సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దృఢమైన, ఆరోగ్యకరమైన భారత్ దిశగా: సమష్టి కృషితో ఊబకాయంపై పోరాటం

Posted On: 01 MAR 2025 10:41AM by PIB Hyderabad

ఆహారపు అలవాట్లలో చిన్నచిన్న మార్పుల ద్వారా మరింత దృఢమైనరోగాలు దరిచేరని భవిష్యత్తును మనం సొంతం చేసుకోగలం.” – ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

 

పరిచయం

దేశంలో ప్రజారోగ్యాన్ని సవాలు చేస్తున్న ప్రధాన సమస్య ఊబకాయంఈ బాధితుల్లో అన్ని వయసుల వారూ ఉన్నారుమధుమేహంగుండెజబ్బురక్తపోటు వంటి అసాంక్రమిక వ్యాధుల ప్రమాదాన్ని ఇది పెంచుతోందిఅనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లుకూర్చున్న చోటు నుంచి లేవని జీవనశైలిపలు పర్యావరణపరమైన అంశాల వల్ల ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న స్థూలకాయం.. పల్లెపట్టణమన్న తేడా లేకుండా జనాన్ని బాధిస్తోందిప్రాసెస్ చేసిన ఆహార వినియోగం పెరగడంశారీరక శ్రమ తగ్గడంజీవన శైలిలో మార్పులు కూడా ఈ సంక్షోభం ముదరడానికి కారణమయ్యాయి

ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవలి మన్ కీ బాత్ ప్రసంగంలో దేశవ్యాప్తంగా ఊబకాయాన్ని తగ్గించడంపై అవగాహన పెంచాలనిఈ దిశగా సమష్టి కృషి అత్యావశ్యకమని స్పష్టం చేశారుముఖ్యంగా వంటనూనెల వాడకాన్ని తగ్గించాలని కోరారుఉద్యమస్థాయిలో ఈ అవగాహన ప్రచారాన్ని నిర్వహించాలన్న ఆయన.. దీనికి నేతృత్వం వహించాల్సిందిగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను నామినేట్ చేశారుసమష్టి కృషి దిశగా ప్రధానమంత్రి పిలుపు దృఢమైనఆరోగ్యకరమైన భారత్ ఆవశ్యకతను స్పష్టం చేస్తోందివ్యక్తిగతంగానూసామాజికంగానూ ఊబకాయాన్ని ఎదుర్కోవడం ఇందులో ముఖ్యమైన అంశంఫిట్ ఇండియా మూమెంట్ఎన్పీ-ఎన్సీడీపోషణ్ అభియాన్ఈట్ రైట్ ఇండియాఖేలో ఇండియా సహా అనేక కార్యక్రమాల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిమెరుగైన పోషకాహారంశారీరక వ్యాయామాలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందిప్రజలందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తు దిశగా భరోసా కల్పించేలా జీవనశైలిలో దీర్ఘకాలిక మార్పులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమాల లక్ష్యంఅమృత కాలం దిశగా భారత్ అడుగులేస్తున్న తరుణంలో.. విధానపరమైన సంస్కరణలుసామాజిక భాగస్వామ్యంనియంత్రణ చర్యల ద్వారా ప్రభుత్వమూ సమాజమూ పూర్తి అంకితభావంతోసమష్టిగా ఊబకాయంతో పోరాడుతున్నాయిప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడంఅవగాహనను పెంపొందించడం అన్నవి ఈ సమస్యను తిప్పికొట్టడానికిసంబంధిత విపత్తుల నుంచి భవిష్యత్తు తరాలను రక్షించడానికి ముఖ్య సాధనాలు.

ఊబకాయంపై అవగాహననిర్వచనంకారణాలు

ఊబకాయమంటే ఏమిటి?

ఆరోగ్యానికి ప్రమాదం కలిగించేలా సాధారణ స్థాయిని మించి లేదా అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ఊబకాయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించిందిసాధారణంగా స్థూలకాయాన్ని వర్గీకరించడానికి ఉపయోగించే ప్రమాణం ‘బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)’. 25 లేదా అంతకుమించి ఉన్న బీఎంఐని అధిక బరువుగా పరిగణిస్తారు. 30 లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న బీఎంఐని ఊబకాయ జాబితాలో చేరుస్తారుభారత్ లో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23 నుంచి 24.9 కి.గ్రా/మీ² ఉన్న వ్యక్తులను అధికంగా బరువున్న వారిగాబీఎంఐ 25 కి.గ్రా/మీ² లేదా అంతకు మించి ఉంటే ఊబకాయంగా పరిగణిస్తారుఒక వ్యక్తి బీఎంఐ 35 లేదా అంతకుమించి ఉంటే దానిని అనారోగ్యకరమైన ఊబకాయంగా పరిగణిస్తారు.

బీఎంఐ అంటే ఏమిటి?

బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)ను గతంలో క్యూట్లెట్ ఇండెక్స్ అని పిలిచేవారుయువత బరువు ఆరోగ్యకరంగానే ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఇది సులభమైన మార్గంఓ వ్యక్తి బరువును (కిలోగ్రాముల్లోతన ఎత్తుతో (మీటర్లలోభాగించగా వచ్చిన ఫలితపు వర్గాన్ని (కి.గ్రా/మీ²బీఎంఐగా పేర్కొంటారుఒక వ్యక్తి బరువు (కేజీల్లో)ను తీసుకునితన ఎత్తుతో (మీటర్లలోభాగించిఆ ఫలితపు వర్గాన్ని కనుగొనడం ద్వారా బీఎంఐని తెలుసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన బీఎంఐ పరిధి 

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం సాధారణ బీఎంఐ పరిధి 18.5 నుంచి 24.9 మధ్య ఉండాలి.

అంతర్జాతీయ గణాంకాలు

ప్రపంచవ్యాప్తంగా పిల్లలూ పెద్దల్లో అధిక బరువుఊబకాయం తీవ్రత క్రమంగా పెరుగుతోంది. 1990 – 2022 మధ్య ఊబకాయంతో ఉన్న పిల్లలుయువత (5 – 19 సంవత్సరాలుసంఖ్య శాతం నుంచి నుంచి శాతానికిఅంటే నాలుగు రెట్లు పెరిగిందిఇదే సమయంలో ఊబకాయంతో కూడిన యువత (18 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సునిష్పత్తి రెట్టింపును మించి శాతం నుంచి 16 శాతానికి పెరిగింది.

భారత్ లో గణాంకాలు

  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్)-5 (2019-21) ప్రకారం మొత్తం భారతీయ స్త్రీలలో 24%, పురుషులలో 23% అధిక బరువు లేదా ఊబకాయాన్ని ఎదుర్కొంటున్నారు.

  • ఎన్ఎఫ్ హెచ్ఎస్-5 (2019-2021) ప్రకారం.. 15-49 సంవత్సరాల మధ్య వయస్కులలో, 6.4% మంది మహిళలు, 4% మంది పురుషులు ఊబకాయంతో ఉన్నారు.

  • దేశవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో అధికంగా బరువు (ఎత్తును బట్టి బరువుఉన్న వారు ఎన్ఎఫ్ హెచ్ఎస్-4 (2015-16)లో 2.1 శాతంగా ఉండగాఎన్ఎఫ్ హెచ్ఎస్-5 (2019-21) నాటికి అది 3.4 శాతానికి పెరిగింది.

భారత్ లో ఊబకాయం పెరగడానికి ముఖ్య కారణాలు

image.png

ఊబకాయాన్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వ వ్యూహాత్మక ఫ్రేమ్ వర్క్

విధానపరమైన ఆవిష్కరణలుగణనీయమైన ఫలితాలు

స్థూలకాయాన్ని ప్రధాన ప్రజారోగ్య సమస్యగా గుర్తించిన భారత ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ దానిని నిరోధించడానికితగ్గించడానికి సమగ్రమైనబహుముఖీనమైన కార్యక్రమాలను ప్రారంభించిందిసమగ్ర విధానాన్ని ప్రోత్సహించే దిశగా పలు మంత్రిత్వ శాఖలు వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమాలను రూపొందించాయితద్వారా ఆరోగ్యంపోషకాహారంశారీరక శ్రమఆహార భద్రతజీవనశైలి మార్పులను ఒకేచోటికి తెచ్చాయికేంద్రప్రభుత్వ చర్యలను కింద పేర్కొన్న విధంగా వర్గీకరించవచ్చు:

1. ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ – ప్రజారోగ్య సదుపాయాలను బలోపేతం చేసింది

1.1 జాతీయ అసాంక్రమిక వ్యాధుల నిరోధకనియంత్రణ కార్యక్రమం (ఎన్పీ-ఎన్సీడీ)

డబ్ల్యూహెచ్ వో 2018 – ఎన్సీడీ ఇండియా ప్రొఫైల్ ప్రకారం.. భారత్ లో మొత్తం 63% మరణాలకు అసాంక్రమిక వ్యాధులు కారణమవుతున్నాయిహృదయ సంబంధ వ్యాధులు (27%), దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు (11%), క్యాన్సర్లు (9%), మధుమేహం (3%), ఊబకాయం (13%)  సహా ఇతర సమస్యలు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

పొగాకు వాడకంఅనారోగ్యకరమైన ఆహారంశారీరక శ్రమ లేకపోవడంమద్యపానం సహా అనేక జీవనశైలి అంశాలు హృదయ సంబంధ వ్యాధులుక్యాన్సర్లుమధుమేహందీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల వంటి అసాంక్రమిక వ్యాధులకు ముఖ్య కారణాలువీటిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందివాయు కాలుష్యం ఈ ముప్పును ఇంకా పెంచుతోందిఈ అంశాలు ఊబకాయంఅధిక రక్తపోటురక్తంలో చక్కెర స్థాయిలూ కొలెస్టరాలూ పెరగడానికి కారణమవుతున్నాయిఇవన్నీ అసాంక్రమిక వ్యాధులు సోకే అవకాశాన్ని గణనీయంగా పెంచుతాయివీటిలో చాలావరకూ నివారించదగినవే కాబట్టి ఊబకాయ సమస్యను పరిష్కరించడంఅనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను విడనాడడం అసాంక్రమిక వ్యాధుల భారాన్ని తగ్గించడంలో కీలకమైన అంశాలు

జాతీయ అసాంక్రమిక వ్యాధుల నిరోధకనియంత్రణ కార్యక్రమం (ఎన్పీ-ఎన్సీడీకింద జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ఎంద్వారా.. వివిధ సమూహాలుపౌర సమాజంమీడియాఇతర పక్షాలను భాగస్వాములను చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించాలని ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ లక్ష్యంగా పెట్టుకుందిఆరోగ్య రక్షణకు సంబంధించి అన్ని స్థాయిల్లోనూ.. అంటే వ్యాధి పరీక్షముందస్తు నిర్ధారణనిర్వహణసూచనలుఅనంతర పరీక్షలపై ప్రధానంగా దృష్టి సారించడం ద్వారా నిరంతర రక్షణకు ఇది భరోసా కల్పిస్తుందినివారణచికిత్సపునరుద్ధరణఅవగాహన (ఐఈసీబీసీసీ), పర్యవేక్షణపరిశోధన అంశాల్లో హాస్పిటళ్ల సామర్థ్యాన్ని పెంచడం కూడా ఈ కార్యక్రమ లక్ష్యంఅంతేకాకుండా అత్యవసర ఔషధాలువైద్య సామగ్రిరవాణాకు సంబంధించి సరఫరా వ్యవస్థ నిర్వహణను కూడా ఇది మెరుగుపరుస్తుందితద్వారా ఒకే రకమైన ఐసీటీ వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన పర్యవేక్షణఅంచనాజాతీయ స్థాయిలో అమలుకు హామీ ఇస్తుంది.

image.png

ముఖ్యాంశాలు

  • ఎన్పీసీడీసీడీ కింద కల్పించిన సదుపాయాలు – 682 జిల్లా ఎన్సీడీ క్లినిక్ లు, 191 జిల్లా హృదయ సంరక్షణ యూనిట్లు, 5,408 సీహెచ్ సీ ఎన్సీడీ క్లినిక్ లు.

  • ముందస్తు సంరక్షణఅవగాహన – ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యసంక్షేమ కేంద్రాల ద్వారా ఇది అమలవుతోందిసంక్షేమసామాజిక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

2. ఆయుష్ మంత్రిత్వ శాఖసాంప్రదాయకసమగ్ర ఆరోగ్య విధానాలకు ప్రోత్సాహం

ఊబకాయంఅధిక బరువు సమస్యను ఆయుర్వేదం ద్వారా సమర్థవంతంగా పరిష్కరించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను అమలు చేసింది:

  1. ప్రత్యేక ఆయుర్వేద సంరక్షణ: న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏఊబకాయంసంబంధిత జీవనశైలి రుగ్మతలకు ప్రత్యేక చికిత్సలను అందిస్తోందిఈ చికిత్సల్లో పంచకర్మ చికిత్సలుఆయుర్వేద ఔషధాలువ్యక్తిగత ఆహార మార్గదర్శకాలుయోగా విధానాలను మిళితం చేస్తున్నారుఇప్పటి వరకు మధుమేహంజీవక్రియ వ్యాధులతో బాధపడుతున్న దాదాపు 45,000 మంది రోగులకు ఈ సేవల ద్వారా ప్రయోజనం లభించింది.

image.jpeg  

  1. పరిశోధనప్రమాణాల నిర్ధారణ: ఊబకాయం సహా జీవనశైలి వ్యాధుల నుంచి సమర్థవంతమైన రక్షణను అందించడం కోసం కేంద్ర ఆయుర్వేద శాస్త్రాల పరిశోధన మండలి (సీసీఆర్ఏఎస్పరిశోధన నిర్వహిస్తోందిఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోఊబకాయం వంటి సమస్యలను నివారించడంలో దినచర్య (రోజువారీ నియమావళి), ఋతుచర్య (కాలానుగుణ నియమావళి), ఆహార (ఆహార మార్గదర్శకాలు), యోగా వంటి అభ్యాసాలు ప్రభావవంతంగా ఉన్నాయని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.

  2. ఆయుర్ స్వస్థ్య యోజన: 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కేంద్ర పథకం అమలవుతోందిసామాజిక ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్ చేపట్టిన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ‘ఆయుష్ప్రజారోగ్యం’ ఇందులో భాగంగా ఉంటాయిజీవనశైలి రుగ్మతలుఅసాంక్రమిక వ్యాధుల నిర్వహణకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు ఈ పథకం చేయూతనిస్తుందిప్రస్తుతం 11 ప్రాజెక్టులు స్థూలకాయంమధుమేహంరక్తపోటుబోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తున్నాయి.

  3. సమష్టి పరిశోధన చర్యలు: ఆయుర్వేదంలో శాస్త్రీయ పరిశోధనలను పెంచడానికి శాస్త్రీయపారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్)తో ఆయుష్ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుందిదీనిద్వారా సాంప్రదాయక ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో అనుసంధానించే పరిశోధనల అభివృద్ధిఅమలుపై.. ప్రత్యేకించి ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత రుగ్మతల నిర్వహణపై దృష్టి సారిస్తారు.

ఈ సమగ్ర చర్యల ద్వారా ఊబకాయం నివారణతగిన విధానాల కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.

 

3. మహిళాశిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ

పోషణ్ అభియాన్బాల్యంలో ఊబకాయాన్ని నివారిస్తుంది

2018 మార్చి 8న ప్రారంభించిన పోషణ్ అభియాన్ సంపూర్ణ పోషణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమంపోషకాహార పరిమాణంసరఫరాప్రజల్లో అవగాహనను పెంచి పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కోవడంతోపాటు సంక్షేమాన్ని ప్రోత్సహించడం.. తద్వారా చిన్నారులుకౌమార దశలో ఉన్న బాలికలుగర్భిణులుబాలింతల్లో పోషకాహార లోపాలను నివారించడం దీని లక్ష్యం  

image.jpeg

 

పోషణ్ అభియాన్పోషణ్ 2.0 లోని ముఖ్య భాగాలు

సాంకేతికతను ఉపయోగించి పర్యవేక్షణవివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంజన ఆందోళన్ మూమెంట్ ద్వారా సామాజిక భాగస్వామ్యంతో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు సమగ్ర విధానాన్ని ‘పోషణ్ అభియాన్’ అవలంబిస్తోందిఇంట్లోనే పోషకాహారం లభించేలా పోషణ వాటిక (న్యూట్రి గార్డెన్)లను ప్రోత్సహిస్తుందిమిషన్ సక్షం అంగన్వాడీపోషణ్ 2.0 (2021) కింద అంగన్వాడీ సేవలను బలోపేతం చేయడంతోపాటు కౌమార దశలోని పిల్లల ఆరోగ్యాన్ని పోషణ్ అభియాన్ మెరుగుపరుస్తుందిఅంతేకాకుండా ఆయుష్ ఆధారిత సంక్షేమ విధానాలను ఏకీకృతం చేస్తుందిమాతా శిశు పోషణఆహార వైవిధ్యంబలవర్ధకమైన ఆహారంచిరుధాన్యాలుపోషకాలు పుష్కలంగా ఉన్న ఆహార వినియోగాన్ని ప్రోత్సహిస్తూ రక్తహీనతనులోపాలను అరికట్టడానికి ఈ కార్యక్రమం ప్రాధాన్యమిస్తుంది.

 

4. యువజన వ్యవహారాలుక్రీడల మంత్రిత్వ శాఖశారీరక దారుఢ్యాన్ని పెంపొందించడం

4.1. ఫిట్ ఇండియా మూమెంట్: ప్రజారోగ్య విప్లవం

  • 2019లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం క్రియాశీలమైన జీవన శైలికి ప్రచారం కల్పించడంతోపాటురోజువారీ కార్యక్రమాల్లో దేహదారుఢ్యాన్ని భాగంగా చేసుకునేలా వ్యక్తులను ప్రోత్సహిస్తుంది.

  • ముఖ్యమైన అంశాలు:

    • శారీరక వ్యాయామాన్ని పాఠ్యాంశాల్లో చేర్చే పాఠశాలలకు ‘ఫిట్ ఇండియా స్కూల్ ధ్రువీకరణ’.

    • పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్నడకలను ప్రోత్సహించేలా ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం.

image.jpeg

ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్’ను ప్రారంభించిన కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడల మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ

    • సామూహిక యోగా సదస్సులురన్నింగ్ క్లబ్బులుపని ప్రాంతాల్లో ఫిట్నెస్ చాలెంజిల వంటి సామూహిక దారుఢ్య కార్యక్రమాలు.

4.2 ఖేలో ఇండియా కార్యక్రమంచేతనాశీలత గల తరాన్ని నిర్మించడం

image.jpeg

దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా పాఠశాల నుంచి ఉన్నత పోటీల వరకు అన్ని స్థాయిల్లో క్రీడా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం ‘ఖేలో ఇండియా’ క్రీడల అభివృద్ధి కోసం జాతీయ కార్యక్రమాన్ని 2016-17లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందితమతమ క్రీడల్లో రాణించడం కోసం అవసరమైన అన్ని వనరులనూ సమకూరుస్తూ.. యువ అథ్లెట్లకు అత్యున్నత స్థాయి శిక్షణప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యందేశంలోని గ్రామీణపట్టణ ప్రాంతాల్లో సమానంగా క్రీడా అవకాశాలు లభించేలా ఈ పథకం భరోసా ఇస్తుంది.

 

ప్రధాన విజయాలు:

image.jpeg

 

 

5. భారత ఆహార భద్రతప్రమాణాల ఆధీకృత సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ): ప్రజారోగ్యం కోసం ఆహార నియంత్రణ

5.1 ఈట్ రైట్ ఇండియా మూమెంట్ (ఎఫ్ఎస్ఎస్ఏఐ): ఆహారాన్ని ఎంచుకోవడంలో మార్పుల ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తు

భారత ఆహార భద్రతప్రమాణాల ఆధీకృత సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐఈట్ రైట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిందిఅందరికీ సురక్షితమైనఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ఉద్దేశించిన పలు కీలక కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయికొన్ని మౌలిక కార్యక్రమాలు కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి:

image.png

ఈట్ రైట్ ఇండియా కింద ముఖ్యమైన కార్యక్రమాలు

ప్రభుత్వ శాఖలు చేయాల్సినవి:

  • ఆహార భద్రత శిక్షణధ్రువీకరణ (ఎఫ్ వోఎస్టీఏసీ): ఆహార భద్రతధ్రువీకరణ సర్టిఫికేట్ ను ఎఫ్ఎస్ఎస్ఏఐ జారీ చేస్తుందిప్రతి ఆహార వ్యాపారంలో ఆహార భద్రత పర్యవేక్షకులుండేలా ఇది నిర్దేశిస్తుంది.

  • ధ్రువీకరణ కార్యక్రమాలుస్ట్రీట్ ఫుడ్ కేంద్రాలుమార్కెట్లుస్టేషన్లుప్రార్థన స్థలాలలో పరిశుభ్రత ఉండేలా చూస్తుంది.

  • పరిశుభ్రతకు రేటింగ్రెస్టారెంట్లుకేటరింగ్ సేవలుమిఠాయి దుకాణాలుమాంసం విక్రేతలకు పరిశుభ్రత ప్రమాణాలపై రేటింగ్ ఇస్తారు.

ప్రజా కేంద్రీకృత కార్యక్రమాలు:

  • వినియోగదారుల్లో అవగాహన: ఈట్ రైట్ క్యాంపస్ఈట్ రైట్ స్కూల్ కార్యక్రమాల ద్వారా సురక్షితమైన ఆహార వినియోగాన్ని ప్రోత్సహించడం.

  • కల్తీని గుర్తించడంఇంట్లోబడిలో ఆహారాన్ని పరీక్షించడం కోసం డార్ట్ బుక్మ్యాజిక్ బాక్స్ లను అందించడం.

 

సురక్షితమైన ఆహార డార్ట్ బుక్ – వేగవంతమైన పరీక్షతో కల్తీని గుర్తించేందుకు (డిటెక్ట్ అడల్ట్రేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్ డీఏఆర్టీ) ఉపయోగపడే పుస్తకమిదిచిన్నచిన్న వస్తువులను ఉపయోగించి ఆహార కల్తీని గుర్తించడం కోసం ఇంట్లోనే పరీక్షించుకునేలా 50కి పైగా వ్యాసాలు ఇందులో ఉన్నాయిప్రజలు ఈ పుస్తకాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చుదీనిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దుఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను ఇది సూచిస్తుంది.

 

 


 


 


 


 

ఫుడ్ సేఫ్టీ మ్యాజిక్ బాక్స్ – ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ మ్యాజిక్ బాక్స్దానితోపాటు వచ్చే పుస్తకం పాఠశాలలుఉపాధ్యాయులుతల్లిదండ్రులకు అభ్యసన సాధనంఆహార కల్తీలను గుర్తించడానికి 102 సాధారణ పరీక్షలుఅలాగే వాటితోపాటు ఓ పుస్తకం ఇందులో ఉంటాయి.

 

image.png

 

image.png

   

  • మొబైల్ టెస్టింగ్మారుమూల ప్రాంతాల్లో పరీక్షలుశిక్షణ కోసం వాహనాల ద్వారా సదుపాయాన్ని అందిస్తుంది.

  • ఆహారానికి పోషకాలను జోడించడం: సూక్ష్మ పోషక లోపాలను నివారించడం కోసం బలవర్ధకమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది.

ఆహారం విషయంలో మార్గనిర్దేశం చేసి స్థూలకాయంజీవనశైలి సంబంధిత వ్యాధులను ప్రజలు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆహార భద్రతా ప్రమాణాలను నియంత్రించడంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది.

5.2 దేశవ్యాప్త అవగాహన ప్రచారం – ‘ఆజ్ సే తోడా కమ్’
ప్రజలు కొవ్వుచక్కెరఉప్పు వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని కోరుతూ.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం కోసం  ‘ఆజ్ సే తోడా కమ్’ ప్రచారాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రారంభించిందిఈ మల్టీమీడియా ప్రచారంలో కింది అంశాలు ముఖ్యమైనవి:

  • వివిధ భాషల ప్రేక్షకులకు అర్థమయ్యేలా 12 భాషల్లో సబ్ టైటిల్స్ తో కూడిన చిన్న చిన్న అవగాహన వీడియోలు.

      1. తెలివిగా ఆహారాన్ని తీసుకోవడమనే సందేశాన్ని ప్రముఖంగా పేర్కొంటూ ఫ్లైయర్‌లుబ్యానర్‌లుఆడియో క్లిప్‌లు.

      2. ఆహార అలవాట్లలో వివేచనతో కూడిన మార్పుల కోసం విలువైన సమాచారాన్నిచ్చేలా.. ప్రత్యేకంగా ‘ఈట్ రైట్ ఇండియా’ వెబ్ సైట్ ఏర్పాటు.

image.jpeg

 

5.3 అధికంగా కొవ్వులవణాలుచక్కెర (హెచ్ఎఫ్ఎస్ఎస్ఉన్న ఆహారాలను నియంత్రించడం  

అధికంగా కొవ్వులవణాలుషుగర్ (హెచ్ఎఫ్ఎస్ఎస్ఉన్న ఆహారాలపై తప్పనిసరిగా వాటి వివరాలను ముద్రించాలని (లేబులింగ్ఐసీఎంఆర్జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)తో కలిసి ఎఫ్ఎస్ఎస్ఏఐ సిఫార్సు చేసిందిదీని లక్ష్యాలు:

    1. తినడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల ప్యాక్ ముందు భాగంలో స్పష్టమైన లేబులింగ్ ఉండేలా చూడడం.

