మంత్రిమండలి
azadi ka amrit mahotsav g20-india-2023

చంద్రుడు, మార్స్ గ్రహాల పరిశోధనల అనంతరం శుక్రగ్రహ ప్రయోగాలు చేపట్టేందుకు భారత్ సిద్ధం


శుక్ర గ్రహ వాతావరణం, దాని భూభౌతిక పరిస్థితుల అధ్యయనం ద్వారా

భారీ సమాచార సేకరణే లక్ష్యంగా శుక్రగ్రహ పరిశోధనకూ కేంద్ర మంత్రివర్గ ఆమోదం.

Posted On: 18 SEP 2024 3:12PM by PIB Hyderabad

శుక్రగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన శుక్ర గ్రహ పరిశోధనలకూ(వీనస్ ఆర్బిటర్ మిషన్ – వీఓఎంప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందిచంద్రుడుమార్స్ గ్రహాల అధ్యయనాల అనంతరంశుక్రగ్రహాన్ని గురించి లోతైన అవగాహన పెంపొందించుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిర్ణయం దోహదపడుతుందిభూమికి అతి సమీపంలో ఉన్న శుక్రగ్రహం కూడా భూమి ఏర్పడిన పరిస్థితులను పోలిన వాటితోనే ఏర్పడిందని భావిస్తారుభిన్నమైన వాతావరణాల్లో గ్రహాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని యోచిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగం నేతృత్వంలో రూపుదిద్దుకునే వీనస్ ఆర్బిటర్ మిషన్ కిందఒక స్పేస్ క్రాఫ్ట్ (విశ్వ వాహక నౌకశుక్రగ్రహ కక్ష్యలో పరిభ్రమిస్తూశుక్రగ్రహ ఉపరితలాన్నీఅంతర స్తరాన్నీభూగర్భాన్నివాతావరణ పరిస్థితులనీశుక్రగ్రహం వాతావరణంపై సూర్యుడి ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేస్తుందిఒకప్పుడు భూగ్రహంలాగే  ఆవాసయోగ్యంగా ఉన్న శుక్రగ్రహం మార్పులు ఎందుకు చోటు చేసుకున్నదీకారణాల అన్వేషణఅక్కాచెల్లెళ్ల వంటి ఈ రెండు గ్రహాలుభూమిశుక్రగ్రహం ఆవిర్భావం గురించిన  అమూల్యమైన సమాచారం లభించగలదని భావిస్తున్నారు.

అంతరిక్ష నౌక రూపకల్పనప్రయోగాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపడుతుందిసంస్థలో అమలులో ఉన్న సమర్ధమైన విధివిధానాల ద్వారా ఈ కార్యక్రమాల రూపకల్పనపర్యవేక్షణ జరుగుతుందిఅదేవిధంగా ఈ పరిశోధనల ద్వారా సమీకరించిన సమాచారాన్ని నేడున్న సమాచార విధానంలో శాస్త్ర ప్రపంచం ముందు ఉంచుతారు.

అందుబాటులో ఉండే అవకాశాలను బట్టిఈ మిషన్ ను 2028 మార్చి నాటికి పూర్తి చేయాలని తలపోస్తున్నారుదీని ద్వారా లభించే సమాచారం ఎన్నో జటిలమైన శాస్త్రపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదనితద్వారా అనేక నూతన ఆవిష్కరణలకు తలుపులు తెరుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారుఅంతరిక్ష నౌక నిర్మాణంప్రయోగం అనేక పరిశ్రమలు సంయుక్తంగా అందించే సహకారం వల్ల సాకారం కానుండగాఅనేక ఉపాధి అవకాశాలను ప్రాజెక్టు కల్పిస్తుందనికనుగొన్న సాంకేతిక అంశాలు ఆర్ధిక వ్యవస్థలోని అనేక రంగాలకు లబ్ధి చేకూర్చగలని భావిస్తున్నారు.

వీనస్ మిషన్ కు మొత్తం రూ.1236 కోట్లు కేటాయించగాఇందులో అంతరిక్ష నౌక నిర్మాణానికి రూ.824 కోట్లు ఖర్చు చేస్తారుఅంతరిక్ష నౌక అభివృద్ధి పనులుపేలోడ్ లుసాంకేతిక ఉపకరణాలుప్రపంచవ్యాప్త సహాయ కేంద్రాల ఏర్పాటు వ్యయంనావిగేషన్నెట్ వర్క్తదితర అంశాలపై మిగతా సొమ్ముని ఖర్చు చేస్తారు.

శుక్రగ్రహం వైపు ప్రయాణం

అధిక బరువులను తీసుకుపోయే వాహక నౌకలుతక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించడం వంటి వల్ల భవిష్యత్తులో భారత్ చేపట్టే విశ్వశోధనలకు ఇవన్నీ ఉపకరిస్తాయని భావిస్తున్నారుఇక అంతరిక్ష నౌకస్పేస్ క్రాఫ్ట్ తయారీలో భారత పరిశ్రమలు కీలక పాత్ర పోషించనున్నాయినౌక నిర్మాణండిజైన్అభివృద్ధిపరీక్షలుడేటా కుదింపుపరిశీలనవంటి తొలి దశల్లో విద్యార్థుల భాగస్వామ్యంవారికి తగిన శిక్షణనందించేందుకు వివిధ ఉన్నత విద్యా సంస్థలు భాగం కానున్నాయిఈ మిషన్ భారత వైజ్ఞానిక సమాజానికి విలువైన నూతన సమాచారాన్ని అందించగలదనితద్వారా వినూత్న అవకాశాలకు ద్వారాలు తెరవగలదని భావిస్తున్నారు.

 

***



(Release ID: 2056414) Visitor Counter : 78