ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

థాయిలాండ్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

Posted On: 03 APR 2025 6:27PM by PIB Hyderabad

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అధికారిక థాయిలాండ్‌ పర్యటనలో భాగంగా ఈరోజు బ్యాంకాక్‌లో థాయిలాండ్ ప్రధాని శ్రీ పేటోంగ్‌టార్న్ షినవత్రాతో భేటీ అయ్యారుప్రభుత్వ అధికారిక నివాసానికి చేరుకున్న ప్రధానమంత్రికి షినవత్రా సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారువీరిరువురి మధ్య ఇది రెండో సమావేశం2024 అక్టోబర్‌లో వియంటియాన్‌లో జరిగిన ఆసియాన్ సంబంధిత శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ ఇరువురు నేతలు తొలిసారిగా భేటీ అయ్యారు.

భారత్థాయిలాండ్ మధ్య ద్వైపాక్షిక సహకారం గురించి ఇరువురు నేతలు సమీక్షించారురాజకీయ సహకారంరక్షణ - భద్రత భాగస్వామ్యంవ్యూహాత్మక భాగస్వామ్యంవాణిజ్యం పెట్టుబడులుఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలను గురించి వారు చర్చించారుకనెక్టివిటీఆరోగ్యంశాస్త్ర-సాంకేతికతఅంకురసంస్థలుఆవిష్కరణలుడిజిటల్విద్యసంస్కృతిపర్యాటక రంగాల్లో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారుమానవ అక్రమ రవాణామాదకద్రవ్యాల అక్రమ రవాణాసైబర్ మోసాల వంటి అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడంలో సహకారాన్ని మరింతగా బలోపేతం చేసే మార్గాలను కూడా వారు చర్చించారుఇరువురు ప్రధానులు ప్రపంచ సమస్యలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారుబిమ్స్‌టెక్ఏషియాన్మెకాంగ్ గంగా సహకారం సహా ఉప-ప్రాంతీయప్రాంతీయబహుపాక్షిక వేదికల్లో సన్నిహిత సహకారాన్ని పెంపొందించే మార్గాలను చర్చించారు.

భారత్-థాయిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాపన కోసం జరిగిన ఒప్పందంపై ఇరువురు ప్రధానుల సమక్షంలో ఆయా దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారుచేనేతహస్తకళలుడిజిటల్ టెక్నాలజీలు, సూక్ష్మచిన్నమధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎమ్ఎస్ఎమ్ఈలు), సముద్ర వారసత్వం వంటి రంగాల్లో కుదిరిన అవగాహన ఒప్పందాలపై కూడా ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారుఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో భారత్-థాయిలాండ్ కాన్సులర్ స్థాయిలో చర్చల నిర్వహణను ఇరువురు ప్రధానులు స్వాగతించారుఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాల జాబితాను ఇక్కడ చూడవచ్చు.

ప్రధానమంత్రి పర్యటనకు గుర్తుగాథాయ్ ప్రభుత్వం 18వ శతాబ్దం నాటి రామాయణ కుడ్య చిత్రాలు గల ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసిందిరెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సాంస్కృతికఆధ్యాత్మిక సంబంధాలను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని షినవత్రాపాళీ భాషలో గల బౌద్ధ పవిత్ర గ్రంథం త్రిపిటకాలు ప్రత్యేక సంచికను ప్రధానమంత్రికి అందజేశారుభారత్-థాయిలాండ్ మధ్య సన్నిహిత నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగాతవ్వకాల్లో బయటపడిన బుద్ధుని అవశేషాలను ప్రజల సందర్శన కోసం గుజరాత్ నుంచి థాయిలాండ్‌కు పంపనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారుగత సంవత్సరంబుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలతో పాటుఆయన శిష్యులు ఇరువురు భారత్ నుంచి థాయిలాండ్‌కు వచ్చారనిమిలియన్లకు పైగా ప్రజలు వాటిని సందర్శించి నివాళులర్పించారన్నారు.

భారత్ – థాయిలాండ్‌ రామాయణంబౌద్ధమతం సహా సాంస్కృతికభాషాపరమైనఆధ్యాత్మిక సంబంధాలతో కూడిన ఉమ్మడి నాగరికత సంబంధాలు గల సముద్రతీర పొరుగు దేశాలుభారత్ 'యాక్ట్ ఈస్ట్విధానంలోఏషియాన్‌తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంవిజన్ మహాసాగర్ఇండో-పసిఫిక్ విజన్‌లలో థాయిలాండ్ పాత్ర కీలకమైనదినిరంతర చర్చలుయుగాల నాటి సంబంధాలుఉమ్మడి ఆసక్తుల ఆధారంగా బలమైనబహుముఖమైన సంబంధాలు ఇరు దేశాల మధ్య నెలకొన్నాయి.

 

***


(Release ID: 2118644) Visitor Counter : 29