ప్రధాన మంత్రి కార్యాలయం

డాక్టర్ ఎం.ఎస్. వలియాథన్ మృతి కి ప్రధాన మంత్రి సంతాపం

Posted On: 19 JUL 2024 8:48PM by PIB Hyderabad

ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధన రంగం లో మార్గదర్శి డాక్టర్ ఎం. ఎస్. వలియాథన్ మృతి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలియచేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్’ లో ఈ క్రిందివిధంగా పేర్కొన్నారు:

‘‘ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధన రంగం లో మార్గదర్శి డాక్టర్ ఎం. ఎస్. వలియాథన్ మరణించారని తెలిసి దు:ఖించాను. ఆయన సేవలు చెరపరాని ముద్ర ను వేయడమే కాక ఎంతో మంది ప్రజలకు మేలు చేశాయి.  ఆయనను మరీముఖ్యంగా చౌకైన, ఉత్తమ నాణ్యత కలిగిన నూతన ఆవిష్కరణలు చేసినందుకు గాను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన భారతదేశంలో వైద్య విద్య రంగంలో సంస్కరణల కోసం అందరి కన్న ముందు నిలచారు. ఆయన కుటుంబానికి, ఆయన అసంఖ్యాక అభిమానులకు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓం శాంతి.’’

 

 

***

DS/TS



(Release ID: 2035802) Visitor Counter : 5