ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీమతి అబేని తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భేటీ


భారత్-జపాన్ మధ్య బలమైన సంబంధాలపై పునరుద్ఘాటన

Posted On: 06 SEP 2024 8:51PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు జపాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి దివంగత షింజో అబే భార్య శ్రీమతి అబేతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సమావేశంలో, శ్రీ మోదీ దివంగత ప్రధానమంత్రి షింజో అబేతో తనకున్న సన్నిహిత వ్యక్తిగత స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. భారతదేశం-జపాన్ సంబంధాలపై అబే సాన్ కున్న బలమైన నమ్మకాన్ని ప్రస్తావించారు.

భార‌త‌దేశం పట్ల ఉన్న శ్రీమతి అబేకి ఉన్న నిరంతర అనుబంధానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధాన మంత్రి 'ఎక్స్' లో పోస్ట్ చేసారు;

“ఈ మధ్యాహ్నం శ్రీమతి అబేని కలవడం ఆనందంగా ఉంది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేతో నాకున్న సన్నిహిత స్నేహాన్ని గుర్తు చేసుకున్నాను. భారతదేశం-జపాన్ సంబంధాలపై అబే సాన్ కున్న విశ్వాసం మనకు శాశ్వతమైన బలాన్ని ఇస్తుంది. భారతదేశంతో శ్రీమతి అబే కొనసాగిస్తున్న లోతైన అనుబంధాన్ని ఎంతో అభినందిస్తున్నాను"



(Release ID: 2052804) Visitor Counter : 17