ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌లోని హర్దాలోని ఒక టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనకు ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.


పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి.

प्रविष्टि तिथि: 06 FEB 2024 5:43PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్‌లోని హర్దాలో ఒక టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. పి.ఎం.ఎన్‌.ఆర్‌.ఎఫ్‌ నుంచి ప్రధానమంత్రి బాదితుల వారసులకు, 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ప్రధానమంత్రి 50,000 రూపాయల సహాయం ప్రకటించారు..
ఇందుకు సంబంధించి ప్రధానమంతఇ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌ లో ఒక పోస్ట్‌ పెడుతూ,
‘‘హర్దాలో బాణాసంచా కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో కొందరు ప్రజలు ప్రాణాలు కోల్పోవడం,బాధకలిగించింది. ఈ దుర్ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.  స్థానిక పాలనా యంత్రాంగం బాధితులకు సహాయం అందిస్తోంది. మరణించిన వారి వారసులకు పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నిధి నుంచి రెండు లక్షల రూపాయలు,గాయపడిన వారికి రూ 50,000 రూపాయలు అందివ్వనున్నారు.

 


(रिलीज़ आईडी: 2004452) आगंतुक पटल : 73
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam