ప్రధాన మంత్రి కార్యాలయం

లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం

Posted On: 02 JUL 2024 9:39PM by PIB Hyderabad

గౌరవనీయులైన సభాపతి గారు,

రాష్ట్రపతి ప్రసంగానికి నా కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడకు వచ్చాను.

గౌరవనీయులైన సభాపతి గారు,

మన గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో అభివృద్ధి చెందిన భారతదేశ భావనను వివరించారుగౌరవనీయులైన రాష్ట్రపతి ముఖ్యమైన అంశాలను లేవనెత్తారుగౌరవనీయులైన రాష్ట్రపతి మనందరికీ మరియు దేశానికి అందించిన మార్గదర్శకానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గౌరవనీయులైన సభాపతి గారు,

రాష్ట్రపతి ప్రసంగంపై నిన్ననేడు పలువురు గౌరవ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారునేనుముఖ్యంగా మొదటిసారి ఎంపీలుగా మన మధ్యకు వచ్చినపార్లమెంటు లోని అన్ని నియమాలను పాటిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచిన గౌరవనీయులైన సహచరుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నానుఅనుభవజ్ఞులైన పార్లమెంటేరియన్ లాగా వారి ప్రవర్తన ఉందితొలిసారి ఇక్కడికి వచ్చినప్పటికీ సభా గౌరవాన్ని ఇనుమడింపజేసి తమ అభిప్రాయాలతో  చర్చను మరింత విలువైనదిగా చేశారు.

గౌరవనీయులైన సభాపతి గారు,

విజయవంతమైన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం ద్వారాఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రచారమని దేశం ప్రపంచానికి చూపించిందిప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రచారంలో దేశ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు.

గౌరవనీయులైన సభాపతి గారు,

నిరంతరం అసత్యాలు ప్రచారం చేసినాతాము ఘోర పరాజయాన్ని చవిచూశామని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ మూడోసారి దేశానికి సేవ చేసే అవకాశాన్ని భారత ప్రజలు మాకు ఇచ్చారనే కొందరి బాధను నేను అర్థం చేసుకోగలను సభాపతి గారు . ప్రజాస్వామ్య ప్రపంచానికి ఇది చాలా ముఖ్యమైన సంఘటనఇది చాలా గర్వించదగిన సంఘటన.

 

గౌరవనీయులైన సభాపతి గారు,

ప్రతి పరీక్షలోనూ మమ్మల్ని పరీక్షించిన తర్వాత దేశ ప్రజలు  తీర్పును ఇచ్చారుపదేళ్ల మా ట్రాక్ రికార్డును ప్రజలు చూశారుపేదల సంక్షేమం కోసం అంకితభావంతో చేసిన కృషి వల్ల ప్రజాసేవే ప్రథమ సేవ అనే నినాదంతో చేసిన కృషి వల్ల పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడడం ప్రజలు చూశారుదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి కాలంలో ఇంత తక్కువ  సమయంలో ఇంతమందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి చేసిన  విజయవంతమైన ప్రయత్నం  ఎన్నికల్లో మాకు ఆశీర్వాదం గా మారింది.

గౌరవనీయ సభాపతి గారు,

2014లో తొలిసారి గెలిచినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అవినీతిని సహించేది లేదని చెప్పాంఅవినీతి దేశాన్ని చెద పురుగుల్లా తుడిచిపెట్టేసిందిఅవినీతి కారణంగా ఇబ్బందులు పడుతున్న దేశంలోని సామాన్యులకు  రోజు మా ప్రభుత్వం ఒక సందేశం ఇచ్చినందుకు నేను గర్వపడుతున్నాను.  అటువంటి పరిస్థితిలోఅవినీతి పట్ల మా జీరో టాలరెన్స్ విధానానికి రోజు దేశం మమ్మల్ని ఆశీర్వదించింది.

గౌరవనీయ సభాపతి గారు,

నేడు ప్రపంచవ్యాప్తంగా భారత్ ఖ్యాతి పెరిగింది. నేడుభారతదేశం ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతోంది మరియు ప్రపంచం భారతదేశం వైపు చూస్తున్న తీరుకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు.

గౌరవనీయ సభాపతి గారు,

మా ఏకైక లక్ష్యం దేశం ప్రథమం , దేశమే సర్వ ప్రథమం అని దేశ ప్రజలు చూశారుమన ప్రతి విధానంమన ప్రతి నిర్ణయంమన ప్రతి చర్య అదే కొలమానాన్ని కలిగి ఉందిభారతదేశమే తొలి ప్రాధాన్యం అనే స్ఫూర్తితోమేము దేశంలో అవసరమైన సంస్కరణలను కొనసాగించాముగత 10 సంవత్సరాలలోమా ప్రభుత్వం 'సబ్కా సాథ్ సబ్కా వికాస్మంత్రంతో దేశంలోని ప్రజలందరి సంక్షేమం కోసం నిరంతరం ప్రయత్నిస్తోంది.

గౌరవనీయ సభాపతి గారు,

భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారంఅన్ని మతాల సమానత్వ భావన. స్ఫూర్తిని పాటిస్తూదేశానికి సేవ చేస్తూ భారత రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉన్నాం.

గౌరవనీయ సభాపతి గారు,

ఈ దేశం చాలా కాలంగా బుజ్జగింపు రాజకీయాలను చూసింది. ఈ దేశం చాలా కాలంగా బుజ్జగింపు యొక్క పాలనా నమూనాను చూసింది. మొదటిసారిగా సంపూర్ణ లౌకికవాదానికి ప్రయత్నించాంబుజ్జగింపు కాదుసంతృప్తి. మనం సంతృప్తి గురించి మాట్లాడినప్పుడుఇది ప్రతి పథకం యొక్క సంతృప్తత అని అర్థం. పాలన చిట్టచివరి వ్యక్తికి చేరుతుందన్న మా భావన దీని ద్వారా నెరవేరుతుంది. మనం సంతృప్త సూత్రాన్ని అనుసరించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం లభిస్తుంది. నిజమైన లౌకికవాదం సంతృప్తత ద్వారా సాధించబడుతుందిఅందుకే దేశ ప్రజలు మమ్మల్ని మూడవ సారి ఎన్నుకొని వారి తీర్పును తెలియజేశారు.

గౌరవనీయ సభాపతి గారు,

బుజ్జగింపు ఈ దేశాన్ని సర్వనాశనం చేసిందిఅందుకే అందరికీ న్యాయంఎవరినీ బుజ్జగించకూడదనే సూత్రాన్ని అనుసరించాం.

గౌరవనీయ సభాపతి గారు,

మా పదేళ్ల కృషిని గమనించిఅంచనా వేసిన తర్వాత భారత ప్రజలు మమ్మల్ని ఆదరించారు.

గౌరవనీయ సభాపతి గారు,

దేశంలోని 140 కోట్ల మంది పౌరులకు సేవ చేసే అవకాశం మాకు మరోసారి లభించింది.

గౌరవనీయ సభాపతి గారు,

భారత్ ప్రజలు ఎంత పరిణతితో ఉన్నారోఎంత న్యాయంగాఉన్నతమైన ఆదర్శాలతో తమ విజ్ఞతను ఉపయోగిస్తారో ఈ ఎన్నికలు రుజువు చేశాయి. తత్ఫలితంగామేము మీ ముందు ఉన్నాముమూడోసారి దేశ ప్రజలకు సేవ చేసేందుకు వినమ్రంగా సిద్ధంగా ఉన్నాం.

 

 

గౌరవనీయ సభాపతి గారు,

దేశ ప్రజలు మా విధానాలను చూశారు. ప్రజలు మా ఉద్దేశాలనుమా అంకితభావాన్ని విశ్వసించారు.

గౌరవనీయ సభాపతి గారు,

ఈ ఎన్నికల్లో గొప్ప సంకల్పంతో ప్రజల మధ్యకు వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నాం. మా 'వికసిత్ భారత్సంకల్పానికి ఆశీస్సులు కోరాం. సదుద్దేశంతోప్రజా సంక్షేమమే ధ్యేయంగా 'వికసిత్ భారత్'ను నిర్మించాలన్న నిబద్ధతతో ప్రజల్లోకి వెళ్లాం. 'వికసిత్ భారత్కోసం మా సంకల్పాన్ని ప్రజలు ఆమోదించి, మరోసారి దేశానికి సేవ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చారు.

గౌరవనీయ సభాపతి గారు,

దేశం అభివృద్ధి చెందితే కోట్లాది ప్రజల కలలు నెరవేరుతాయి. దేశం అభివృద్ధి చెందినప్పుడు కోట్లాది మంది ప్రజల తీర్మానాలు సాకారం అవుతాయి.

గౌరవనీయ సభాపతి గారు,

దేశం అభివృద్ధి చెందితేభవిష్యత్ తరాలకు వారి కలలను నెరవేర్చడానికి బలమైన పునాది వేయబడుతుంది.

