ప్రధాన మంత్రి కార్యాలయం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా సాధికారతపై నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
Posted On:
08 MAR 2025 10:36AM by PIB Hyderabad
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీశక్తికి వందనం చేస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
దేశంలోని మహిళల సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం సదా కృషి చేస్తున్నదని వివరిస్తూ- నేను ఇదివరకే వాగ్దానం చేసిన మేరకు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేస్తున్న మహిళామణులకు ఈ రోజున నా సామాజిక మాధ్యమ ఖాతాలను అప్పగిస్తున్నాను అని శ్రీ మోదీ ప్రకటించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా పంపిన సందేశంలో:
"#మహిళా దినోత్సవం సందర్భంగా మన నారీశక్తికి సగౌరవ వందనం! మా ప్రభుత్వం సదా మహిళల సాధికారత కోసం కృషి చేస్తుంది. మా పథకాలు, కార్యక్రమాలు ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక నేనిదివరకే వాగ్దానం చేసిన ప్రకారం- విభిన్న రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్న మహిళామణులకు ఇవాళ నా సామాజిక మాధ్యమ ఖాతాలను స్వాధీనం చేస్తున్నాను!" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 2109340)
Visitor Counter : 56
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam