భారత ఎన్నికల సంఘం

సార్వత్రిక ఎన్నికల రెండో దశ నిర్వహణపై 250 మంది పరిశీలకులతో ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్


సజావుగా.. స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా పోలింగ్ నిర్వహణపై నిర్దేశం;

ఈ దశ కింద దేశంలోని 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోగల
88 పార్లమెంటు నియోజకవర్గాల్లో 2024 ఏప్రిల్ 26న పోలింగ్;

పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన... ముఖ్యంగా వేసవి
నేపథ్యంలో సకల సౌకర్యాల కల్పనకు ఆదేశాలు

Posted On: 18 APR 2024 5:16PM by PIB Hyderabad

   సార్వత్రిక ఎన్నికల రెండోదశ కింద దేశంలోని 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 88 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 2024 ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహణకు సన్నాహాలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం 89 మంది సాధారణ, 53 మంది పోలీసు, 109 మంది వ్యయ పరిశీలకులు నియమితులయ్యారు. వీరంతా నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ... అంటే 2024 ఏప్రిల్ 3కు ముందుగానే తమ నియోజకవర్గాల్లో విధుల్లో చేరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్  శ్రీ రాజీవ్ కుమార్ ఆధ్వర్యాన కమిషనర్లు శ్రీ ఎస్.జ్ఞానేష్ కుమార్, శ్రీ సుఖ్‌బీర్ సింగ్ సంధు ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని సౌకర్యాలూ కల్పించేలా చూడాలని వారు పరిశీలకులను ఆదేశించారు. ముఖ్యంగా రెండో దశ ఓటింగ్‌ నేపథ్యంలో అక్కడికి సమీపాన ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా చూడాలని స్పష్టం చేశారు. అలాగే బలగాలను సవ్యంగా వినియోగించుకుంటూ శాంతిభద్రతలను పటిష్టంగా పర్యవేక్షించాలని కమిషనర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు పరిశీలకులను కోరారు.

కేంద్ర పరిశీలకులు పర్యవేక్షించాల్సిన కింది కీలకాంశాలపై తగిన నిర్దేశాలు ఇవ్వబడ్డాయి:

i

అన్ని నియోజక వర్గాల్లో ముందుగా పోలింగ్‌కు సంసిద్ధత సహా భాగస్వాములందరికీ... అంటే- అభ్యర్థులు, రాజకీయ పార్టీలన్నిటికీ సమాన అవకాశాలు కల్పించాలి.

ii

ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం తమకు కేటాయించబడిన పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా అందుబాటులో ఉండాలి.

  •  

III

నిర్దేశిత నియోజకవర్గాల పరిధిలో పరిశీలకుల రోజువారీ బస చిరునామా సహా మొబైల్/ ల్యాండ్‌లైన్/ఇమెయిల్ తదితర వివరాలను విస్తృత స్థాయిలో ప్రచురణ, ప్రచారం ద్వారా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు/సాధారణ ప్రజానీకం సౌలభ్యం కోసం అందుబాటులో ఉంచాలి.

  •  

IV

బలగాల నియామకం తమ సమక్షంలో యాదృచ్ఛికీకరణ ప్రాతిపదికన చేపట్టేలా చూడాలి.

v

కేంద్ర/రాష్ట్ర పోలీసు బలగాలను సముచిత/తటస్థ రీతిలో మోహరించాలి. ఈ ప్రక్రియ ఏదో ఒక రాజకీయ పార్టీ/అభ్యర్థికి అనుకూలం కాకుండా జాగ్రత్త వహించాలి

  •  

VI

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎం)/వివిప్యాట్ (వివిపిఎటి)లు, పోలింగ్ సిబ్బంది తమ సమక్షంలో యాదృచ్ఛికీకరణ ప్రాతిపదికన చేపట్టేలా చూడాలి.

vii

ఓటర్లలో 85 ఏళ్లు పైబడినవారికి, దివ్యాంగులకు ఇంటి వద్దనుంచే ఓటు వేసే ప్రక్రియను సుగమం చేయడంతోపాటు ఎన్నికలతోపాటు సర్వీసు, అత్యవసర విధుల్లోగల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి.

viii

రాజకీయ పార్టీలకు, పోటీలోగల అభ్యర్థులకు ఓటర్ల జాబితాలు సరఫరా చేయబడాలి.

  •  

IX

సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపును జిల్లా యంత్రాంగం పారదర్శకంగా చేపట్టే విధంగానూ, దానికి తగినట్లు రవాణా, సమాచార ప్రదానం తదితరాలకు పటిష్ట ఏర్పాట్లు చేసేలా చూడాలి.

x

సూక్ష్మ పరిశీలకులను నియమించాలి

  •  

XI

ఇవిఎం/వివిప్యాట్ యంత్రాలను అభ్యర్థులు/ప్రతినిధులందరి సమక్షంలో ప్రారంభించాలి.

xii

ఇవిఎం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణతోపాటు ఆ సమయంలో అభ్యర్థులందరి అధీకృత ఏజెంట్లు కూడా ఉండేలా చూడాలి.

xiii

అన్నిరకాల ఫిర్యాదుల పరిష్కారం కోసం తగిన యంత్రాంగాలు సిద్ధంగా ఉండేలా చూడాలి.

xiv

సకాలంలో దిద్దుబాటు చర్యల కోసం అధీకృత అధికారి పూర్తి పర్యవేక్షణలో జిల్లాల్లో సమీకృత కంట్రోల్ రూములు ఏర్పాటు చేసేలా చూడాలి.

xv

పోలింగ్ రోజుకు ముందే ఓటర్లకు చీటీల పంపిణీ 100 శాతం పూర్తయ్యేలా చూడాలి.

xvi

సి-విజిల్, ఓటర్ హెల్ప్‌ లైన్ అనువర్తనం, సక్షం అనువర్తనం, ఎన్‌కోర్, సువిధ అనువర్తనం వంటి అన్ని సమాచార సాంకేతిక అనువర్తనాల ఎన్నికల సిబ్బంది ఉపయోగిస్తారు కాబట్టి, ఈ ప్రక్రియలో వారందరికీ సరైన శిక్షణ ఇవ్వబడిందని నిర్ధారించుకోవాలి.

xvii

కౌంటింగ్ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు సహా పోలింగ్ సిబ్బంది మొత్తానికీ శిక్షణ సరైన రీతిలో, సముచితంగా నిర్వహించబడింది/ఇవ్వబడిందని నిర్ధారించుకోవాలి.

xviii

తమతమ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల సందర్శన, అన్ని కేంద్రాల్లో నిర్దేశిత కనీస సౌకర్యాల కల్పనను నిర్ధారించుకోవాలి.

xix

ఓటర్ల సౌకర్యార్థం అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద సహాయ శిబిరం ఏర్పాటుసహా దివ్యాంగులు, శారీరకంగా బలహీనులు, మహిళలు, వృద్ధులు, కుష్టువ్యాధి పీడిత ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా చూడాలి.

xx

తమ వంతు కోసం వరుసలో వేచి ఉండే ఓటర్లకు తాగునీరు, షెడ్లు/షామియానాలు సహా పోలింగ్ సమయంలో కేంద్రాల వెలుపల సముచిత విరామ ఏర్పాట్లు చేయాలి.

xxi

ఆకస్మిక తనిఖీ బృందాలు, గణాంక నిఘా బృందాలు, వీడియో పర్యవేక్షణ బృందాలు, సరిహద్దు తనిఖీ కేంద్రాలు, రహదారి తనిఖీ తదితరాలు 24 గంటలూ నిర్వహిస్తూ నగదు, మద్యం, ఉచితాల పంపిణీతోపాటు మత్తుపదార్థాలు/మాదక ద్రవ్యాల తరలింపు నిరోధానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

xxii

రాజకీయ ప్రకటనలు, చెల్లింపు వార్తల ముందస్తు నిర్ధారణ కోసం మీడియా ధ్రువీకరణ, పర్యవేక్షణ కమిటీలు సరైన రీతిలో పనిచేసేలా చూడాలి.

xxiii

బూటకపు వార్తలు/తప్పుడు సమాచారాన్ని సకాలంలో అరికట్టడంతోపాటు సానుకూల కథనాలు వెలువడేలా సమాచారాన్ని చురుగ్గా ప్రదానం చేసేలా చూడాలి

 

***



(Release ID: 2018241) Visitor Counter : 73