గౌరవనీయ సభాపతి గారు,

'వికసిత్ భారత్యొక్క ప్రత్యక్ష ప్రయోజనం మన పౌరుల గౌరవంతో పాటు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడం. ఇది సహజంగానే 'వికసిత్ భారత్'తో లక్షలాది మంది పౌరుల భవితవ్యం నిర్ణయింపబడుతుంది . స్వాతంత్య్రానంతరం నా దేశంలోని సామాన్య పౌరుడు వీటి కోసం పరితపించాడు.

 

గౌరవనీయ సభాపతి గారు,

భారత్ అభివృద్ధి చెందినప్పుడుమన గ్రామాలు మరియు నగరాల పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల ఉంది. పల్లెల జీవనం గౌరవప్రదంగాఉన్నతంగా మారిఅభివృద్ధికి కొత్త అవకాశాలు ఆవిర్భవిస్తాయి. మన నగరాల అభివృద్ధి కూడా 'వికసిత్ భారత్'లో ఒక అవకాశంగా మారుతుందనిప్రపంచ అభివృద్ధి ప్రయాణంలో భారత్ నగరాలు సమానంగా నిలవాలన్నది మన కల.

గౌరవనీయ సభాపతి గారు,

'వికసిత్ భారత్అంటే లక్షలాది మంది పౌరులకు లక్షలాది అవకాశాలు లభిస్తాయి. అనేక అవకాశాలు లభిస్తాయిమరియు వారు వారి నైపుణ్యాలుసామర్థ్యాలు,వనరులను బట్టి అభివృద్ధి కొత్త సరిహద్దులను చేరుకోగలరు.

 

గౌరవనీయ సభాపతి గారు,

గౌరవనీయ సభాపతి గారు,

గౌరవనీయ సభాపతి గారు,

పూర్తి అంకితభావంనిజాయితీతో 'వికసిత్ భారత్సంకల్పాన్ని నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ఈ రోజు నేను మీ ద్వారా దేశప్రజలకు హామీ ఇస్తున్నాను. మన కాలపు ప్రతి క్షణంమన శరీరంలోని ప్రతి కణం మన దేశ ప్రజల 'వికసిత్ భారత్కలను సాకారం చేయడానికి అంకితం చేయబడతాయి. 2047 నాటికి దేశ ప్రజలకు 24 బై 7 పని చేస్తామని హామీ ఇచ్చాం. ఈ పనిని మనం తప్పకుండా పూర్తి చేస్తామని ఈ రోజు నేను ఈ సభలో పునరుద్ఘాటిస్తున్నాను.

గౌరవనీయ సభాపతి గారు,

2014 నాటి రోజులను గుర్తు చేసుకోండి. 2014 నాటి రోజులను స్మరించుకుంటే దేశ ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయారనిదేశం నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిందని అర్థమవుతుంది. 2014కు ముందు దేశం ఎదుర్కొన్న అతి పెద్ద నష్టం పౌరుల విశ్వాసాన్ని కోల్పోవడం. నమ్మకంఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు ఒక వ్యక్తిసమాజం లేదా దేశం నిలబడటం కష్టమవుతుంది. ఆ సమయంలో సామాన్యుడి పల్లవి ఏంటంటే.. ఈ దేశంలో ఏమీ చేయలేం. 2014కు ముందు 'ఈ దేశంలో ఏమీ చేయలేంఅనే ఏడు మాటలు ఎక్కడ చూసినా వినిపించాయి. ఆ మాటలు 2014కు ముందు భారత్ కు ఐడెంటిటీగా మారాయి. ప్రతిరోజూ వందల కోట్ల రూపాయల కుంభకోణాల వార్తలతో వార్తాపత్రికలు నిండిపోయాయి. పాత వాటితో పోటీ పడి కుంభకోణాలపై వార్తలు. మోసగాళ్లు చేస్తున్న కుంభకోణాల కాలం ఇది. ఢిల్లీ నుంచి పంపే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే గమ్యస్థానానికి చేరుకున్నాయన్న వాస్తవాన్ని సిగ్గులేని అంగీకారం తెలిపింది. ప్రతి రూపాయిలో 85 పైసల కుంభకోణం జరిగింది. ఈ అవినీతి యుగం దేశాన్ని నిరాశా నిస్పృహల్లోకి నెట్టింది. విధానపరమైన పక్షవాతం వచ్చింది. బంధుప్రీతి ఎంత విస్తృతంగా ఉందంటేతమను సిఫారసు చేయడానికి ఎవరైనా లేకపోతేతమ జీవితాలు ఇరుకున పడతాయని భావించి ఆశలు వదులుకున్నారు. ఇదీ పరిస్థితి. పేదలు ఇల్లు కావాలంటే వేలల్లో లంచాలు ఇవ్వాల్సి వచ్చేది.



(Release ID: 2032469) Visitor Counter : 19