గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

వచ్చే దశాబ్దంలోకి అలవోకగా స్వచ్ఛ భారత్ మిషన్


కేంద్రం అంచనా వేసిన 2 లక్షలను మించి రాబోయే 15 రోజుల్లో 5 లక్షల ప్రదేశాలలో చెత్తను శుభ్రం చేయనున్న రాష్ట్రాలు రికార్డు సృష్టించడానికి సిద్ధంగా భారత్

లక్షలాది మంది స్వచ్ఛంద శ్రమదానంతో వినూత్నంగా ప్రారంభం కానున్న ప్రచారం

Posted On: 17 SEP 2024 2:57PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 లో స్వచ్ఛభారత్ మిషన్ ను ప్రారంభించినప్పుడు దాని వల్ల వచ్చే మార్పు ప్రభావాన్ని కొద్ది మంది మాత్రమే ఊహించి ఉంటారు.  ప్రవర్తనాపరమైన మార్పు కోసం ప్రారంభమైన ఈ కార్యక్రమం శిశు మరణాలనూవ్యాధులనూ తగ్గించడంపాఠశాలకు హాజరయ్యే బాలికల సంఖ్యను పెంచడంమహిళలపై నేరాలను తగ్గించడంజీవనోపాధిని మెరుగుపరచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కార్యక్రమంగా స్వచ్ఛ భారత్ మారిందిస్వచ్ఛ భారత్ మిషన్ తన 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది స్వచ్ఛతా హీ సేవ (ఎస్హెచ్ ఎస్ ) 2024 ప్రచారం ‘స్వభావ స్వచ్ఛత – సంస్కార స్వచ్ఛత’ అనే ఇతివృత్తాన్ని స్వీకరించిందిరాజస్థాన్ లోని ఝున్ ఝున్  లో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ప్రచారం జాతీయ స్థాయిలో ప్రారంభమైందిముఖ్య అతిథిగా  ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్ హాజరైన ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణపట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ ఎంఎల్ ఖట్టర్రాజస్థాన్ సామాజిక న్యాయసాధికారి శాఖ మంత్రి శ్రీ అవినాష్ గెహ్లాట్ఇతర ప్రముఖులు పాల్గొన్నారు

ఎస్ హెచ్ ఎస్ 2024 మూడు ముఖ్యాంశాల కిందదేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారుపరిసరాల పరిశుభ్రత కోసం మూకుమ్మడిగా ప్రజలు పాల్గొనేందుకు దాదాపు లక్షల యూనిట్లను గుర్తించారు. పక్షం రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే పరిశుభ్రతా (స్వచ్ఛతా మే జన్ భాగీదారీ)  కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారుఇప్పటి వరకు ఏక్ పెడ్ మా కే నామ్ కార్యక్రమం కింద 36,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని రూపొందించారుదేశవ్యాప్తంగా 70,000కు పైగా సఫాయిమిత్ర సురక్షా శిబిరాల్లో సఫాయిమిత్రలు పాల్గొంటారుపౌరులు  ఎస్ హెచ్ ఎస్  పోర్టల్ Https://SwachhtaHiseva.gov.in/  లో ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

స్వచ్ఛ భారత్ మిషన్ గత దశాబ్ద కాలంలో పౌరులుసంస్థలురాష్ట్ర ప్రభుత్వాలుకేంద్ర మంత్రిత్వ శాఖలుస్వచ్ఛంద సంస్థలు పరిశ్రమల అలుపెరగని అంకితభావంస్వచ్చత పట్ల వాటి సమైక్య దృష్టితో ఉన్న గ్రామాలునగరాలలో గణనీయమైన మార్పు తెచ్చిందిదేశవ్యాప్తంగా గతంలో సురక్షిత పారిశుద్ధ్యం అందుబాటులో లేని సుమారు 12 కోట్ల కుటుంబాలకు ఇప్పుడు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు.

రాజస్థాన్ లోని ఝున్ ఝున్  లో ఎస్ హెచ్ ఎస్ 2024 ప్రచారం ప్రారంభ కార్యక్రమంలో భాగంగాదేశవ్యాప్తంగా పరిశుభ్రత కోసంమార్పు కోసం లక్షలకు పైగా లక్షిత ప్రాంతాలను గుర్తించడాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారుఇందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారుమోదా పహార్ వద్ద రూ.13.18 కోట్ల విలువైన 65 టిపిడి సామర్థ్యం కలిగిన ఆర్ డి ఎఫ్ కంపోస్ట్ ప్లాంట్ తో కూడిన ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు శ్రీ జగ్ దీప్ ధన్కడ్  శంకుస్థాపన చేసిస్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద ఝున్ ఝున్ ప్రజలకు అంకితం చేశారుబగ్గర్ రోడ్డులో 500 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ను కూడా ప్రారంభించారు.

200 మందికి పైగా ఎన్ సి సి క్యాడెట్లు, 100 మంది మేరా యువ (ఎంవైభారత్ వలంటీర్లు కేంద్ర మంత్రి ఎంఎల్ ఖట్టర్ తో కలిసి ఝున్ ఝున్ లోని పరిశుభ్రత టార్గెట్ యూనిట్ (సి టి యుప్రాంతంలో స్వచ్ఛతా కార్యక్రమంలో చేరడంతో కార్యక్రమం ఆ రోజు ప్రారంభమైందిఅనంతరం 'ఏక్ పెడ్ మా కే నామ్'  కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమంఎస్ హెచ్ ఎస్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు

ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ భారతదేశం స్వచ్చత పట్ల ఉత్తేజాన్ని చూపించడంలో ప్రపంచ ఉదాహరణగా నిలిచిందనిపెట్టుబడులకుఅవకాశాలకు అత్యంత సానుకూల ప్రోత్సాహక కేంద్రంగా నిలిచిందన్నారుచక్ర భ్రమణ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూమొదట్లో వ్యర్థాల చుట్టూ మనం ఉన్నామనిఇప్పుడు వ్యర్థాలు ఆర్థిక వ్యవస్థలో చక్ర భ్రమణాన్ని చేర్చిందని పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాల వృద్ధిలో స్వచ్చత ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారువికాస్ భారత్ దార్శనికతలో పాలుపంచుకునేందుకు దాదాపు 1.5 కోట్ల మంది యువత ముందుకు వచ్చిన మై (ఎంవైభారత్ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారుస్వచ్ఛ భారత్ ఉద్యమంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారువికసిత్ భారత్ అభివృద్ధి ప్రయాణంలో ముఖ్యంగా స్వచ్చత ద్వారా ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

కేంద్ర గృహనిర్మాణపట్టణ వ్యవహారాలవిద్యుత్ శాఖల మంత్రి శ్రీ ఎం.ఎల్.ఖట్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రచారంలో వ్యక్తిగత బాధ్యత ప్రాముఖ్యతను తెలియచేస్తూ ‘స్వభావంసంస్కారం రూపంలో స్వచ్చత’ అన్న ఇతివృత్తాన్ని తీసుకున్నట్టు చెప్పారుఈ 10 సంవత్సరాల విజయాలను సూచించే ప్రచారం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే లక్ష్యాన్ని సాధించాలని,  స్వచ్ఛ భారత్ పట్ల నిబద్ధతను పునరుద్ధరించాలని అన్నారు.  ఎస్ హెచ్ ఎస్ ప్రచారం ప్రాముఖ్యతను వివరిస్తూస్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్ బి ఎంతన తదుపరి విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంటున్నందున వివిధ భౌగోళిక ప్రాంతాల నుండి లక్షల సంఖ్యలో పౌరులు స్వచ్ఛ శ్రమదాన కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

రాజస్థాన్ లో జరిగిన ఎస్ హెచ్ ఎస్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో సఫాయిమిత్రఎమ్మెల్యేలుమేయర్లుప్రతిపక్ష నాయకులుమున్సిపల్ కమిషనర్లు ఉపరాష్ట్రపతితో ఆన్ లైన్ లో సంభాషించారు.

ఎస్ హెచ్ ఎస్ ప్రారంభ కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతిరాజస్థాన్ లోని ప్రతాప్ ఘడ్ కు చెందిన సఫాయి మిత్ర తరుణ్ దావ్రే మధ్య జరిగిన సంభాషణ ఒక ముఖ్య ఆకర్షణగా నిలిచిందిన్యూఢిల్లీ లో తమను కలవాలని దావ్రే కుటుంబాన్ని ఉప రాష్ట్రపతి ఆహ్వానించారుశ్రీ తరుణ్ దావ్రే కుమార్తెఎస్ టి సి రెండో సంవత్సరం విద్యార్థిని అయిన పూర్వ దావ్రేకు వారం రోజుల ఇంటర్న్ షిప్ అవకాశాన్ని కూడా అందించారుఅదే విధంగాతమ అతిథిగా భారత పార్లమెంటును సందర్శించడానికి లంబి అహిర్ గ్రామ సర్పంచి ఎం.ఎస్.నీరూ యాదవ్ ను ఉప రాష్ట్రపతి ఆహ్వానించారు.

నమస్తే పథకం కింద ఉప రాష్ట్రపతి సఫాయి మిత్రులను సత్కరించిపిఎమ్ఎవై ప్రయోజనాలువ్యక్తిగత రక్షణ పరికరాలుకిట్లను అందజేయడంతో కార్యక్రమం ముగిసింది.

 

***



(Release ID: 2055850) Visitor Counter : 39