ప్రధాన మంత్రి కార్యాలయం

కతర్ లోని దోహా కు చేరుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 15 FEB 2024 1:30AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ కు ఆధికారిక సందర్శన లో భాగం గా ఈ రోజు న దోహా కు చేరుకొన్నారు. దోహా ను ప్రధాన మంత్రి సందర్శించడం ఇది రెండో సారి, ఆయన 2016 వ సంవత్సరం జూన్ లో మొట్టమొదటి సారి గా కతర్ కు వచ్చారు.

 

 

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ సుల్తాన్ బిన్ సాద్ అల్-మురైఖీ విమానాశ్రయం లో ప్రధాన మంత్రి కి ఆహ్వానం పలికారు.

 

 

ప్రధాన మంత్రి తన రెండు రోజు ల సందర్శన లో భాగం గా, తన గౌరవార్థం కతర్ ప్రధాని శ్రీ శేఖ్ మ‌హ‌మ్మ‌ద్ బిన్ అబ్దుల్‌రహమాన్ అల్‌ థానీ ఈ రోజు రాత్రి పూట ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఫిబ్రవరి 15 వ తేదీ న కతర్ యొక్క అమీరు శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ తో ప్రధాన మంత్రి సమావేశం కావడం తో పాటు గా ద్వైపాక్షిక అంశాల పై, ప్రాంతీయ అంశాల పై మరియు ప్రపంచ అంశాల పై చర్చలు జరుపుతారు.

 

 

***



(Release ID: 2006205) Visitor Counter : 84