భారత ఎన్నికల సంఘం

ఎన్నికల కమిషనర్లుగా శ్రీ జ్ఞానేష్ కుమార్, శ్రీ సుఖ్‌బీర్ సింగ్ సంధు బాధ్యతలు స్వీకారం

Posted On: 15 MAR 2024 1:53PM by PIB Hyderabad

భారత ఎన్నికల సంఘం కమిషనర్లుగా శ్రీ జ్ఞానేష్ కుమార్, డా.సుఖ్‌బీర్ సింగ్ సంధు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్, కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్లకు నిర్వచన్ సదన్‌లో స్వాగతం పలికారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ఈసీఐ బృందం సిద్ధంగా ఉన్న ఈ చారిత్రాత్మక సమయంలో, కొత్త కమిషనర్ల చేరిక ప్రాముఖ్యతను ఆయన స్పష్టం చేశారు.

 

కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకం నోటిఫికేషన్ ఈ నెల 14న గెజిట్‌లో వచ్చింది. శ్రీ జ్ఞానేష్ కుమార్, డా.సుఖ్‌బీర్ సింగ్ సంధు 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికార్లు. కేరళ, ఉత్తరాఖండ్ కేడర్‌కు చెందినవారు.

***



(Release ID: 2015123) Visitor Counter : 147