేవ్స్ సదస్సులో ప్రదర్శించేందుకు సంసిద్ధమవుతున్నారు.   

 

సదస్సు — మే 1 నుంచి 4 వరకు ముంబయిలో జరగే ప్రపంచ మీడియా వినోదరంగ కార్యక్రమం కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైంది.


“ఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ సృజనకు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు నూతన డిజిటల్ ఇండియా పునాదులను నిర్మిస్తోంది. మనం కొత్త విషయాలను నేర్చుకునే విధానాన్ని, చికిత్సా పద్ధతులను, పర్యటన, అనుసంధాన పద్ధతులను ఈ కొత్త సాంకేతికతలు ప్రభావితం చేస్తాయి.” అని వేవ్ ల్యాప్స్ వ్యవస్థాపక సీఈఓ ఆశుతోష్ కుమార్  వ్యాఖ్యానించారు.

వేవ్స్ గురించి       About WAVES  


మీడియా, వినోద రంగాల్లో మైలురాయి వంటి తొలి వేవ్స్ సదస్సు (ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమిట్) ను భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 1 నుంచి  4 వ తేదీ వరకూ ముంబయిలో నిర్వహిస్తారు.

మీరు పరిశ్రమలో సేవలందిస్తున్న నిపుణులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలయినా, సదస్సు మీకు ప్రపంచ స్థాయి మీడియా, వినోద రంగాల్లో పని చేస్తున్న ఇతరులతో కలిసి పని చేసేందుకు, అనుసంధానమై మరింత తోడ్పాటును అందించేందుకు అవకాశాలని కల్పిస్తుంది.

కంటెంట్ సృష్టి, మేధోపరమైన హక్కులు, సాంకేతిక సృజనలో అగ్రగామి దేశంగా భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు వేవ్స్ సదస్సు దోహదపడుతుంది. ప్రసార విభాగాలు, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, సినిమాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్ద గ్రహణ, సంగీత రంగాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాలు, జెనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఎక్స్టెండెడ్ రియాలిటీ తదితర రంగాల్లోని పరిశ్రమలపై సదస్సు దృష్టి కేంద్రీకరిస్తుంది.

 

మీ సందేహాలు, ప్రశ్నలకు జవాబులు ఇక్కడ


 పీఐబీ వేవ్స్ బృందం  అందించే తాజా సమాచారంతో అప్డేట్ అవ్వండి.

  ఇప్పుడే మీ పేర్లను  నమోదు చేసుకోండి. 

 

***


Release ID: (Release ID: 2121160)   |   Visitor Counter: 25