    2. ఆహారం విషయంలో వినియోగదారులు వివేచనతో కూడిన నిర్ణయాలను తీసుకునేలా సహాయపడడంఅనారోగ్యకరమైన ఆహార వినియోగాన్ని తగ్గించుకునేలా చూడడం.

5.4 వివిధ వేదికల ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు  

ఎఫ్ఎస్ఎస్ఏఐ నేతృత్వంలో కింది చర్యల ద్వారా ప్రభుత్వం క్రియాశీలకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది:

a. ముద్రణఎలక్ట్రానిక్సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాలు ఆహారం విషయంలో వివేచనతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.

b. ఊబకాయ నివారణఆరోగ్యకరమైన జీవనంపై రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించే క్యాన్సర్మధుమేహంహృదయ సంబంధ వ్యాధులుగుండెపోటు నివారణనియంత్రణ కార్యక్రమం (ఎన్పీసీడీసీఎస్)తో అనుసంధానం చేయడం.  

5.5 రూకో కార్యక్రమం

image.jpeg

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రారంభించిన ఉపయోగించిన వంట నూనె పునరుద్ధరణ (రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్రూకోకార్యక్రమం ఒకసారి ఉపయోగించిన వంట నూనెను తిరిగి ఆహార కార్యకలాపాల కోసం వినియోగించకుండాదానిని సురక్షితంగా పునరుద్ధరించేలా చూస్తుందినూనెను పదేపదే వేయించడానికి ఉపయోగిస్తే హానికరమైన టోటల్ పోలార్ కాంపౌండ్స్ (టీపీసీఏర్పడతాయిరక్తపోటుధమనులు పెళుసుబారడంకాలేయ రుగ్మతల వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందిప్రజారోగ్యాన్ని పరిరక్షించడం కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ 25% టీపీసీ పరిమితిని నిర్దేశించిందిఅంతకు మించి నూనెను ఉపయోగించకూడదుఈఈఈ వ్యూహం ప్రకారం (ఎడ్యుకేషన్ఎన్ఫోర్స్మెంట్ఎకోసిస్టమ్) - ఉపయోగించిన వంట నూనెను ఆహార వ్యాపారుల నుంచి సేకరించి బయోడీజిల్ లేదా సబ్బు ఉత్పత్తి కోసం వినియోగిస్తారుతద్వారా ఆరోగ్యంఇంధన భద్రతపర్యావరణ సుస్థిరతను ప్రోత్సహిస్తారు.

ముగింపు

స్థూలకాయం దేశంలో తీవ్రమైన ప్రజారోగ్య సవాలుగా ఉందిఅయితే సమగ్రమైనవివిధ రంగాల మధ్య సమన్వయంతో కూడిన విధానాలతో భారత్ క్రియాశీలకంగా దానిని ఎదుర్కొంటోందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆరోగ్యంపోషకాహారంఫిట్నెస్నియంత్రణ చర్యలను ఏకీకృతం చేస్తూ... వ్యూహాత్మక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందిఫిట్ ఇండియా మూమెంట్ఎన్పీ-ఎన్సీడీపోషణ్ అభియాన్ఈట్ రైట్ ఇండియాఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు ఆరోగ్య స్పృహముందస్తు సంరక్షణక్రియాశీల జీవనాలను పెంపొందిస్తున్నాయిఅమృతకాలం దిశగా భారత్ అడుగులేస్తున్న తరుణంలో.. దృఢమైనఆరోగ్యకరమైన భారత లక్ష్యం సాకారమవుతోందినిరంతర నిబద్ధతవివిధ రంగాల మధ్య సహకారంక్రియాశీల పౌర భాగస్వామ్యం ద్వారా స్థూలకాయాన్ని తిప్పికొట్టి భవిష్యత్తు తరాలను పరిరక్షించుకునేలా అత్యున్నత స్థానంలో దేశం నిలిచి ఉందిప్రజల్లో అవగాహన పెంచడానికిజీవనశైలిలో మార్పులువిధానపరమైన కార్యాచరణకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ఊబకాయాన్ని ఎదుర్కోవడంలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదుతద్వారా ఆరోగ్యంచైతన్యంసంపూర్ణ శ్రేయస్సు పునాదులుగా పురోగామి పథంలో దేశం పయనిస్తుంది.  

 

 

***

 


(Release ID: 2107903)