ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ కర్పూరి ఠాకూర్ పుణ్య తిథి సందర్బంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 17 FEB 2024 7:03PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 18వ తేదీన శ్రీ కర్పూరి ఠాకూర్ పుణ్య తిథి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీ కర్పూరి ఠాకూర్ సమాజంలోని వెనుకబడిన మరియు బలహీన వర్గాల గౌరవం, సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని శ్రీ మోదీ అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ కర్పూరి ఠాకూర్ గురించి తన ఇటీవలి ప్రసంగం నుండి తన ఆలోచనలను కూడా పంచుకున్నారు. ప్రధాన మంత్రి X లో పోస్ట్ చేసారు; “కర్పూరీ ఠాకూర్ జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు వందనాలు. భారతదేశంలోని ఈ ప్రముఖ నాయకుడు సమాజంలోని వెనుకబడిన మరియు బలహీన వర్గాల గౌరవం మరియు సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కొన్ని రోజుల క్రితం నేను అతని గురించి ఈ ఆలోచనలను పంచుకున్నాను ..." అని ప్రధాని పేర్కొన్నారు. 

 

 

 

***



(Release ID: 2007014) Visitor Counter : 60