ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్ కోట్ కు నా హృదయంలో అత్యంత ప్రత్యేక స్థానం ఉంది : పిఎం
Posted On:
24 FEB 2024 6:59PM by PIB Hyderabad
రాజ్ కోట్ తో తన బంధం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు . మోదీ ఆర్కైవ్స్ లోని ఒక పోస్ట్ ను ఎక్స్ పోస్ట్ లో పంచుకున్నారు.
సరిగ్గా 22 సంవత్సరాల క్రితం రాజ్ కోట్ తో తనకు గల అనుబంధాన్ని తెలియజేస్తూ రాజ్ కోట్ 2 బై ఎలక్షన్ లో తాను గెలిచి తొలి సరిగా గుజరాత్ అసెంబ్లీలో ఎంఎల్ఏగా అడుగు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధానమంత్రి 2022 ఫిబ్రవరి లో ప్రధానమంత్రి మోదీ ఆర్కైవ్స్ లో ఒక పోస్ట్ పెట్టారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
“రాజ్ కోట్ కు నా హృదయంలో ఎల్లప్పుడూ అత్యంత ప్రత్యేక స్థానం ఉంది. ఈ నగర ప్రజలే నాపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో తొలి విజయం అందించారు. అప్పటి నుంచి నేను జనతా జనార్దన్ ఆకాంక్షలకు న్యాయం చేయడానికే ఎల్లప్పుడూ కృషి చేశాను. నేను నేడు, రేపు గుజరాత్ లో ఉండడం, 5 ఎయిమ్స్ ను జాతికి అంకితం చేసే కార్యక్రమం రాజ్ కోట్ లో జరుగుతూ ఉండడం యాదృచ్చికమే” అని తెలిపారు.
(Release ID: 2009006)
Visitor Counter : 93
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam