ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారిస్ లో భారత్-ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో ప్రధాని ప్రసంగం

Posted On: 11 FEB 2025 11:59PM by PIB Hyderabad

గౌరవనీయులైన అధ్యక్షుడు మాక్రాన్ గారికి,

ఇక్కడికొచ్చిన భారత్ఫ్రాన్స్ నాయకులకు,

నమస్కారాలుబాంజూర్!

ఉప్పొంగే ఉత్సాహం... ద్వేగంచైతన్యం ఈ సమావేశ మందిరంలో కనిపిస్తున్నాయిఇదో మామూలు వాణిజ్య కార్యక్రమం కాదు.

భారత్ఫ్రాన్సుల్లోని అత్యుత్తమ వాణిజ్యవేత్తల సమావేశమిదికొద్దిసేపటి కిందట అందించిన సీఈవో ఫోరం నివేదిక స్వాగతించదగినది.

సృజనసహకారంఅభ్యున్నతి’ని మంత్రప్రదంగా భావించి మీరు ముందుకు సాగుతుండడాన్ని నేను గమనించానుమీరు కేవలం ఉన్నతాధికారుల మధ్య వారధులు మాత్రమే కాదు.. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మీరు బలోపేతం చేస్తున్నారు.

మిత్రులారా,
నా మిత్రుడుఅధ్యక్షుడు మాక్రాన్ తో కలిసి ఈ ఫోరమ్ లో భాగస్వామినవడం సంతోషదాయకం. గత రెండేళ్లలో ఇది మన ఆరో సమావేశంతేడాది భారత గణతంత్ర దినోత్సవానికి అధ్యక్షుడు మాక్రాన్ ముఖ్య అతిథి.

ఈ ఉదయం మేం సంయుక్తంగా ఏఐ కార్యాచరణ సదస్సుకు సహాధ్యక్షత వహించాంఈ సదస్సు విజయవంతమైన సందర్భంగా అధ్యక్షుడు మాక్రాన్ కు నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,
కేవలం ప్రజాస్వామిక విలువలు మాత్రమే కాదు.. దృఢమైన విశ్వాసంఆవిష్కరణప్రజా సంక్షేమాల స్ఫూర్తి మన స్నేహానికి పునాదిగా నిలిచి భారత్ఫ్రాన్సులను అనుసంధానించాయి.

మన భాగస్వామ్యం కేవలం రెండు దేశాలకే పరిమితం కాదు. అంతర్జాతీయ సమస్యలుసవాళ్లను పరిష్కరించే దిశగా మనం కలిసి పనిచేస్తున్నాం. నేను చివరిసారి పర్యటించిన సమయంలో మన భాగస్వామ్యం కోసం 2047 ప్రణాళికను రూపొందించాంఅప్పటినుంచి ప్రతి రంగంలోనూ సమగ్రంగా మన సహకారాన్ని కొనసాగిస్తున్నాం.

మిత్రులారా,

మీ కంపెనీలు చాలా వరకు ఇప్పటికే భారతదేశంలో ఉన్నాయి. ఏరోస్పేస్నౌకాశ్రయాలురక్షణఎలక్ట్రానిక్స్డెయిరీరసాయనవినియోగదారీ వస్తువుల వంటి వివిధ రంగాల్లో మీరు క్రియాశీలకంగా ఉన్నారు.

భారత్ లో కూడా చాలా మంది సీఈవోలను కలిసే అవకాశం నాకు కలిగిందిగత దశాబ్ద కాలంలో భారత్ లో జరిగిన మార్పుల గురించి మీకు బాగా తెలుసు. స్థిరమైన రాజకీయ విధానాన్నీఅనువైన విధాన నిర్ణాయక వ్యవస్థలనూ మేం నెలకొల్పాం.

సంస్కరణఆచరణపరివర్తన’ పథంలో పయనిస్తున్న నేటి భారత్ ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థభారత్.

త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందినైపుణ్యం కలిగిన యువ ప్రతిభావంతులను తీర్చిదిద్దే కర్మాగారంగా నిలవడంఆవిష్కరణల స్ఫూర్తి అంతర్జాతీయ వేదికపై మాకు గుర్తింపునిస్తున్నాయి.

అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా భారత్ నేడు ఎదుగుతోంది.

భారత్ లో ఏఐసెమీ కండక్టర్క్వాంటంలపై భారీ ప్రాజెక్టులను మేం ప్రారంభించాంరక్షణలో మేక్ ఇన్ ఇండియామేక్ ఫర్ ది వరల్డ్‌ను మేం ప్రోత్సహిస్తున్నాంమీలో చాలా మందికి దీనితో అనుబంధం ఉందిఅంతరిక్ష సాంకేతికలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాం. ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ అవకాశం కల్పించాంభారత్ ను అంతర్జాతీయ బయోటెక్ శక్తి కేంద్రంగా శరవేగంగా తీర్చిదిద్దుతున్నాం.

