ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీడోనాల్డ్ ట్రంప్ మీద జరిగిన దాడి ని ఖండించిన ప్రధాన మంత్రి

Posted On: 14 JUL 2024 9:15AM by PIB Hyderabad

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పూర్వ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ మీద జరిగిన దాడి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఈ రోజున ఖండించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంలో :

‘‘నా మిత్రుడు, పూర్వ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ మీద దాడి జరగడం నన్నెంతో కలచివేసింది. ఈ ఘటన ను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలలో, ప్రజాస్వామ్య వ్యవస్థలలో హింస కు తావు లేదు. శ్రీ డోనాల్డ్ ట్రంప్ త్వరగా పున:స్వస్థుడు కావాలని కోరుకుంటున్నాను. ప్రాణాలను కోల్పోయిన కుటుంబానికి, గాయపడ్డ వ్యక్తులకు మరియు అమెరికా ప్రజలకు కలిగిన దు:ఖంలో మేము సైతం పాలుపంచుకొంటున్నాం. వారికి ఓదార్పు లభించాలంటూ ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాం.

శ్రీ @realDonaldTrump." అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST



(Release ID: 2033113) Visitor Counter : 28