ప్రధాన మంత్రి కార్యాలయం
దుబాయ్ యువరాజుతో ప్రధానమంత్రి భేటీ
• బలమైన భారత్-యూఏఈ సంబంధాలపై నిబద్ధత: ప్రధాని పునరుద్ఘాటన
Posted On:
08 APR 2025 4:07PM by PIB Hyderabad
దుబాయ్ యువరాజు గౌరవనీయ షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్-యూఏఈ సంబంధాల బలోపేతానికి నిబద్ధతతో ఉన్నట్లు శ్రీ మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో దుబాయ్ కీలక పాత్రను పోషించిందని ఆయన అన్నారు.
‘‘ఎక్స్’’లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘దుబాయ్ యువరాజు శ్రీ షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ను కలుసుకొన్నందుకు సంతోషిస్తున్నాను. భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో దుబాయ్ కీలక పాత్రను పోషించింది. మన మధ్య ఉన్న స్నేహాన్ని ఈ ప్రత్యేక పర్యటన మరోమారు దృఢపరచడంతోపాటు రాబోయే కాలంలో ఇప్పటికన్నా బలమైన సహకారం నెలకొనడానికి కూడా బాటలు వేస్తోంది.
@HamdanMohammed”
***
MJPS/ST
(Release ID: 2120064)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam