ప్రధాన మంత్రి కార్యాలయం

ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో కర్మాగార దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి సంతాపం


పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌ -గ్రేషియా ప్రకటన

Posted On: 22 AUG 2024 6:56AM by PIB Hyderabad

ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో ఒక కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో చనిపోయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్నిప్రకటించారు.  ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఈ దుర్ఘటనలో మృతుల దగ్గరి సంబంధికులకు 2 లక్షల రూపాయల వంతున, గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్- గ్రేషియాను కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

 
ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశంలో -

‘‘అనకాపల్లి లో ఒక కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణ నష్టం సంభవించడం నాకు వేదన కలిగించింది.  ప్రియతములను కోల్పోయిన వారికి  సంతాపాన్ని తెలియజేస్తున్నాను.  ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని  కోరుకొంటున్నాను.  మృతుల దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల వంతున, గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఎక్స్‌ గ్రేషియాను ఇవ్వడం జరుగుతుంది.  : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)’’.

 

 

***

MJPS/ST



(Release ID: 2047513) Visitor Counter : 54