ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బహుమతుల వేలంలో పాల్గొని, నచ్చిన వాటిని కొనాలంటూ ప్రధాని విజ్ఞప్తి

प्रविष्टि तिथि: 19 SEP 2024 8:28PM by PIB Hyderabad

వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన జ్ఞాపికలను వేలం వేస్తున్నట్లు ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నానని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ వేలం నుంచి వచ్చే సొమ్ము నమామి గంగే కార్యక్రమానికి వెళ్తుందని ఆయన చెప్పారు. ఈ జ్ఞాపికలను సొంతం చేసుకోవడానికి pmmementos.gov.in మాధ్యమం ద్వారా నిర్వహించే వేలంపాటలో పాలుపంచుకోవాల్సిందంటూ పౌరులను ప్రధాని కోరారు.

ప్రధాన మంత్రి సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:

‘‘వివిధ కార్యక్రమాలలో నేను స్వీకరించే మెమెంటోలను ప్రతి ఏటా వేలం వేస్తుంటానుఈ వేలంలో అందే సొమ్ము నమామి గంగే కార్యక్రమానికి దక్కుతుందిఈ సంవత్సరం వేలం ప్రారంభమైందని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నానుమీకు ఆసక్తికరంగా తోచిన మెమెంటోలను సొంతం చేసుకోవడానికి వేలం పాటలో పాల్గొనగలరు.

pmmementos.gov.in


(रिलीज़ आईडी: 2056967) आगंतुक पटल : 78
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam