ఉప రాష్ట్రపతి సచివాలయం
జులై 6 నుండి రెండు రోజుల పాటు కేరళను సందర్శించనున్న ఉపరాష్ట్రపతి
తిరువనంతపురం లోని భారత అంతరిక్ష, శాస్త్ర సాంకేతిక సంస్థ (ఐఐఎస్టీ) 12వ స్నాతకోత్సవ సభనుద్దేశించి ప్రసంగించనున్న ఉపరాష్ట్రపతి
Posted On:
04 JUL 2024 2:32PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కర్, డా. సుదేష్ ధన్కర్ లు ఈ నెల 6,7న రెండు రోజుల పాటు కేరళలో పర్యటిస్తారు.
శ్రీ ధన్కర్ తొలిరోజు తిరువనంతపురంలోని భారత అంతరిక్ష, శాస్త్ర సాంకేతిక సంస్థ (ఐఐఎస్టీ) 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, స్నాతకోత్సవ ప్రసంగాన్ని చేస్తారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరిట పతకాలను ప్రదానం చేస్తారు. మర్నాడు ఉపరాష్ట్రపతి కొల్లం, అష్టముడి బ్యాక్ వాటర్స్ ప్రాంతాలను సందర్శిస్తారు.
***
(Release ID: 2030873)
Visitor Counter : 9