ప్రధాన మంత్రి కార్యాలయం
సాంకేతికత, పరీక్షల సమయంలో గాడ్జెట్ల వినియోగం, మితిమీరిన స్క్రీన్ టైమ్ వంటి అలవాట్ల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల్లో సందిగ్ధావస్థ నెలకొందన్న ప్రధానమంత్రి
Posted On:
12 FEB 2025 2:00PM by PIB Hyderabad
సాంకేతికత, పరీక్షల సమయంలో గాడ్జెట్ల వినియోగం, అవసరాన్ని మించి స్క్రీన్లకి సమయం కేటాయించడం వంటి అలవాట్ల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల్లో ఆందోళన నెలకొందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి, రేపు ప్రసారమయ్యే ‘పరీక్షా పే చర్చా’ 3వ కార్యక్రమాన్ని అందరూ తప్పక చూడాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.
‘ఎక్స్’ సామాజిక వేదికపై సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ చేసిన పోస్టుకి స్పందిస్తూ...
“సాంకేతికత.. పరీక్షల సమయంలో గాడ్జెట్ల వినియోగం, మితిమీరిన స్క్రీన్ టైమ్.. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద చిక్కు ప్రశ్నలు ఇవే. రేపు, అంటే ఫిబ్రవరి 13న ప్రసారమయ్యే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ఈ అంశాలను @TechnicalGuruji, @iRadhikaGupta చర్చిస్తారు. తప్పక చూడండి. #PPC2025 #ExamWarriors” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
MJPS/SR
(Release ID: 2102254)
Visitor Counter : 38
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam