రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పత్రికా ప్రకటన

Posted On: 19 MAR 2024 10:53AM by PIB Hyderabad

తెలంగాణ కు గవర్నరు మరియు పుదుచ్చేరి కి లెఫ్టినెంట్ గవర్నరు అయిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సమర్పించిన రాజీనామా ను భారత రాష్ట్రపతి ఆమోదించారు.

 

యథావిధి గా ఏర్పాటుల ను చేసేటంత వరకు, తెలంగాణ కు గవర్నరు గాను మరియు పుదుచ్చేరీ కి లెఫ్టినెంట్ గవర్నరు గాను విధుల ను నిర్వహించడం కోసం ఝార్‌ ఖండ్ గవర్నరు శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ను నియమిస్తున్నట్లు భారత రాష్ట్రపతి తెలిపారు. శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఆయన స్వీయ బాధ్యతల కు తోడు ఈ విధుల ను అదనం గా నిర్వహిస్తారు.

 

పైన పేర్కొన్న నియామకం శ్రీ సి.పి. రాధాకృష్ణన్ పదవీ బాధ్యతల ను స్వీకరించే తేదీ నాటి నుండి అమలు లోకి వస్తుంది.

 

***



(Release ID: 2015493) Visitor Counter : 107