ప్రధాన మంత్రి కార్యాలయం

అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపడంతో ఈ కొత్త రైళ్లు ప్రారంభం

ఆరు కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు

Posted On: 30 DEC 2023 4:47PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  పునః అభివృద్ధి  చేసిన అయోధ్య రైల్వే స్టేష‌న్‌ను ప్రారంభించారు. కొత్త అమృత్ భార‌త్ రైళ్లు, వందే భార‌త్ రైళ్ల‌ను జెండా ఊపి పట్టాలెక్కించారు. అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో  ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ 10 వేల మంది సామర్థ్యం కలిగి ఉందని, ఇప్పుడు ఇది పునరుద్ధరణ పూర్తయిన తర్వాత సామర్థ్యం 60 వేలకు చేరుకుంటుందని అన్నారు. వందే భారత్, నమో భారత్ తర్వాత కొత్త రైలు సిరీస్ ‘అమృత్ భారత్’ రైళ్ల గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మొదటి అమృత్ భారత్ రైలు అయోధ్య మీదుగా వెళుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ రోజు ఈ రైళ్లను పొందినందుకు యూపీ, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

ఆధునిక అమృత్ భారత్ రైళ్లకు ఆధారమైన పేదలకు సేవా భావాన్ని ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. “పని కారణంగా తరచూ దూర ప్రయాణాలు చేసేవారు, అంత ఆదాయం లేనివారు కూడా ఆధునిక సౌకర్యాలు, సౌకర్యవంతమైన ప్రయాణాలకు అర్హులు. ఈ రైళ్లు పేదల జీవితంలో గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి” అని ఆయన తెలిపారు. అభివృద్ధిని వారసత్వంతో ముడిపెట్టడంలో వందేభారత్ రైళ్లు పోషిస్తున్న పాత్రను కూడా ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. “దేశంలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాశీ నుండి నడిచింది. నేడు దేశంలోని 34 రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. వందే భారత్ కాశీ, కత్రా, ఉజ్జయిని, పుష్కర్, తిరుపతి, షిర్డీ, అమృత్‌సర్, మదురై వంటి ప్రతి పెద్ద విశ్వాస కేంద్రాలను కలుపుతుంది. ఈ క్ర‌మంలో ఈరోజు అయోధ్య‌కి వందే భార‌త్ రైలు బహుమతి కూడా వ‌చ్చింద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు.

అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌గా పిలువబడే అయోధ్య రైల్వే స్టేషన్  పునః అభివృద్ధి 1వ దశ రూ. 240 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. మూడు అంతస్తుల ఆధునిక రైల్వే స్టేషన్ భవనంలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజ అవసరాల కోసం దుకాణాలు, క్లోక్ రూమ్‌లు, పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాళ్లు వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. స్టేషన్ భవనం 'అందరికీ అందుబాటులో ఉంటుంది'. ఇది 'ఐజిబిసి సర్టిఫైడ్ గ్రీన్ స్టేషన్ భవనం'.

అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని దేశంలోని సూపర్‌ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లలో కొత్త కేటగిరీని ఫ్లాగ్ చేయడం ద్వారా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. అమృత్ భారత్ రైలు అనేది ఎయిర్ కండిషన్ లేని కోచ్‌లతో కూడిన ఎల్హెచ్బి పుష్ పుల్ రైలు. మెరుగైన వేగం కోసం ఈ రైలు రెండు చివర్లలో లోకోలను కలిగి ఉంటుంది. అందమైన, ఆకర్షణీయంగా డిజైన్ చేయబడిన సీట్లు, మెరుగైన లగేజీ ర్యాక్, తగిన మొబైల్ హోల్డర్‌తో మొబైల్ ఛార్జింగ్ పాయింట్, ఎల్ఈడి లైట్లు, సీసీటీవీ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి మెరుగైన సౌకర్యాలను ఇది రైలు ప్రయాణీకులకు అందిస్తుంది. ఆరు కొత్త వందే భారత్ రైళ్లను కూడా ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

దర్భంగా-అయోధ్య-ఆనంద్ విహార్ టెర్మినల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, మాల్డా టౌన్-సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినస్ (బెంగళూరు) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
అమృత్ రైళ్ల తొలి యాత్రలో ప్రయాణిస్తున్న పాఠశాల విద్యార్థులతో ప్రధాన మంత్రి సంభాషించారు.

ఆరు కొత్త వందే భారత్ రైళ్లను కూడా ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా-న్యూ ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; అమృత్‌సర్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; కోయంబత్తూరు-బెంగళూరు కాంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; మంగళూరు-మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; జల్నా-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు అయోధ్య-ఆనంద్ విహార్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.

ఈ ప్రాంతంలో రైలు మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు రూ. 2300 కోట్ల విలువైన మూడు రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్ట్‌లలో రూమా చకేరి-చండేరి మూడవ లైన్ ప్రాజెక్ట్; జౌన్‌పూర్-అయోధ్య-బారాబంకి డబ్లింగ్ ప్రాజెక్ట్‌లోని జౌన్‌పూర్-తులసీ నగర్, అక్బర్‌పూర్-అయోధ్య, సోహవల్-పత్రాంగ మరియు సఫ్దర్‌గంజ్-రసౌలీ విభాగాలు; మరియు మల్హౌర్-దాలిగంజ్ రైల్వే సెక్షన్ డబ్లింగ్ మరియు విద్యుదీకరణ ప్రాజెక్ట్. 

 

 

***

DS



(Release ID: 1991995) Visitor Counter : 88