ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 23 JUL 2024 9:59AM by PIB Hyderabad

శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

 

 

 

 

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

 

‘‘మహనీయుడు శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా, నేను ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయన భయమెరుగని నాయకుడు; ఆయనకు అచంచల ధైర్య, సాహసాలతో పాటు భారతదేశ స్వాతంత్ర్యం పట్ల నిబద్ధత వరదానం గా ప్రాప్తించాయి. ఆయన ఆదర్శాలు, ఆయన ఆలోచనలు లక్షల కొద్దీ ప్రజల, మరీ ముఖ్యంగా యువజనుల హృదయాలలోను, మస్తిష్కంలోను మారుమ్రోగుతూ ఉంటాయి.’’

 

 



(Release ID: 2035543) Visitor Counter : 13