ప్రధాన మంత్రి కార్యాలయం
రేడియో రంగం లో ప్రసిద్ధుడు అయిన శ్రీ అమీన్ సయానీకన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
21 FEB 2024 1:02PM by PIB Hyderabad
రేడియో రంగం లో ప్రసిద్ధుడు అయినటువంటి శ్రీ అమీన్ సయానీ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం లో ప్రసార రంగం యొక్క క్రాంతి ని తీసుకు రావడం లో అమీన్ సయానీ గారు ప్రముఖ పాత్ర ను పోషించడం తో పాటు గా తన కృషి ద్వారా శ్రోతల తో ఒక విశేష సంబంధాన్ని కూడా ఏర్పరచుకొన్నారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘రేడియో లో శ్రీ అమీన్ సయానీ గారు వినిపించే మృదు మధుర గళం లో ఒక తీయందనం మరియు ఉత్సాహం కలగలుపు గా ఉండి, తరాల అంతరాల కు అతీతం గా ఎంతో మంది కి ఆయన ను అభిమాన పాత్రుని గా మార్చివేసింది. ఆయన తన కృషి తో, భారతదేశం లో ప్రసార రంగం లో క్రాంతి ని తీసుకు రావడం లో ఒక ప్రధానమైన భూమిక ను పోషించారు; అంతేకాకుండా, తన శ్రోతల తో ఎంతో ఆప్యాయభరితమైనటువంటి బంధాన్ని పెనవేసుకొన్నారు. ఆయన మరణించారని తెలిసి దుఃఖించాను. ఆయన యొక్క కుటుంబాని కి, ఆయన ను అభిమానించే వారి కి మరియు రేడియో ప్రేమికులు అందరికీ ఇదే సంతాపం. ఆయన ఆత్మకు శాంతి ని ఆ ఈశ్వరుడు ప్రసాదించు గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 2007708)
Visitor Counter : 149
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam