ప్రధాన మంత్రి కార్యాలయం
భూకంప విషాదం నేపథ్యంలో మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్తో మాట్లాడిన ప్రధానమంత్రి
Posted On:
29 MAR 2025 1:41PM by PIB Hyderabad
భూకంప విషాదం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్తో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో మయన్మార్కు అండగా నిలవడంలో సన్నిహిత మిత్రదేశంగా, పొరుగుదేశంగా భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ విపత్తుకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించినట్లు తెలిపిన ప్రధానమంత్రి.. బాధిత ప్రాంతాలకు తక్షణ ఉపశమనాన్ని, అవసరమైన సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.
‘ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు:
“మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్తో మాట్లాడాను. విధ్వంసకరమైన భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టం పట్ల మన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను. సన్నిహిత మిత్రదేశంగా, పొరుగుదేశంగా ఈ క్లిష్ట సమయంలో యావత్ భారత్ మయన్మార్కు అండగా ఉంటుంది. #ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా విపత్తు సహాయ సామాగ్రి, మానవతా సాయం, సెర్చ్, రెస్క్యూ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వెంటనే పంపిస్తున్నాం’’.
***
MJPS/SR
(Release ID: 2116818)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam