ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నిత్య శ్రీ శివన్ ను అభినందించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ

Posted On: 03 SEP 2024 10:53AM by PIB Hyderabad

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో కాంస్యం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నిత్య శ్రీ శివన్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ హెచ్6 విభాగంలో ఆమె ఈ పతకం సాధించారు.

ఆమె విజయం స్ఫూర్తిదాయకమని శ్రీ మోదీ అన్నారు.

ఎక్స్ లో ప్రధానమంత్రి ‘‘పారాలింపిక్స్ 2024 మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్ హెచ్6 విభాగంలో కాంస్యం సాధించిన నిత్య శ్రీ శివన్ కు అభినందనలు. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఈ విజయం ఆటపై ఆమెకున్న ప్రేమ, అంకిత భావానికి నిదర్శనం #Cheer4Bharat’’.

 

 

***

MJPS/RT



(Release ID: 2051246) Visitor Counter : 40