మౌలిక సదుపాయాల అభివృద్ధి మాకు ప్రాధాన్య అంశం. వీటిపై ప్రభుత్వ వ్యయం ఏటా 114 బిలియన్ డాలర్లకు పైమాటేసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పెద్ద ఎత్తున రైల్వే లైన్లను నిర్మించడం ద్వారా.. రైల్వేలను ఆధునికీకరించిఉన్నతీకరించాం.

2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యం దిశగా మనం వేగంగా దూసుకుపోతున్నాంఇందుకోసం సోలార్ సెల్ తయారీని ప్రోత్సహించాం. కీలక ఖనిజాల మిషన్ ను కూడా మేం ప్రారంభించాంహైడ్రోజన్ మిషన్ ను కూడా చేపట్టాంఇందుకోసం ఎలక్ట్రోలైజర్ తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాం. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తును లక్ష్యంగా పెట్టుకున్నాంఇందులో ప్రైవేటు రంగానికి కూడా అవకాశం ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నానుఎస్ఎంఆర్ఏఎంఆర్ సాంకేతికతలపై మేం దృష్టి సారిస్తున్నాం.

మిత్రులారా,

వైవిధ్యంలోసంకటాలను పరిష్కరించడంలో అతిపెద్ద కేంద్రంగా నేడు భారత్ ఎదుగుతోందికొన్ని రోజుల కిందట కొత్త తరం సంస్కరణలను బడ్జెట్టులో పొందుపరిచాం.

సులభతర వాణిజ్యం కోసం సరికొత్త చర్యలు తీసుకుంటున్నాంగత కొన్నేళ్లలో 40,000కు పైగా అనుమతులను హేతుబద్ధీకరించాంవిశ్వసనీయత ఆధారంగా ఆర్థిక విధానాలను ప్రోత్సహించేందుకు నియంత్రణపరమైన సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాం. అలాగేసుంకాల విధింపు రేటును హేతుబద్ధీకరించాం.

అంతర్జాతీయ వాణిజ్యానికి సౌలభ్యం కలిగించడం కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల సహాయంతో ‘ఇండియా ట్రేడ్ నెట్’ను ప్రవేశపెడుతున్నాంజీవన సౌలభ్యాన్ని కల్పించడం కోసం సరికొత్త సరళీకృత ఆదాయపు పన్ను నియమావళిని తీసుకొస్తున్నాం.

జాతీయ తయారీ మిషన్ ను ప్రకటించాంతయారీ వంటి నూతన రంగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించాంమీరు ఈ కార్యక్రమాలన్నింటినీ జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.

భారతదేశానికి రావడానికి ఇదే సరైన సమయమని మీ అందరికీ నేను చెబుతున్నాను. అందరి పురోగతీ భారత పురోగతితో ముడిపడి ఉందిభారతీయ కంపెనీలు విమానాల కోసం విస్తృతంగా ఆర్డర్లు ఇచ్చి.. విమానయాన రంగాన్ని ఇందుకు ఉదాహరణగా నిలిపాయిఇప్పుడు మేం 120 కొత్త విమానాశ్రయాలను ప్రారంభించబోతున్నాంభవిష్యత్తులో మీకు ఎలాంటి అవకాశాలు లభిస్తాయో మీరే ఊహించుకోవచ్చు.

మిత్రులారా,
రక్షణఅధునాతన సాంకేతికతఆర్థిక సాంకేతిక లేదా ఔషధ రంగాలుసాంకేతిక లేదా వస్త్ర పరిశ్రమలువ్యవసాయం లేదా వైమానికంఆరోగ్య రక్షణ లేదా హైవేలుఅంతరిక్షం లేదా సుస్థిరాభివృద్ధి... ఏ రంగమైనా సరే, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ను సాకారం చేసుకోవాలన్నది 140 కోట్ల మంది భారతీయుల సంకల్పంఈ రంగాలన్నింటిలో పెట్టుబడులుసహకారం దిశగా మీ అందరికీ అనేక అవకాశాలున్నాయి.

భారత అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను.

ఫ్రాన్స్ యుక్తిభారత శక్తి కలిస్తే...

భారత్ వేగానికి ఫ్రాన్స్ ఖచ్చితత్వం తోడైతే...

ఫ్రాన్స్ సాంకేతికతభారత ప్రతిభ ఒకటైతే...

వాణిజ్యమే కాదు – ప్రపంచమే మారిపోతుంది.

మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు.

గమనిక – ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించు అనువాదంమౌలిక ప్రసంగం హిందీలో ఉంది.  

 

***


(Release ID: 2106334) Visitor Counter : 14