ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పదేళ్లు పూర్తి చేసుకున్న స్వచ్ఛ భారత్: యువతతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


పాఠశాలల్లో బాలికల కోసం మరుగుదొడ్లను నిర్మించడంతో

స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా పరిశుభ్రతకు దిశగా తొలి అడుగు

‘‘పుట్టిన వెంటనే బాలికల కోసం ‘పీఎమ్ సుకన్య సమృద్ధి ఖాతా’’

ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై మీ చుట్టుపక్కల వారిని మేల్కొలపండి

‘‘గాంధీజీ స్వాతంత్ర్యాని కన్న స్వచ్ఛత ను మిన్నగా భావించారు; అన్నింటికన్నా పరిశుభ్రతకే విలువ ఇచ్చారు’’

పరిసరాల పరిశుభ్రతను అలవాటుగా మార్చుకుంటామంటూ

ప్రతి పౌరుడూ ప్రతిజ్ఞ చేయాలి. దీనిని కేవలం ఒక కార్యక్రమంగా చూడొద్దు

Posted On: 02 OCT 2024 4:40PM by PIB Hyderabad

స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను ప్రారంభించి నేటికి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భానికి గుర్తుగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిల్లీలో బడి పిల్లలతో పాటు పరిశుభ్రతా పరిరక్షణ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారువిద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛత వల్ల కలిగే లాభాలు ఏమిటో చెప్పండంటూ ప్రశ్నించారు. దాని వల్ల జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని ఒక విద్యార్థి జవాబిస్తూ.. స్వచ్ఛమైనటువంటిఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని తయారు చేసుకోవాలనే అవగాహనను మన ఇరుగు పొరుగులలో వ్యాప్తి చేసేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నాడుమరుగుదొడ్లు లేని కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయని మరో విద్యార్థి చెప్పాడు. చాలా మంది బహిర్భూమికి బహిరంగ ప్రదేశాలను ఎంచుకోక తప్పనిసరైన స్థితి ఇది వరకు ఉండేదనిదీతో రోగాలు పుట్టల్లా పెరిగాయనిమహిళలు చెప్పరాని అవస్థలు పడ్డారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారుపాఠశాలల్లో బాలికల కోసం విడిగా మరుగుదొడ్లను నిర్మించడంతో స్వచ్ఛ్ భారత్ అభియాన్ తొలి అడుగులు పడ్డాయనిబడికి వెళ్లడం మానేస్తున్న అమ్మాయిల సంఖ్య

ఈ చర్యతో ఒక్కసారిగా బాగా తగ్గిపోయిందని ప్రధానమంత్రి వివరించారు.

మహాత్మా గాంధీజీ జయంతినిఇంకా లాల్ బహాదుర్ శాస్త్రీజీ జయంతిని ఈ రోజున మనం జరుపుకొంటున్నట్లు ప్రధాన మంత్రి ప్రస్తావించారు. యోగాను అభ్యసిస్తున్న యువతీ యువకుల సంఖ్య పెరుగుతూ పోతుండడం పట్ల శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారుయోగాసనాలు ఎంత ప్రయోజనకరమన్న సంగతిని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారుకొందరు బాలలు ఈ సందర్భంగా ప్రధాని కళ్లెదుట కొన్ని ఆసనాలను వేయడంతోఅక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొట్టిమెచ్చుకొన్నారుమంచి పోషణ పైన శ్రద్ధ వహించవలసిన అవసరం ఉందని కూడా ప్రధాని అన్నారుపిఎమ్-సుకన్య యోజన గురించి మీకేం తెలుసో చెప్పగలరా అంటూ ప్రధానమంత్రి అడగడంతోఒక విద్యార్థి లేచి నిలబడి ఆ పథకాన్ని గురించి చెప్పాడుఆ పథకంలో బాలికల కోసం బ్యాంకులో ఖాతాను తెరవచ్చనివారు పెరిగి పెద్దయి తరువాత ఆ పథకం వారికి ఆర్థికంగా ఆదుకుంటుందని తెలిపాడుపీఎమ్ సుకన్య సమృద్ధి ఖాతాను ఆడపిల్లలు పుట్టగానే ప్రారంభించవచ్చని ప్రధాని చెబుతూ... ఏటా ఒక వేయి రూపాయలను జమ చేస్తూ ఉండాలనీ, ఆ విధంగా పోగైన డబ్బును ఆడపిల్లలు పెద్దవారయ్యాక వారి చదువుల కోసంపెళ్లి కోసం ఉపయోగించుకోవచ్చన్నారుఆ డిపాజిట్ పద్దెనిమిది సంవత్సరాల్లో 50 వేల రూపాయలు అవుతుందనీ, వడ్డీగా 32 వేల రూపాయల నుంచి 35 రూపాయల వరకు ఉంటుందని ఆయన అన్నారుఅమ్మాయిలకు 8.2 శాతం వరకు వడ్డీ ఇస్తారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

స్వచ్ఛత ప్రధానాంశంగా బాలలు ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను ప్రధానమంత్రి తిలకించారుగుజరాత్ లో నీటిఎద్దడి ఉన్న ప్రాంతంలో స్కూలు పిల్లల్లో ప్రతి ఒక్కరికీ ఒక మొక్కను అప్పగించివిద్యార్థులు రోజూ వారి ఇళ్లలో నుంచి నీటిని తీసుకు వచ్చి ఆ నీటిని మొక్కలకు పోయాలని చెప్పిన సంగతి తనకు తెలుసునని ఆయన చెప్పారుఅదే బడికి అయిదు సంవత్సరాల తరువాత తాను వెళ్లినప్పుడు అంతకు ముందు లేనటువంటి అపూర్వమైన పచ్చదనంతో ఆ పరిసరాలు కళకళలాడడం తాను చూశానని ప్రధాని అన్నారుచెత్తను వేరుపరచిఎరువును తయారు చేయడం వల్ల ఎన్ని లాభాలుంటాయో కూడా విద్యార్థినీవిద్యార్థులకు ప్రధాని తెలియజెప్పిఈ పనిని మీ ఇళ్ల వద్ద కూడా చేస్తూ ఉండండి అంటూ వారిని ప్రోత్సహించారు‘‘అలాగే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను గురించి కూడా మీ చుట్టుపక్కల వారు అందరూ అర్థం చేసుకొనేటట్టుగా చెప్పండి. దానికి బదులు గుడ్డతో తయారైన సంచీని వాడమనండి’’ అని కూడా ఆయన సూచించారు.

శ్రీ నరేంద్ర మోదీ బాలలతో మాట్లాడుతూ... అక్కడి బోర్డు మీద రాసి ఉన్న గాంధీజీ కళ్లద్దాలను చూపించి ‘‘ఇక్కడంతా స్వచ్ఛతను కాపాడుతున్నారో లేదోనని గాంధీ గారు గమనిస్తూంటారు. కాబట్టి ఈ విషయంలో సావధానంగా ఉండండి పిల్లలూ...’’ అని అన్నారుగాంధీ గారు బ్రతికి ఉన్నంత కాలం.. స్వచ్ఛత కోసం పాటుపడ్డారని ప్రధాని అన్నారుస్వాతంత్ర్యం, పరిశుభ్రతఈ రెండిటిలో మీరు దేనిని ఎంపిక చేసుకొంటారంటూ గాంధీ గారిని అడిగినప్పుడుయన స్వాతంత్ర్యం కన్నా స్వచ్ఛతనే ఎంచుకొన్నారుఎందుకంటే ఆయన దృష్టిలో స్వచ్ఛత కు మించింది మరేదీ లేదు అని శ్రీ మోదీ తెలిపారుస్వచ్ఛత ను కాపాడుకోవడాన్ని ఒక కార్యక్రమంగా చూడాలాలేక ఒక అలవాటుగా చూడాలా అని విద్యార్థులను అడిగిన మీదటవిద్యార్థులంతా ‘స్వచ్ఛతా పరిరక్షణను ఒక అలవాటుగా మార్చుకోవాలి’ అని ముక్తకంఠంతో బదులిచ్చారు‘‘శుభ్రపరచడం ఏ ఒక్క వ్యక్తి బాధ్యతోలేదా ఏ ఒక్క కుటుంబం బాధ్యతోలేదా ఒక్క సారితో ముగిసే కార్యక్రమమో కాదు.. అది ఒక మనిషి అతడు గానిఆమె గాని జీవించి ఉన్నంత వరకు అలా కొనసాగుతూ ఉండవలసిన కార్యమే పరిశుభ్రత’’ అని ప్రధాన మంత్రి అన్నారు‘‘నేను నా చుట్టుపక్కల ప్రాంతాలను ఎంతమాత్రం మురికిగా ఉండనివ్వను’’ అనేదే దేశంలో ప్రతి ఒక్కరు అనుసరించవలసిన విధి అని విద్యార్థులతో ఆయన చెప్పారుబాలల చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ‌ను ప్రధాన మంత్రి చేయించారు.

*****

MJPS/SR/TS



(Release ID: 2061195) Visitor Counter : 46